అదేం ఖర్మమో కానీ.. ఏపీ పోలీసులుకు ఇటు కోర్టుల నుంచి అటు కేంద్రం నుంచి కూడా విమర్శలు తప్ప డం లేదు. అనేక విషయాల్లో ఏపీ పోలీసులు అనుసరిస్తున్న వైఖరి పై కోర్టులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనేక సందర్భాల్లో పోలీసు ఉన్నతాధికారులను తమ వద్దకు పిలుచుకుని వార్నింగులు కూడా ఇచ్చాయి. అయినప్పటికీ.. వారిలో మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘటనలు మరోసారి ఏపీ పోలీసులకు వార్నింగ్ ఇప్పించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే.. దీనికి అనుమతి లేదని.. రోడ్ షోలో ప్రసంగాలు వద్దని పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో పెద్ద వివాదమే అయింది. ఇక, చంద్రబాబు వెంటనే అనపర్తి నుంచి బిక్కవోలులోని దేవీ చౌక్ వరకు పాదయాత్ర చేశారు. అయితే.. ఆయన జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్నారు. ఈ విషయం రాష్ట్ర పోలీసులకు కూడా తెలుసు.
అయినప్పటికీ.. కనీసం ఆయనకు భద్రత కల్పించకపోగా.. దిక్కులు చూశారు. ఏడు కిలోమీటర్ల మేర చంద్రబాబు నడిస్తే.. ఆ మేరకు పోలీసులు కనీసం.. భద్రత కల్పించకపోగా.. ఎలాంటి చర్యలూ తీసుకో లేదు. ఇదే సమయంలో చంద్రబాబు పై ఏదైనా దాడి జరిగి ఉంటే.. ఆయనను ఎవరైనా కొట్టి ఉంటే.. ఇంకేదై నా చేసి ఉంటే.. ఏంటి పరిస్థితి? ఈ ప్రశ్నలు ఎవరో టీడీపీ నాయకులు.. చంద్రబాబుఉ అంటే అభిమానం ఉన్నవారు.. ఆయన అనుకూల మీడియా వేసినవి కావు.
సాక్షాత్తూ.. చంద్రబాబుకు భద్రతగా ఉన్న ఎన్ ఎస్ జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్) అడిగిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలతోనే వారు కేంద్రంలోని ఎన్ ఎస్ జీ(హోం శాఖ పరిధిలో ఉండే కార్యాలయం) అధికారులకు నివేదిక పంపారు. రాష్ట్ర పోలీసుల నిర్వాకాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. ఇలా అయితే.. మేం ఏం చేయాలి? అని కూడా వారు ప్రశ్నించారు. 30 పేజీలతో కూడిన ఈ నివేదిక ప్రస్తుతం కేంద్రానికి చేరింది. దీంతో ఏపీ పోలీసులకు ఈసారి గట్టివార్నింగ్ తప్పదనే అంటున్నారు రిటైర్డ్ పోలీసు అధికారులు.
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…