టీడీపీ అధినేత చంద్రబాబు పేరెత్తితే ఒంటి కాలు మీద లేస్తారు వైసీపీ నంబర్ 2 విజయసాయిరెడ్డి. చంద్రబాబు, తెలుగుదేశం నేతలు కూడా విజయసాయిరెడ్డిపై అంతే స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. ఈ ఇద్దరు నాయకులు కలిసిన సందర్భం, మాట్లాడుకున్న సందర్భం ఇంతవరకు ఎవరూ చూడలేదు. అలాంటిది నందమూరి తారకరత్న మృతి సందర్భంగా పరామర్శించేందుకు వచ్చిన ఈ ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
కార్డియాక్ అరెస్ట్తో 23 రోజులుగా చికిత్స పొందుతూ మరణించిన నందమూరి తారకరత్న కొద్దికాలంగా టీడీపీలో యాక్టివ్గా తిరుగుతున్నారు. ఎన్టీఆర్కు స్వయాన మనవడు అయిన తారకరత్న చంద్రబాబుకు బావమరిది కుమారుడు అవుతారు. అదేసమయంలో ఆయనకు విజయసాయిరెడ్డి తో నూ దగ్గరి బంధుత్వం ఉంది. విజయసాయిరెడ్డి భార్య సోదరికి తారకరత్న అల్లుడు.
దీంతో తారకరత్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా విజయసాయిరెడ్డి వెళ్లారు. అక్కడ తారకరత్న ఆరోగ్యం గురించి అంతా తానై చూసుకుంటున్న నందమూరి బాలకృష్ణతోనూ సాయిరెడ్డి మాట్లాడారు. అయితే, వైద్యుల ప్రయత్నాలేవీ ఫలించక తారకరత్న మరణించడంతో ఆయన మృతదేహాన్ని హైదరాబాద్లోని సొంతింటికి తెచ్చారు.
అక్కడ సినీ, రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు తారకరత్న మృతదేహానికి నివాళులర్పించారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు, విజయసాయిరెడ్డి అక్కడకు వచ్చారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా తారకరత్న కుమార్తెను విజయసాయిరెడ్డి చంద్రబాబుకు పరిచయం చేశారు. చంద్రబాబుతో విజయసాయిరెడ్డి చాలా సమయం మాట్లాడారు. ఇద్దరూ తారకరత్న గురించే మాట్లాడుకున్నారు. ఆయన వ్యక్తిత్వం, మంచితనం, కుటుంబం, పిల్లలు వంటి విషయాలన్నీ ఇద్దరూ మాట్లాడుకుని… తారకరత్న చనిపోవడం పై బాధపడ్డారు.
కాగా… తన సోదరుడి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్తో, కల్యాణ్ రామ్లతోనూ విజయసాయిరెడ్డి మాట్లాడారు.
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…