ఏపీలో జంప్ జిలానీలు ఇంకా పెరుగుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ జంప్ చేసే నేతల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ కంటే కూడా.. వైసీపీలో ఎక్కువగా జంప్ చేసే నేతలు పెరుగుతున్నారని పార్టీలోనే గుసగుస వినిపిస్తోంది. సీఎం జగన్పై మునుపు ఉన్న విశ్వాసం .. ఇప్పుడు నేతలకు లేకుండా పోయిందని కూడా అంటున్నారు.
అయితే.. ఎవరూ కూడా ఇప్పటికిప్పుడు బయటపడడం లేదు. ఎన్నికలకు మూడు లేదా.. ఆరు మాసాల ముందు.. వైసీపీలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందు కంటే.. తమకు టికెట్ రాకపోతే.. అలకలు.. బుజ్జగింపులకు ఎవరూ ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవరికి వారు తమకు తోచిన రీతిలో పోటీకి రెడీ అవుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నారు ఇండిపెండెం ట్గా అయినా.. పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక, పొరుగు పార్టీ తరఫున పోటీకి రెడీ అవుతున్న వారు కూడా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం గా వచ్చే ఏడాది లేదా.. ఈ ఏడాది చివరి నాటికి జంప్ జిలానీల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. ఇదే జరిగితే.. వైసీపీకి నష్టం కలగడం ఖాయమనే లెక్కలు వస్తున్నాయి. ఇక, టీడీపీని చూసుకున్నా.. పార్టీపై నమ్మకం ఉన్నప్పటికీ.. తమకు టికెట్ వస్తుందో రాదో అనే సమస్యవారిని వెంటాడుతోంది.
వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటే..తమకు ఎసరు ఖాయమని 40 నుంచి 50 మంది నాయకులు అనుకుంటు న్నారు. దీంతో వీరు కూడా పక్క చూపులు చూస్తున్నారు. అయితే.. ఒంటరిగా పోటీ చేసే సాహసం వీరికి లేదు. అందుకే వైసీపీ వైపు చూస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి. వైసీపీలోనూ టికెట్ వచ్చే పరిస్థితి లేని వారు.. మాత్రం పరిస్థితులను బట్టి అడుగులు వేసే అవకాశం ఉంది. అయితే.. ఎవరు ఎటు వెళ్లినా.. ఆయా పార్టీలకు నష్టం మాత్రం ఖాయమని చెబుతున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 18, 2023 11:11 pm
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…