ఏపీలో జంప్ జిలానీలు ఇంకా పెరుగుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ జంప్ చేసే నేతల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ కంటే కూడా.. వైసీపీలో ఎక్కువగా జంప్ చేసే నేతలు పెరుగుతున్నారని పార్టీలోనే గుసగుస వినిపిస్తోంది. సీఎం జగన్పై మునుపు ఉన్న విశ్వాసం .. ఇప్పుడు నేతలకు లేకుండా పోయిందని కూడా అంటున్నారు.
అయితే.. ఎవరూ కూడా ఇప్పటికిప్పుడు బయటపడడం లేదు. ఎన్నికలకు మూడు లేదా.. ఆరు మాసాల ముందు.. వైసీపీలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందు కంటే.. తమకు టికెట్ రాకపోతే.. అలకలు.. బుజ్జగింపులకు ఎవరూ ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవరికి వారు తమకు తోచిన రీతిలో పోటీకి రెడీ అవుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నారు ఇండిపెండెం ట్గా అయినా.. పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక, పొరుగు పార్టీ తరఫున పోటీకి రెడీ అవుతున్న వారు కూడా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం గా వచ్చే ఏడాది లేదా.. ఈ ఏడాది చివరి నాటికి జంప్ జిలానీల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. ఇదే జరిగితే.. వైసీపీకి నష్టం కలగడం ఖాయమనే లెక్కలు వస్తున్నాయి. ఇక, టీడీపీని చూసుకున్నా.. పార్టీపై నమ్మకం ఉన్నప్పటికీ.. తమకు టికెట్ వస్తుందో రాదో అనే సమస్యవారిని వెంటాడుతోంది.
వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటే..తమకు ఎసరు ఖాయమని 40 నుంచి 50 మంది నాయకులు అనుకుంటు న్నారు. దీంతో వీరు కూడా పక్క చూపులు చూస్తున్నారు. అయితే.. ఒంటరిగా పోటీ చేసే సాహసం వీరికి లేదు. అందుకే వైసీపీ వైపు చూస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి. వైసీపీలోనూ టికెట్ వచ్చే పరిస్థితి లేని వారు.. మాత్రం పరిస్థితులను బట్టి అడుగులు వేసే అవకాశం ఉంది. అయితే.. ఎవరు ఎటు వెళ్లినా.. ఆయా పార్టీలకు నష్టం మాత్రం ఖాయమని చెబుతున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 18, 2023 11:11 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…