ఏపీలో జంప్ జిలానీలు ఇంకా పెరుగుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ జంప్ చేసే నేతల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ కంటే కూడా.. వైసీపీలో ఎక్కువగా జంప్ చేసే నేతలు పెరుగుతున్నారని పార్టీలోనే గుసగుస వినిపిస్తోంది. సీఎం జగన్పై మునుపు ఉన్న విశ్వాసం .. ఇప్పుడు నేతలకు లేకుండా పోయిందని కూడా అంటున్నారు.
అయితే.. ఎవరూ కూడా ఇప్పటికిప్పుడు బయటపడడం లేదు. ఎన్నికలకు మూడు లేదా.. ఆరు మాసాల ముందు.. వైసీపీలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందు కంటే.. తమకు టికెట్ రాకపోతే.. అలకలు.. బుజ్జగింపులకు ఎవరూ ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవరికి వారు తమకు తోచిన రీతిలో పోటీకి రెడీ అవుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నారు ఇండిపెండెం ట్గా అయినా.. పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక, పొరుగు పార్టీ తరఫున పోటీకి రెడీ అవుతున్న వారు కూడా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం గా వచ్చే ఏడాది లేదా.. ఈ ఏడాది చివరి నాటికి జంప్ జిలానీల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. ఇదే జరిగితే.. వైసీపీకి నష్టం కలగడం ఖాయమనే లెక్కలు వస్తున్నాయి. ఇక, టీడీపీని చూసుకున్నా.. పార్టీపై నమ్మకం ఉన్నప్పటికీ.. తమకు టికెట్ వస్తుందో రాదో అనే సమస్యవారిని వెంటాడుతోంది.
వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటే..తమకు ఎసరు ఖాయమని 40 నుంచి 50 మంది నాయకులు అనుకుంటు న్నారు. దీంతో వీరు కూడా పక్క చూపులు చూస్తున్నారు. అయితే.. ఒంటరిగా పోటీ చేసే సాహసం వీరికి లేదు. అందుకే వైసీపీ వైపు చూస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి. వైసీపీలోనూ టికెట్ వచ్చే పరిస్థితి లేని వారు.. మాత్రం పరిస్థితులను బట్టి అడుగులు వేసే అవకాశం ఉంది. అయితే.. ఎవరు ఎటు వెళ్లినా.. ఆయా పార్టీలకు నష్టం మాత్రం ఖాయమని చెబుతున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 18, 2023 11:11 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…