కొందరి నోటి నుంచి కొన్ని మాటలు వచ్చాయంటే.. అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. దేశంలో చాలామందే స్వాములోళ్లు ఉన్నారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. వీరిలోనూ వీవీఐపీ స్వాములోళ్లు ఉన్నారు. అలాంటి వారిలో కొందరికి ఉండే ఇమేజ్ వేరుగా ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు శంకరాచార్య జ్యోతిష్య పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి.
అయోధ్యలో రామమందిరం భూమిపూజ కోసం పెట్టిన ముహుర్తం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. దీంతో.. ఇప్పటివరకూ ఎవరూ లేవనెత్తని అంశాన్ని ప్రస్తావించటం హాట్ టాపిక్ గా మారింది. దశాబ్దాల తరబడి ఇలాంటి సమయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు.. ముహుర్తం విషయంలో తప్పులు దొర్లుతాయా? అన్నది ఇప్పుడు ప్రశ్న. అలా అని ఊరికే వదిలేసే పరిస్థితి కూడా కాదు. ఎవరి వాదనలో ఏమున్నదన్నది ముఖ్యమైన అంశం.
అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే విషయంలో ఎన్నో హిందూ సంస్థలు.. స్వాములు భాగస్వామ్యమై ఉన్నారు. అలాంటి వారు మహుర్తాల గురించి చాలానే ఆలోచించి ఉంటారు. మరి.. వారు మిస్ అయిన అంశం ఏమైనా ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. భూమిపూజ శుభఘడియల్లో జరగాలని.. అందుకోసం సరైన తేదీ.. సమయం ఎంచుకోవాలని ఆయన చెబుతున్నారు. అయోధ్యలో రామమందిరం భూమిపూజ కోసం పెట్టిన ముహుర్తం సరైనది కాదన్నది ఆయన అభిప్రాయం.
రామ మందిరాన్ని ఎవరునిర్మించినా సంతోషిస్తామని.. అందులోఎలాంటి రాజకీయం లేదన్న స్వాములోరు.. ఆలయ నిర్మాణం సక్రమంగా జరగాలననదే తమ అభిమతంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం భూమిపూజ కోసం నిర్ణయించిన ముహుర్తం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. భూమిపూజ శుభఘడియల్లో జరగాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటికే నిర్ణయించిన దాని ప్రకారం ఆగస్టు ఐదున ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు నిర్ణయించారు. ఈ ముహుర్తం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్న స్వాములోరి మాటలపై పలువురికి కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం మీద మిగిలిన స్వాములు స్పందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on July 25, 2020 9:06 am
మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తన మాతృభాషలో గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. ఎన్నో సూపర్…
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత రామజన్మభూమి అయోధ్యలో ఉన్న బాలరామయ్య ఆలయానికి రాజకీయ గ్రహణం వీడినట్టేనా? ఇక, ఆలయానికి రాజకీయ ప్రభావం,…
సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…