రాజకీయాల్లో తాడితన్నేవాడు ఉంటే.. తలతన్నేవాడు కూడా ఉంటాడు కదా! ఇదే ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్.. ప్రతి 50 ఇళ్లకు గృహ సారథులను నియమించి.. వారితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే కార్యక్రమానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. గృహ సారథులు ప్రతి ఇంటికీ తిరుగుతూ.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించే దిశగా పనిచేయనున్నారు. ఇక, వైసీపీకి వీరు కార్యకర్తలుగానే పనిచేస్తారు. ఇక, ఇప్పుడు టీడీపీ దీనికి కౌంటర్గా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది.
వైసీపీ ప్రతి 50 ఇళ్లకుఇద్దరు గృహ సారథులను నియమిస్తే.. చంద్రబాబు ప్రతి 30 ఇళ్లకు ఇద్దరేసి చొప్పున గృహ సారథులను నియమించాలని నిర్ణయించారు. పార్టీలో కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి 30 కుటుంబాలకు ఈ సాధికార సారథులు ఇన్ఛార్జ్లాగా వ్యవహరిస్తారన్నారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జులందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని తెలిపారు. సాధికార సారథులుగా మహిళలకూ సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు.
పార్టీలో కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి 30 కుటుంబాలకు ఈ సాధికార సారథి ఇన్ఛార్జ్లాగా వ్యవహరిస్తారన్నారు. ఆర్ధిక అసమానతలు తొలగించేలా ఈ సారథులు పని చేస్తారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పని చేసిన వారికి అనుకున్న స్థాయిలో న్యాయం చెయ్యలేకపోయామన్న చంద్రబాబు.. ఈ సారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్లు అందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని తెలిపారు. సాధికార సారథులుగా మహిళలతూ సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందన్నారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఈ విభాగం పని చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. వీరు ప్రతి ఇంటికీ తిరుగుతూ.. పార్టీ తరఫున ప్రచారం చేయనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
This post was last modified on February 17, 2023 11:38 am
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…