Political News

విన‌రో భాగ్య‌ము.. క‌న్నాపై జీవీఎల్ కామెంట్స్‌..!

వినేవాడు ఉంటే.. చెప్పేవారు చెడుగుడు ఆడ‌తార‌ని సామెత‌. ఇప్పుడు క‌న్నీ ల‌క్ష్మీనారాయ‌ణ‌పై బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ జీవీఎల్ న‌రసింహారావు కూడా అదే రేంజ్‌లో రెచ్చిపోయారు. తాజాగా క‌న్నా.. బీజేపీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అయితే.. దీనిపై జీవీఎల్ తీవ్ర స్థాయిలో త‌న‌దైన శైలిలో విమర్శలు గుప్పించారు. కన్నా రాజీనామాపై పార్టీ నాయకులతో తాను మాట్లాడానన్నారు. కన్నాకు బీజేపీలో సముచిత గౌరవం ఇచ్చామ‌ని.. అయినా.. ఆయ‌న దానిని నిల‌బెట్టుకోలేద‌ని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గంలో‌ చోటు కల్పించారని జీవీఎల్ వెల్లడించారు. ఇవి రెండూ చాలా కీలకమైన పదవులని జీవీఎల్ పేర్కొన్నారు. నిజ‌మే.. కీల‌క‌మే.. కాద‌ని ఎవ‌రూ అన‌రు. కానీ, ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను క‌నీసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారా? అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు.. రాష్ట్ర కార్య‌వ‌ర్గంలో కొంద‌రిని క‌న్నా వ‌ర్గంగా ముద్ర‌వేసి.. వారిని స‌స్పెండ్ చేయ‌లేదా.. కొన్ని సంద‌ర్భాల్లో పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపేయ‌లేదా? అనేది కూడా ప్ర‌శ్న‌గానే ఉంది. ఇక‌, కీల‌క‌మైన మీడియా చ‌ర్చ‌లు, స‌మావేశాల‌కు సైతం వీరిని దూరం చేయ‌లేదా? అనేది మాత్రం జీవీఎల్ ప్ర‌స్తావించ‌లేదు.

ఇక‌, రాజీనామా అనంత‌రం.. కన్నా చేసిన వ్యాఖ్యలపై జీవీఎల్ మాట్లాడుతూ.. స‌ద‌రు వ్యాఖ్య‌లు రాజకీయ దురుద్దేశమేనని అన్నారు. గతంలో కూడా సోము వీర్రాజుపై అనేక వ్యాఖ్యలు చేశారన్నారు. పార్టీలో సోము‌ వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పార్టీ అధిష్టానానికి‌ చెప్పే చేశారన్నారు. నిజ‌మే పార్టీ అధిష్టానానికి చెప్పారు. మ‌రి రాష్ట్ర నాయ‌క‌త్వం కూడా ఉందిక దా…. దానికి కూడా చెప్పాలి క‌దా! పార్టీ అధిష్టానం ఇలా చెప్పింది.. మ‌నం ఏం చేద్దాం.. అని చ‌ర్చించాలి క‌దా! అన్న క‌న్నా ప్ర‌శ్న‌కు జీవీఎల్ ద‌గ్గ‌ర స‌మాధానం లేకుండా పోయింది.

తనపై కూడా గతంలో, ఇప్పుడు కన్నా ఎక్కువ విమర్శలు చేశారని జీవీఎల్ అన్నారు. తన పరిధిలో తాను పని‌ చేస్తున్నానని.. కన్నా విమర్శలపై తాను మాట్లాడబోనన్నారు. బయట పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా కన్నాకు కీలక పదవులు ఇచ్చారన్నారు. ఇది బీజేపీలో చాలా గొప్ప విషయం అన్నారు. సోము వీర్రాజుపై అనేక సార్లు విమర్శలు చేస్తూనే ఉన్నారన్నారు. ఇక‌ వీటిపై తాను ఇంత కన్నా మాట్లాడేదేమీ లేదని ఎంపీ జీవీఎల్ తెలిపారు. అయితే.. ఇప్పుడు ఏం మాట్లాడినా ప్ర‌యోజ‌నం లేద‌ని.. ప‌రిశీల‌కులు అంటున్నారు. ఒక బ‌ల‌మైన కాపు నేత‌ను వాడుకోవ‌డం.. రాజ‌కీయంగా అడ‌గులు ముందుకు వేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 16, 2023 11:01 pm

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

34 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

51 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

2 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

3 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

3 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

4 hours ago