వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ నేతలను టెన్షన్ పెట్టేసింది. ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరిట మార్చి 18 నుంచి 26 వరకు ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించిన ఆయన ఇప్పటికే నిర్వహించిన గడప గడపకు వైసీపీకి కార్యక్రమంపై రివ్యూ చేయడంతో కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్లు తప్పలేదు. జగన్ మినహా మిగతా 150 మంది ఎమ్మెల్యేలలో 30 మందికి ప్రత్యేకంగా వార్నింగ్ ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. వీరిలో మంత్రుల స్థాయి నేతలూ ఉన్నారు.
30 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్రంగా ఆగ్రహించిన జగన్.. ఇప్పుడు చేపట్టబోయే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో వారు మెరుగుపడకపోతే వైసీపీలో వారికి భవిష్యత్తు ఉండదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి హెచ్చరించినా పనితీరు మెరుగుపర్చుకోలేదని… ఇదే చివరి అవకాశమని నిర్మొహమాటంగా జగన్ చెప్పారట. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం 9 రోజులు పూర్తిగా కష్టపడాలని, ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని… లేదంటే వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం తన వద్దకు రావొద్దని క్లియర్ గా చెప్పారంటున్నారు.
జగన్ నుంచి హెచ్చరికలు అందుకున్నవారిలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది. జగన్ నుంచి సీరియస్ వార్నింగ్ అందుకున్న వారిలో సామినేని ఉదయభాను, కొడాలి నాని, వసంత కృష్ణప్రసాద్ కూడా ఉన్నట్లు చెప్తున్నారు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ దొరకదని.. వారికి కాకపోతే కుటుంబ సభ్యులకైనా టికెట్ తెచ్చుకోవచ్చనే భ్రమలో ఉండొద్దని కూడా స్పష్టంగా చెప్పేశారంటున్నాయి వైసీపీ వర్గాలు.
This post was last modified on February 15, 2023 11:32 pm
వైసీపీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలను మంత్రులు అస్సలు ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కడా వెనుకాడవద్దని ఆయన…
అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, అమరావతి నిర్మాణం గురించి వచ్చిన కథనం…
జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు వీఐపీ ఖైదీలు అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తున్న ఘటనలు అనేకం చూశాం. జైలులోనే ఫైవ్…
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…