Political News

30 మంది ఎమ్మెల్యేల భవితపై జగనన్న వార్నింగ్

వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ నేతలను టెన్షన్ పెట్టేసింది. ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరిట మార్చి 18 నుంచి 26 వరకు ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించిన ఆయన ఇప్పటికే నిర్వహించిన గడప గడపకు వైసీపీకి కార్యక్రమంపై రివ్యూ చేయడంతో కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్‌లు తప్పలేదు. జగన్ మినహా మిగతా 150 మంది ఎమ్మెల్యేలలో 30 మందికి ప్రత్యేకంగా వార్నింగ్ ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. వీరిలో మంత్రుల స్థాయి నేతలూ ఉన్నారు.

30 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్రంగా ఆగ్రహించిన జగన్.. ఇప్పుడు చేపట్టబోయే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో వారు మెరుగుపడకపోతే వైసీపీలో వారికి భవిష్యత్తు ఉండదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి హెచ్చరించినా పనితీరు మెరుగుపర్చుకోలేదని… ఇదే చివరి అవకాశమని నిర్మొహమాటంగా జగన్ చెప్పారట. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం 9 రోజులు పూర్తిగా కష్టపడాలని, ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని… లేదంటే వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం తన వద్దకు రావొద్దని క్లియర్ గా చెప్పారంటున్నారు.

జగన్ నుంచి హెచ్చరికలు అందుకున్నవారిలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది. జగన్ నుంచి సీరియస్ వార్నింగ్ అందుకున్న వారిలో సామినేని ఉదయభాను, కొడాలి నాని, వసంత కృష్ణప్రసాద్ కూడా ఉన్నట్లు చెప్తున్నారు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ దొరకదని.. వారికి కాకపోతే కుటుంబ సభ్యులకైనా టికెట్ తెచ్చుకోవచ్చనే భ్రమలో ఉండొద్దని కూడా స్పష్టంగా చెప్పేశారంటున్నాయి వైసీపీ వర్గాలు.

Satya

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

52 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

54 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

2 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago