Political News

పవన్ ఫ్యాన్స్ మళ్లీ బుట్టలో పడ్డారు

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సినీ అభిమానుల్లో పవన్ ఫ్యాన్స్ ముందుంటారు. జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో కంటే కూడా సోషల్ మీడియాలో చాలా బలంగా ఉండడానికి పవన్ అభిమానులు ఒక కారణం. మిగతా పార్టీల మద్దతుదారుల మాదిరి ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా, డబ్బుల కోసం పని చేయకుండా.. నిస్వార్థంగా పవన్ కోసం, జనసేన కోసం పని చేస్తుంటారు ఈ ఫ్యాన్స్. పార్టీ సిద్దాంతాలను సోషల్ మీడియాలోకి బలంగా తీసుకెళ్లడంలో.. పవన్ రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో వీరు కీలక పాత్ర పోషిస్తుంటారు.

అదే సమయంలో జనసేన కోసం.. అలాగే కష్టాల్లో ఉన్న జనసైనికులు లేదా పవన్ అభిమానుల కోసం ఉదారంగా స్పందిస్తుంటారు ఫ్యాన్స్. ప్రతి నెలా తమ వంతుగా పార్టీకి కంట్రిబ్యూట్ చేసే వాళ్లు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తారు ట్విట్టర్లో. అలాగే సాటి పవన్ అభిమానులు, జనసైనికులు కష్టాల్లో ఉంటే వెంటనే ఫండ్ రైజింగ్ ఏర్పాటు చేసి తలో చేయి వేస్తుంటారు.

ఇంత ఉదారంగా మరే సినిమా హీరో ఫ్యాన్స్ స్పందించరు అంటే అతిశయోక్తి కాదు. ఐతే పవన్ అభిమానుల్లోని ఈ దయా గుణాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటూ వాళ్లను బోల్తా కొట్టించే మోసగాళ్లకూ సోషల్ మీడియాలో కొదవలేదు. ప్రధానంగా అనారోగ్య కారణాలు చూపించి, అభిమానుల గుండెలు పిండేసేలా పోస్టులు పెట్టి సాయాలు పొందే కేటుగాళ్లు చాలామందే ఉన్నారు. ఇలా పలు అనుభవాలు ఎదురైనప్పటికీ ఫ్యాన్స్ వెనుకంజ వేయకుండా సాయాలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా అజయ్ కాంత్ అనే వ్యక్తి తన తల్లికి అనారోగ్యం అని.. ఆమె చనిపోయిందని.. రకరకాల సందర్భాల్లో అభిమానులను బురిడీ కొట్టించి కోటి రూపాయల దాకా కొట్టేసినట్లు తెలుస్తోంది. కేవలం ఒక వ్యక్తే 30 లక్షల దాకా ఆ వ్యక్తికి ఇచ్చినట్లు చెబుతు్నారు. దీని గురించి పవన్ ఫ్యాన్స్, జనసైనికులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఆ వ్యక్తిని తిట్టిపోస్తున్నారు. ఇదే సందర్భంలో గతంలో జరిగిన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు ట్విట్టర్లో నిన్నట్నుంచి ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఐతే ఇలాంటి వాళ్ల వల్ల నిజంగా కష్టాల్లో ఉన్న వారిని కూడా నమ్మకుండా పోయే పరిస్థితి తలెత్తుతోందని.. కాబట్టి ఇకపై సరిగ్గా వెరిఫై చేసుకున్న తర్వాతే సాయం అందించాలని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

This post was last modified on February 15, 2023 11:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago