సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సినీ అభిమానుల్లో పవన్ ఫ్యాన్స్ ముందుంటారు. జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో కంటే కూడా సోషల్ మీడియాలో చాలా బలంగా ఉండడానికి పవన్ అభిమానులు ఒక కారణం. మిగతా పార్టీల మద్దతుదారుల మాదిరి ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా, డబ్బుల కోసం పని చేయకుండా.. నిస్వార్థంగా పవన్ కోసం, జనసేన కోసం పని చేస్తుంటారు ఈ ఫ్యాన్స్. పార్టీ సిద్దాంతాలను సోషల్ మీడియాలోకి బలంగా తీసుకెళ్లడంలో.. పవన్ రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో వీరు కీలక పాత్ర పోషిస్తుంటారు.
అదే సమయంలో జనసేన కోసం.. అలాగే కష్టాల్లో ఉన్న జనసైనికులు లేదా పవన్ అభిమానుల కోసం ఉదారంగా స్పందిస్తుంటారు ఫ్యాన్స్. ప్రతి నెలా తమ వంతుగా పార్టీకి కంట్రిబ్యూట్ చేసే వాళ్లు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తారు ట్విట్టర్లో. అలాగే సాటి పవన్ అభిమానులు, జనసైనికులు కష్టాల్లో ఉంటే వెంటనే ఫండ్ రైజింగ్ ఏర్పాటు చేసి తలో చేయి వేస్తుంటారు.
ఇంత ఉదారంగా మరే సినిమా హీరో ఫ్యాన్స్ స్పందించరు అంటే అతిశయోక్తి కాదు. ఐతే పవన్ అభిమానుల్లోని ఈ దయా గుణాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటూ వాళ్లను బోల్తా కొట్టించే మోసగాళ్లకూ సోషల్ మీడియాలో కొదవలేదు. ప్రధానంగా అనారోగ్య కారణాలు చూపించి, అభిమానుల గుండెలు పిండేసేలా పోస్టులు పెట్టి సాయాలు పొందే కేటుగాళ్లు చాలామందే ఉన్నారు. ఇలా పలు అనుభవాలు ఎదురైనప్పటికీ ఫ్యాన్స్ వెనుకంజ వేయకుండా సాయాలు చేస్తూనే ఉన్నారు.
తాజాగా అజయ్ కాంత్ అనే వ్యక్తి తన తల్లికి అనారోగ్యం అని.. ఆమె చనిపోయిందని.. రకరకాల సందర్భాల్లో అభిమానులను బురిడీ కొట్టించి కోటి రూపాయల దాకా కొట్టేసినట్లు తెలుస్తోంది. కేవలం ఒక వ్యక్తే 30 లక్షల దాకా ఆ వ్యక్తికి ఇచ్చినట్లు చెబుతు్నారు. దీని గురించి పవన్ ఫ్యాన్స్, జనసైనికులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఆ వ్యక్తిని తిట్టిపోస్తున్నారు. ఇదే సందర్భంలో గతంలో జరిగిన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు ట్విట్టర్లో నిన్నట్నుంచి ఇది హాట్ టాపిక్గా మారింది. ఐతే ఇలాంటి వాళ్ల వల్ల నిజంగా కష్టాల్లో ఉన్న వారిని కూడా నమ్మకుండా పోయే పరిస్థితి తలెత్తుతోందని.. కాబట్టి ఇకపై సరిగ్గా వెరిఫై చేసుకున్న తర్వాతే సాయం అందించాలని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
This post was last modified on February 15, 2023 11:27 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…