ఏపీ అధికార పార్టీ వైసీపీ అంటే.. క్రమశిక్షణకు మారు పేరు. పైకి ఎవరూ దీనిగురించి మాట్లాడరు. అమ్మో.. పార్టీలో క్రమశిక్షణ ఉందని చెప్పరు. కానీ, ఎవరూ కూడా అధినేత గీసిన గీత దాటరు. ఎవరూ పెదవి విప్పి పరుషంగా మాట్టాడే ప్రయత్నం కూడా చేయరు. దీనికి కారణం.. అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పినా.. నిజానికి నేతలకు అంతర్గత కట్టుబాట్లు.. లక్ష్మణ రేఖలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ అంటే.. ఒకరకంగా హడల్ అనే చెప్పాలి.
దీంతో సీఎం జగన్ ఏం చెప్పినా.. ఆయన ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో నాయకులు పాటించి తీరుతారు. అవి కష్టమా? నష్టమా..? అనే ఆలోచన కూడా ఉండదు. ఖచ్చితంగా వాటిని పాటించి తీరాలనే భావిస్తున్నారు. పాటిస్తున్నారు కూడా. అయితే.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నాయకులు .. ఇప్పుడు ఈ పట్టును కోల్పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వాలని అనేవారు పెరుగుతున్నారు.
నిన్న మొన్నటి వరకు ఎవరికి టికెట్లు కావాలన్నా.. అదినేతగా సీఎం జగన్ తీసుకునే నిర్ణయమే అంతిమం. అయితే.. ఇప్పుడు లక్షణ రేఖలు మారుతున్నాయి. కుంచించుకు పోతూ ఉన్నాయి. దీనికి కారణం.. తమకు వైసీపీ అవకాశం ఇవ్వకపోతే.. వేరే పార్టీలు రెడీగా ఉన్నాయనే సంకేతాలను.. నేతలు బాహాటంగానే పంపేస్తున్నారు. ఇదే జరిగితే.. వైసీపీ పెట్టుకున్న రెండోసారి అధికారం అనే లక్ష్యానికి తూట్లు పడడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి.
దీంతో ఇప్పటి వరకు ఉన్న లక్ష్మణ రేఖలను సీఎం జగన్ దాదాపు చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. అసలు నియోజకవర్గాలపై ఇప్పటి వరకు ఉన్న విధానం వేరు.. ఇకపై చూసే దృష్టి వేరు..అన్నట్టుగా సీఎం సంకేతాలు పంపించారు. అంటే.. ప్రజల్లో ఎక్కువగా ఉంటున్నవారు ఎవరు.. ఎవరికి ప్రజా బలం ఉంది.. అనే కోణాల్లో ఇప్పుడు సీఎం జగన్ ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు. దీనిని బట్టి.. అవసరమైతే.. ఇప్పటి వరకు పెట్టుకున్న లక్ష్మణ రేఖలను కూడా తోసిపుచ్చాలని.. పార్టీ గెలుపునకు ఎవరు దోహదపడతారో.. వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.
This post was last modified on February 15, 2023 11:24 pm
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…