Buggana Rajender Reddy
ఏపీలో మూడురాజధానుల జపం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మూడు రాజధానులు లేవని.. ఉన్నది ఒకటే రాజధాని అని.. అదికేవలం విశాఖేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వంలో నెంబరు 2గా ఉన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారమని అన్నారు. అంతేకాదు.. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బెంగుళూరులో నిర్వహించిన రోడ్ షోలో విశాఖ రాజధాని అంశంపై మంత్రి బుగ్గనను పలువురు పెట్టుబడిదారులు ప్రశ్నలు అడిగారు. విశాఖ పైనే ఎందుకు దృష్టి పెట్టారు.. పారిశ్రామిక గ్రోత్ ఏరియాగా తిరుపతి, విజయవాడలను ఎందుకు ఎంచుకోలేదని ఆర్థిక మంత్రి బుగ్గనను పెట్టుబడిదారులు ప్రశ్నించారు.
ఐటీ పరిశ్రమలు, సంబంధిత పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. విశాఖలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయని, దీంతో పాటు తమ ప్రభుత్వం విశాఖనే రాజధానిగా నిర్ణయించిందని మంత్రి వివరించారు. ఈ క్రమంలోనే ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారమని తేల్చి చెప్పారు.
విశాఖలో అతి తక్కువ వ్యయంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి బుగ్గన తెలిపారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందేందుకూ విశాఖలో అవకాశం ఉందని అన్నారు. ఇక, కర్నూలు విషయాన్ని కూడా పెట్టుబడి దారులు ప్రశ్నించారు. దీనికి మంత్రి బుగ్గన స్పందిస్తూ.. కర్నూలు అనేది రాజధాని కాదని.. అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
This post was last modified on February 15, 2023 11:07 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…