ఏపీ ప్రభుత్వం రూటు మార్చింది. ఇప్పుడు మూడు రాజధానులు లేవని అంటోంది. పరిపాలన మొత్తం విశాఖ నుంచే ఉంటుందని ఇంతకాలం సూచన ప్రాయంగా చెప్పిన వైసీపీ ఇప్పుడు బహిరంగంగానే ఆ విషయాన్ని వెల్లడిస్తోంది. విశాఖే పరిపాలనా రాజధానికి సరిపోతుందని ప్రభుత్వం అంటోంది.
బెంగళూరు పారిశ్రామిక సదస్సులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందన్నారు. కర్ణాటకలో దార్వార్డ్ , గుల్బర్గల్లో బెంచ్ లు ఉన్నట్టే హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ కర్నూలులో ఉంచాలని అనుకుంటున్నామన్నారు. అలాగే అసెంబ్లీ విషయంలోనూ నిర్ణయం తీసుకుంటామన్నారు. కర్ణాటక ప్రభుత్వం బెల్గాంలో అసెంబ్లీ సెషన్ నిర్వహించినట్లే గుంటూరులో కూడా ఒకటి రెండు సార్లు అసెంబ్లీ పెడతామన్నారు. అంటే శాసన రాజధాని, న్యాయ రాజధాని ఉండవని ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్లయ్యింది..
రాజధానిగా విశాఖ అన్ని రకాలుగా ఉపయుక్తంగా ఉంటుందని బుగ్గన చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న మౌళిక సదుపాయాలు భవిష్యత్తులో మరింత అభివృద్ది చెందే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. విశాఖ ఒక పోర్టు సిటీ అని, అక్కడ వాతావరణం బావుంటుందని అభిప్రాయపడ్డారు. పైగా కాస్మోపాలిటన్ సంస్కృతి ఉన్న నగరమని బుగ్గన గుర్తు చేశారు. విశాఖలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయన్నారు. కాకపోతే బుగ్గన ఎందుకిలా మాట్లాడున్నారనే విషయం వివరించి చెప్పాలని అవసరం లేదని, జగన్ ను సంతృప్తి పరిచేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. రాజధాని అమరావతి దాటి పోవడం కుదరని పని అని వాదిస్తున్నారు..
This post was last modified on February 14, 2023 10:57 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…