Political News

జ‌గ‌న్ ఎత్తులు పార‌లేదు.. సీనియ‌ర్ ఐపీఎస్‌కు ఊర‌ట‌!!

ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ ఎత్తులు పార‌లేదు. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ణప్తిని కేంద్ర హోంశాఖ‌ తోసిపుచ్చింది. డిస్మిస్ చేయాల్సినంత పెద్ద తప్పుఏమీ క‌నిపించ‌డం లేద‌ని వ్యాఖ్యానించింది. దీంతో జ‌గ‌న్ స‌ర్కారుకు భారీ షాక్ త‌గిలిన‌ట్టు అయింది. అదేస‌మ‌యంలో వెంక‌టేశ్వ‌రరావుకు ఊర‌ట ల‌భించిన‌ట్టు అయింది.

అయితే.. ఏబీ వెంక‌టేశ్వ‌రరావుపై అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోంశాఖ సూచించింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ ఈ మేర‌కు లేఖ రాసింది. చర్యల్లో భాగంగా వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్లు రద్దు చేసే అవకాశం ఉంది. ఇక‌, అటు కేంద్రం ఆదేశాల నేప‌థ్యంలో ఏపీ ప్రభుత్వ తీసుకునే చర్యలను క్యాట్‌లో ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏం జ‌రిగింది?

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. అయితే.. ఈ స‌మ‌యంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయ‌న కుమారుడుకు చెందిన కంపెనీ భ‌ద్ర‌తా ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేసిన‌ట్టు ప్ర‌భుత్వం ఆరోపించింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను విధుల నుంచి ప‌క్క‌న పెట్టారు. దీంతో త‌న‌పై ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే ఇలా చేసిందంటూ.. ఏబీవీ.. హైకోర్టును ఆశ్ర‌యించారు. కేసును కొట్టివేయాలంటూ గతేడాది పిటిషన్ వేశారు.

అయితే ఈ పిటిషన్‌పై విచారణ నుంచి హైకోర్టు జడ్జి తప్పుకొన్నారు. ఈ పిటిషన్‌పై గతంలో మరో న్యాయమూర్తి విచారణ జరపగా.. హైకోర్టులో తాజాగా రోస్ట‌ర్‌ మారడంతో ఈ పిటిషన్ జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు పరిధిలోకి వచ్చింది. పిటిషనర్ తరపు లాయర్.. అత్యవసర విచారణ జరపాలని కోరగా.. తాను విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు జడ్జి ప్రకటించారు. గతేడాది మార్చి 18న ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏబీవీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం దీనిపై ఇంకా తేల‌కుండానే.. కేంద్రానికి రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసింది. ఏబీవీని డిస్మిస్ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. అయితే.. దీనికి వ్య‌తిరేక‌త తెలిపిన కేంద్రం.. ఆయ‌న‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు అవ‌కాశం ఇస్తున్న‌ట్టు తెలిపింది. మ‌రి ఏపీ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

This post was last modified on February 14, 2023 10:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

60 minutes ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

2 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

4 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

5 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

5 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

7 hours ago