Political News

జ‌గ‌న్ ఎత్తులు పార‌లేదు.. సీనియ‌ర్ ఐపీఎస్‌కు ఊర‌ట‌!!

ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ ఎత్తులు పార‌లేదు. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ణప్తిని కేంద్ర హోంశాఖ‌ తోసిపుచ్చింది. డిస్మిస్ చేయాల్సినంత పెద్ద తప్పుఏమీ క‌నిపించ‌డం లేద‌ని వ్యాఖ్యానించింది. దీంతో జ‌గ‌న్ స‌ర్కారుకు భారీ షాక్ త‌గిలిన‌ట్టు అయింది. అదేస‌మ‌యంలో వెంక‌టేశ్వ‌రరావుకు ఊర‌ట ల‌భించిన‌ట్టు అయింది.

అయితే.. ఏబీ వెంక‌టేశ్వ‌రరావుపై అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోంశాఖ సూచించింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ ఈ మేర‌కు లేఖ రాసింది. చర్యల్లో భాగంగా వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్లు రద్దు చేసే అవకాశం ఉంది. ఇక‌, అటు కేంద్రం ఆదేశాల నేప‌థ్యంలో ఏపీ ప్రభుత్వ తీసుకునే చర్యలను క్యాట్‌లో ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏం జ‌రిగింది?

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. అయితే.. ఈ స‌మ‌యంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయ‌న కుమారుడుకు చెందిన కంపెనీ భ‌ద్ర‌తా ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేసిన‌ట్టు ప్ర‌భుత్వం ఆరోపించింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను విధుల నుంచి ప‌క్క‌న పెట్టారు. దీంతో త‌న‌పై ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే ఇలా చేసిందంటూ.. ఏబీవీ.. హైకోర్టును ఆశ్ర‌యించారు. కేసును కొట్టివేయాలంటూ గతేడాది పిటిషన్ వేశారు.

అయితే ఈ పిటిషన్‌పై విచారణ నుంచి హైకోర్టు జడ్జి తప్పుకొన్నారు. ఈ పిటిషన్‌పై గతంలో మరో న్యాయమూర్తి విచారణ జరపగా.. హైకోర్టులో తాజాగా రోస్ట‌ర్‌ మారడంతో ఈ పిటిషన్ జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు పరిధిలోకి వచ్చింది. పిటిషనర్ తరపు లాయర్.. అత్యవసర విచారణ జరపాలని కోరగా.. తాను విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు జడ్జి ప్రకటించారు. గతేడాది మార్చి 18న ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏబీవీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం దీనిపై ఇంకా తేల‌కుండానే.. కేంద్రానికి రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసింది. ఏబీవీని డిస్మిస్ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. అయితే.. దీనికి వ్య‌తిరేక‌త తెలిపిన కేంద్రం.. ఆయ‌న‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు అవ‌కాశం ఇస్తున్న‌ట్టు తెలిపింది. మ‌రి ఏపీ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

This post was last modified on February 14, 2023 10:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

58 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago