ఇది ఒక ఊహించని ఘటన. ఇప్పటి వరకు తమను ఎదిరించిన రాజకీయ నేతలు.. లేదా.. తాము దారిలో కి తెచ్చుకోవాలని భావించిన వారిపైనే ఐటీ, ఈడీ, సీబీఐ వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇటీవల పార్లమెంటు వేదికగా కూడా మోడీపై దుమ్మెత్తి పోశాయి. రాజ్యాంగ బద్థ సంస్థలను ఇలా తన స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారని కూడా విమర్శలు గుప్పించాయి.
సరే.. అది రాజకీయం!! బీజేపీ కూడా ఎదురు దాడి చేసింది. తమకు ఎలాంటి పాపాలూ లేవని కూడా చెప్పుకొచ్చింది. అసలు ఏ సంస్థ పని ఆ సంస్థ చేస్తోందని కూడా వెల్లడించింది. మోడీ అసలు ఏమీ ఎరుగరని కూడా సర్టిఫికెట్లు ఇచ్చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు తాజాగా బీబీసీ ఛానెల్ కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఛానెల్ కార్యాలయాలకు వెళ్లి అధికారులు.. ఆదాయ వివరాలు.. ఉద్యోగులు.. జీత భత్యాలు.. వంటివాటి రికార్డులను తనిఖీ చేస్తున్నారు.
దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం రేగింది. వెంటనే రియాక్ట్ అయిన.. ఐటీ శాఖ అధికారులు అబ్బే.. ఉత్తుత్తి తనిఖీలే.. కేవలం తెలుసుకునేందుకు మాత్రమే వచ్చామని సమాచారం ఇచ్చాయి. కానీ, ఊరకరారు మహానుభావులు కదా! అన్నట్టుగానే ఐటీ దాడుల వెనుక వేరే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన గోద్రా ఘటనపై.. బీబీసీ రెండు భాగాలుగా ఆక్యుమెంటరీని ప్రసారం చేసింది.
తప్పంతా మోడీదేనని ఈ డాక్యమెంటరీల్లో తేల్చి చెప్పింది. ఇది తీవ్ర వివాదంగా మారడం.. కేంద్రం వెంటనే సదరు డాక్యమెంటరీని బ్యాన్ చేయడం.. ఇది పార్లమెంటులోనూ రచ్చకు దారితీయడం తెలిసిందే. ఇక, ప్రస్తుతం బీబీసీ ప్రసారాలనే బ్యాన్ చేయాలంటూ.. సుప్రీంకోర్టులో కేసు కూడా పడింది. దీనిని కోర్టు తోసిపుచ్చిందనుకోండి.. కానీ, తాజాగా బీబీసీ కార్యాలయాలపై దాడులు జరగడం.. మోడీ ఎఫెక్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 14, 2023 2:50 pm
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర…
కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. పార్టీ నాయకులకు బాగా కలిసి వస్తోందన్నవాదన వినిపిస్తోంది. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు.. తమ్ముళ్లకు…
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…