Political News

మోడీ ఎఫెక్ట్: బీబీసీ ఆఫీసుల‌పై ఐటీ దాడులు

ఇది ఒక ఊహించ‌ని ఘ‌ట‌న‌. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌ను ఎదిరించిన రాజ‌కీయ నేత‌లు.. లేదా.. తాము దారిలో కి తెచ్చుకోవాల‌ని భావించిన వారిపైనే ఐటీ, ఈడీ, సీబీఐ వంటి వాటిని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌యోగిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌తిప‌క్షాలు ఇటీవ‌ల పార్ల‌మెంటు వేదికగా కూడా మోడీపై దుమ్మెత్తి పోశాయి. రాజ్యాంగ బ‌ద్థ సంస్థ‌ల‌ను ఇలా త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కు వినియోగించుకుంటున్నార‌ని కూడా విమ‌ర్శ‌లు గుప్పించాయి.

స‌రే.. అది రాజ‌కీయం!! బీజేపీ కూడా ఎదురు దాడి చేసింది. త‌మ‌కు ఎలాంటి పాపాలూ లేవ‌ని కూడా చెప్పుకొచ్చింది. అస‌లు ఏ సంస్థ ప‌ని ఆ సంస్థ చేస్తోంద‌ని కూడా వెల్ల‌డించింది. మోడీ అస‌లు ఏమీ ఎరుగ‌ర‌ని కూడా స‌ర్టిఫికెట్లు ఇచ్చేసింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు తాజాగా బీబీసీ ఛానెల్ కార్యాల‌యాల‌పై ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఛానెల్ కార్యాల‌యాల‌కు వెళ్లి అధికారులు.. ఆదాయ వివ‌రాలు.. ఉద్యోగులు.. జీత భ‌త్యాలు.. వంటివాటి రికార్డుల‌ను త‌నిఖీ చేస్తున్నారు.

దీంతో ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. వెంట‌నే రియాక్ట్ అయిన‌.. ఐటీ శాఖ అధికారులు అబ్బే.. ఉత్తుత్తి త‌నిఖీలే.. కేవ‌లం తెలుసుకునేందుకు మాత్ర‌మే వ‌చ్చామ‌ని స‌మాచారం ఇచ్చాయి. కానీ, ఊర‌క‌రారు మ‌హానుభావులు క‌దా! అన్న‌ట్టుగానే ఐటీ దాడుల వెనుక వేరే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ గుజ‌రాత్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన గోద్రా ఘ‌ట‌న‌పై.. బీబీసీ రెండు భాగాలుగా ఆక్యుమెంట‌రీని ప్ర‌సారం చేసింది.

త‌ప్పంతా మోడీదేన‌ని ఈ డాక్య‌మెంట‌రీల్లో తేల్చి చెప్పింది. ఇది తీవ్ర వివాదంగా మార‌డం.. కేంద్రం వెంట‌నే స‌ద‌రు డాక్య‌మెంట‌రీని బ్యాన్ చేయ‌డం.. ఇది పార్ల‌మెంటులోనూ రచ్చ‌కు దారితీయ‌డం తెలిసిందే. ఇక‌, ప్ర‌స్తుతం బీబీసీ ప్ర‌సారాల‌నే బ్యాన్ చేయాలంటూ.. సుప్రీంకోర్టులో కేసు కూడా ప‌డింది. దీనిని కోర్టు తోసిపుచ్చింద‌నుకోండి.. కానీ, తాజాగా బీబీసీ కార్యాల‌యాల‌పై దాడులు జ‌ర‌గ‌డం.. మోడీ ఎఫెక్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 14, 2023 2:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

51 minutes ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

2 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

3 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

3 hours ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

4 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

4 hours ago