ఇది ఒక ఊహించని ఘటన. ఇప్పటి వరకు తమను ఎదిరించిన రాజకీయ నేతలు.. లేదా.. తాము దారిలో కి తెచ్చుకోవాలని భావించిన వారిపైనే ఐటీ, ఈడీ, సీబీఐ వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇటీవల పార్లమెంటు వేదికగా కూడా మోడీపై దుమ్మెత్తి పోశాయి. రాజ్యాంగ బద్థ సంస్థలను ఇలా తన స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారని కూడా విమర్శలు గుప్పించాయి.
సరే.. అది రాజకీయం!! బీజేపీ కూడా ఎదురు దాడి చేసింది. తమకు ఎలాంటి పాపాలూ లేవని కూడా చెప్పుకొచ్చింది. అసలు ఏ సంస్థ పని ఆ సంస్థ చేస్తోందని కూడా వెల్లడించింది. మోడీ అసలు ఏమీ ఎరుగరని కూడా సర్టిఫికెట్లు ఇచ్చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు తాజాగా బీబీసీ ఛానెల్ కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఛానెల్ కార్యాలయాలకు వెళ్లి అధికారులు.. ఆదాయ వివరాలు.. ఉద్యోగులు.. జీత భత్యాలు.. వంటివాటి రికార్డులను తనిఖీ చేస్తున్నారు.
దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం రేగింది. వెంటనే రియాక్ట్ అయిన.. ఐటీ శాఖ అధికారులు అబ్బే.. ఉత్తుత్తి తనిఖీలే.. కేవలం తెలుసుకునేందుకు మాత్రమే వచ్చామని సమాచారం ఇచ్చాయి. కానీ, ఊరకరారు మహానుభావులు కదా! అన్నట్టుగానే ఐటీ దాడుల వెనుక వేరే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన గోద్రా ఘటనపై.. బీబీసీ రెండు భాగాలుగా ఆక్యుమెంటరీని ప్రసారం చేసింది.
తప్పంతా మోడీదేనని ఈ డాక్యమెంటరీల్లో తేల్చి చెప్పింది. ఇది తీవ్ర వివాదంగా మారడం.. కేంద్రం వెంటనే సదరు డాక్యమెంటరీని బ్యాన్ చేయడం.. ఇది పార్లమెంటులోనూ రచ్చకు దారితీయడం తెలిసిందే. ఇక, ప్రస్తుతం బీబీసీ ప్రసారాలనే బ్యాన్ చేయాలంటూ.. సుప్రీంకోర్టులో కేసు కూడా పడింది. దీనిని కోర్టు తోసిపుచ్చిందనుకోండి.. కానీ, తాజాగా బీబీసీ కార్యాలయాలపై దాడులు జరగడం.. మోడీ ఎఫెక్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 14, 2023 2:50 pm
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…
జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…
దేశ రాజధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్రమేనని అందరికీ తెలిసిందే. ఇక్కడ చిత్రమైన పరిస్థితి ఉంది. ఇది కేంద్ర పాలిత…
ఈ మధ్యే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పలకరించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసిన గత రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో…