వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పోరాడుతున్న టీడీపీకి పంటి కింద రాళ్ల మాదిరిగా పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో 175 చోట్ల విజయం దక్కించుకుంటామని.. నాయకులు చెబుతున్నారు. అయితే.. ఈ క్రమంలో జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని క్లూ ఇస్తున్నారు. దీంతో జనసేనతో పొత్తు పెట్టుకుంటే.. తమకు ఎక్కడ పోటీకి అవకాశం లేకుండా పోతుందనని భావిస్తున్న టీడీపీ నేతలు తమ దారితాము చూసుకుంటున్నారట.
ఇలాంటి వారిలో ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసిన నియోజకవర్గం ఉమ్మడి కృష్నాజిల్లాలోని కైకలూరు. టీడీపీ ఎవరితో పొత్తులు పెట్టుకున్నా.. వదిలేసే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. విజయవాడలో అయితే.. పశ్చిమ నియోజకవర్గాన్ని వదిలేస్తుంది. పశ్చిమ గోదావరిలో అయితే నరసాపురం నియోజక వర్గాన్ని వదిలేస్తుంది. అలానే కృష్ణాలో కైకలూరు ను కూడా పొత్తు పార్టీలకు వదిలేయడం.. టీడీపీకి ఆనవాయితీగా వస్తోంది.
2014లో బీజేపీతొ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది. అయితే.. దీనికి ముందు ఇక్కడ అంటే 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన జయమంగళ వెంకటరమణ అప్పటి వైఎస్ హవాలోనూ పోరాడి విజయం దక్కించుకున్నారు. కానీ, తర్వాత ఎన్నికలకు పొత్తుల పరిణామం.. ఆయనకు టికెట్ లేకుండా చేసింది. ఇక, గత ఎన్నికల్లో జయ ఓడిపోయారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో అయినా.. పోటీ చేసి విజయం దక్కించుకునేందుకు జయమంగళ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇంతలోనే జనసేనతో పొత్తు అంటూ.. టీడీపీ ప్రయత్నాలు చేయడం.. ఇదే జరిగితే.. తన సీటును జనసేనకు కేటాయిస్తారనే సంకేతాలను జయమంగళ పసిగట్టడంతో ఇప్పుడు ఆయన తనదారి తాను చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. మరోవైపు.. వైసీపీ ఈయనకు టికెట్ ఇస్తుందో లేదో తెలియదు కానీ.. టీడీపీ నుంచి బలమైన నేతలకు మాత్రం గేలం వేస్తోంది. ఈ నేపథ్యంలోనే జయ వైసీపీకి చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 13, 2023 11:53 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…