వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పోరాడుతున్న టీడీపీకి పంటి కింద రాళ్ల మాదిరిగా పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో 175 చోట్ల విజయం దక్కించుకుంటామని.. నాయకులు చెబుతున్నారు. అయితే.. ఈ క్రమంలో జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని క్లూ ఇస్తున్నారు. దీంతో జనసేనతో పొత్తు పెట్టుకుంటే.. తమకు ఎక్కడ పోటీకి అవకాశం లేకుండా పోతుందనని భావిస్తున్న టీడీపీ నేతలు తమ దారితాము చూసుకుంటున్నారట.
ఇలాంటి వారిలో ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసిన నియోజకవర్గం ఉమ్మడి కృష్నాజిల్లాలోని కైకలూరు. టీడీపీ ఎవరితో పొత్తులు పెట్టుకున్నా.. వదిలేసే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. విజయవాడలో అయితే.. పశ్చిమ నియోజకవర్గాన్ని వదిలేస్తుంది. పశ్చిమ గోదావరిలో అయితే నరసాపురం నియోజక వర్గాన్ని వదిలేస్తుంది. అలానే కృష్ణాలో కైకలూరు ను కూడా పొత్తు పార్టీలకు వదిలేయడం.. టీడీపీకి ఆనవాయితీగా వస్తోంది.
2014లో బీజేపీతొ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది. అయితే.. దీనికి ముందు ఇక్కడ అంటే 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన జయమంగళ వెంకటరమణ అప్పటి వైఎస్ హవాలోనూ పోరాడి విజయం దక్కించుకున్నారు. కానీ, తర్వాత ఎన్నికలకు పొత్తుల పరిణామం.. ఆయనకు టికెట్ లేకుండా చేసింది. ఇక, గత ఎన్నికల్లో జయ ఓడిపోయారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో అయినా.. పోటీ చేసి విజయం దక్కించుకునేందుకు జయమంగళ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇంతలోనే జనసేనతో పొత్తు అంటూ.. టీడీపీ ప్రయత్నాలు చేయడం.. ఇదే జరిగితే.. తన సీటును జనసేనకు కేటాయిస్తారనే సంకేతాలను జయమంగళ పసిగట్టడంతో ఇప్పుడు ఆయన తనదారి తాను చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. మరోవైపు.. వైసీపీ ఈయనకు టికెట్ ఇస్తుందో లేదో తెలియదు కానీ.. టీడీపీ నుంచి బలమైన నేతలకు మాత్రం గేలం వేస్తోంది. ఈ నేపథ్యంలోనే జయ వైసీపీకి చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 13, 2023 11:53 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…