ఇదొక అనూహ్య పరిణామం. ఎవరూ ఊహించని ఘటన. ఇప్పటి వరకు కనీసం పేరు కూడా ఎత్తని నాయకుడి గురించి.. ఏకంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. ఏకంగా రాజ్యసభలోనే దివంగత వంగవీటి మోహన రంగా గురించి సుమారు 4 నిమిషాల పాటు మాట్లాడారు. ఏకధాటిగా ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా ఉండడంతోపాటు.. అందరినీ ఆశ్చర్యానికి కూడా గురి చేసింది.
ఇంతకీ.. జీవీఎల్ ఏమన్నారంటే.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా-మచిలీపట్నం కేంద్రంగా ఒక జిల్లాకు మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ.. కాపు సామాజిక వర్గానికి ఆరాధ్య దైవంగా, పేద ప్రజల పెన్నిదిగా భావించే వంగవీటి మోహన రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని ఆయన అభిమానులు కోరుతున్నట్లు తెలిపారు.
అయితే, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలకు అనేక మంది పేర్లు పెట్టినప్పటికీ వంగవీటి మోహన రంగా పేరును పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రంగా అభిమానుల ఆకాంక్ష మేరకు ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడంతో పాటు విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సైతం వంగవీటి మోహన రంగా పేరుపెట్టేలా చర్యలు తీసుకోవాలని జీవీఎల్ కోరడం గమనార్హం.
అయితే.. అనూహ్యంగా జీవీఎల్కు రంగాపై అంత ప్రేమ ఎందుకు వచ్చిందనేది ప్రశ్న. పైగా ఒకరాష్ట్రానికి సంబంధించిన విషయం.. అందునా రాష్ట్ర పరిధిలోని అంశం(జిల్లాలకు ఏయే పేర్లు పెట్టాలనేది రాష్ట్రం ఇష్టం).. అయినా… కూడా వీటిని పోయిపోయి పెద్దల సభలో ప్రస్తావించడం.. వెనుక కేవలం.. బీజేపీ కాపులను ఆకర్షించేందుకు.. లేదా.. కాపులకు మేమున్నామని చెప్పుకొనేందుకు ప్రయత్నించడమేనని అంటున్నారు పరిశీలకులు.
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…