Political News

జ‌గ‌న్ ప్ర‌భుత్వం దివాలా దీసింది.. ఈ మాట ఎవ‌రన్నారంటే!

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ప‌నిచేసిన మాజీ న్యాయ‌మూర్తుల నుంచి ప్ర‌జాస్వామ్య వాదుల వ‌ర‌కు కూడా ప్ర‌తి ఒక్క‌రూ సీఎం జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవ్‌సింహ్‌ చౌహాన్ సైగా సీఎం జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఏపీ ప్ర‌భుత్వం దివాలా తీసింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో పాల‌న లేద‌ని అన్నారు. అనుభ‌వం లేని వారిని ఎన్నుకుని ప్ర‌జలు త‌ప్పు చేశార‌ని వ్యాఖ్యానించారు. ఎక్క‌డైనా ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ప‌నిచేయించుకుని ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌కుండా ఉండ‌లేద‌ని.. కానీ, జ‌గ‌న్ మాత్రం వారిని ఏడిపిస్తున్నార‌ని.. క‌నీసం 10వ తేదీ వ‌చ్చినా.. ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేదంటే.. రాష్ట్రం దివాలా తీసిన‌ట్టు కాదా? అని నిప్పులు చెరిగారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. పూర్తిగా దివాలా తీసిందన్నారు. వ‌లంటీర్ల ద్వారా విపక్ష నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కేంద్ర మంత్రి చౌహాన్‌ మాట్లాడారు. ఏపీలో మద్యం, ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఆ ఆదాయమంతా ఎక్కడికి పోతోందని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారని, వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. 10వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

మోడీకి కితాబులు..

ఒక‌వైపు సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శించిన కేంద్ర మంత్రి చౌహాన్‌.. అదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. దేశంలో తొమ్మిదేళ్ల మోడీ పాలనలో అద్భుతాలు సృష్టించారని కేంద్రమంత్రి చౌహాన్‌ అన్నారు. సాంకేతికతతో కూడిన పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు. ఒక వ్యక్తి, ఒక వర్గం కాకుండా అందరూ ఎదగడానికి బీజేపీ కృషి చేస్తోందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం పేదల పేరుతో రాజకీయం చేసిందని విమర్శించారు.

This post was last modified on February 12, 2023 11:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

45 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago