Political News

జ‌గ‌న్ ప్ర‌భుత్వం దివాలా దీసింది.. ఈ మాట ఎవ‌రన్నారంటే!

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ప‌నిచేసిన మాజీ న్యాయ‌మూర్తుల నుంచి ప్ర‌జాస్వామ్య వాదుల వ‌ర‌కు కూడా ప్ర‌తి ఒక్క‌రూ సీఎం జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవ్‌సింహ్‌ చౌహాన్ సైగా సీఎం జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఏపీ ప్ర‌భుత్వం దివాలా తీసింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో పాల‌న లేద‌ని అన్నారు. అనుభ‌వం లేని వారిని ఎన్నుకుని ప్ర‌జలు త‌ప్పు చేశార‌ని వ్యాఖ్యానించారు. ఎక్క‌డైనా ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ప‌నిచేయించుకుని ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌కుండా ఉండ‌లేద‌ని.. కానీ, జ‌గ‌న్ మాత్రం వారిని ఏడిపిస్తున్నార‌ని.. క‌నీసం 10వ తేదీ వ‌చ్చినా.. ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేదంటే.. రాష్ట్రం దివాలా తీసిన‌ట్టు కాదా? అని నిప్పులు చెరిగారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. పూర్తిగా దివాలా తీసిందన్నారు. వ‌లంటీర్ల ద్వారా విపక్ష నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కేంద్ర మంత్రి చౌహాన్‌ మాట్లాడారు. ఏపీలో మద్యం, ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఆ ఆదాయమంతా ఎక్కడికి పోతోందని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారని, వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. 10వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

మోడీకి కితాబులు..

ఒక‌వైపు సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శించిన కేంద్ర మంత్రి చౌహాన్‌.. అదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. దేశంలో తొమ్మిదేళ్ల మోడీ పాలనలో అద్భుతాలు సృష్టించారని కేంద్రమంత్రి చౌహాన్‌ అన్నారు. సాంకేతికతతో కూడిన పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు. ఒక వ్యక్తి, ఒక వర్గం కాకుండా అందరూ ఎదగడానికి బీజేపీ కృషి చేస్తోందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం పేదల పేరుతో రాజకీయం చేసిందని విమర్శించారు.

This post was last modified on February 12, 2023 11:56 pm

Share

Recent Posts

వారణాసి నుండి రామాయణం వరకు… జక్కన్న విధ్వంసం!

తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…

39 minutes ago

పవన్ – రాజు గారి గురించి జరగాల్సిన చర్చ వేరు!

ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ…

41 minutes ago

అలియాస్ రుక్మిణి… నితిన్ దారిలో పడ్డాడు

ఒకప్పుడు యూత్ ఫుల్ హిట్లతో మంచి ఊపు మీద ఉన్న నితిన్ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో వేగంగా చేసిన సినిమాలు…

47 minutes ago

ప్యారడైజ్ ప్రీమియర్లకు ఎంత పెంపు ఉంటుంది

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాటు ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాగా…

1 hour ago

ట్రైనీ ఐపీఎస్ అధికారి సంచలన విషయాలు

లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించిన వ్యవహారం రోజుకో కొత్త మలుపు…

1 hour ago

వైకుంఠపురములో విశ్వనాథ్… పెద్ద పోలికే

నిన్న చెన్నైలో విశ్వనాథ్ అండ్ సన్స్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దీన్ని తమిళ సినిమాగానే చెబుతూ వస్తున్నారు కాబట్టి దానికి…

2 hours ago