వైసీపీ సర్కారుకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ముఖ్యంగా సీఎం జగన్కు ఇబ్బందిగానూ మారింది. త్వరలో నే రాష్ట్ర వ్యాప్తంగా గృహ సారథులు అనే కాన్సెప్టును అమలు చేయాలని సీఎం జగన్ భావించారు. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరేసి చొప్పున గృహ సారథులను నియమించాలని యోచిస్తున్నారు. వీరు పూర్తిగా పార్టీకే అంకి తం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. అంతేకాదు.. ప్రజ లను వైసీపీవైపు మళ్లించాలి.
ఇక, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేయాలి. ఇదీ.. గృహసారథులు ఇతమిత్థంగా చేయాల్సిన పని. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నియామకాలు చేయాలని పార్టీ తరఫున ఆదేశాలు కూడా వెళ్లిపోయాయి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు సమస్యల్లా.. అసలు గృహ సారథులుగా పనిచేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని .. పార్టీ చెబుతోంది. వీటిని పరిష్కరించాలని కూడా చెబుతున్నారు.
ప్రధానంగా గృహసారథులకు వేతనాలు లేవు. ఇదే పెద్దచిక్కుగా భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు.. ఎంపీలు జీతాలు తీసుకుంటున్నారు.. మేం వారి తరఫున ప్రజలకు ప్రచారం చేసి.. వారిని గెలిపిస్తే.. మాకు వచ్చే దేంటి.. పైగా రోజంతా కూడా ప్రజల మద్యే ఉండాలి. ఎమ్మెల్యేలు ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు వెళ్లాలి.. సో మాకు గిట్టు బాటు కాదని.. చాలా మంది ఎంపికైన వారు కూడా తూర్పుగోదావరి జిల్లాలో మానేశారు. ఇక, రెండో కారణం.. ప్రజలు నిలదీస్తారనే భయం.
ప్రస్తుతం ప్రభుత్వం పై ప్రజల్లో అంతో ఇంతో వ్యతిరేకత ఉంది.. దీనిని తమపై చూపిస్తారని మెజారిటీ గృహసారథులు అభిప్రాయపడుతున్నారు. మూడో సమస్య.. పార్టీ తరఫున పనిచేస్తున్న తమకు రక్షణ ఏంటనేది గృహసారథుల ప్రశ్న. ప్రతిపక్షాలు తమపై దాడులు చేస్తే.. ఎవరు తమను ఆదుకుంటారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యేలు ఎంత వరకు పూచీ పడతారనేదివారి ప్రధాన ప్రశ్న. ఇక, వచ్చేఎన్నికల్లో వైసీపీ గెలవకపోతే.. తమపై దాడులు చేసే అవకాశాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో గృహసారథుల నియామకం.. ప్రస్తుతం ఇరకాటంలో పడింది.
This post was last modified on February 12, 2023 3:18 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…