వైసీపీ సర్కారుకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ముఖ్యంగా సీఎం జగన్కు ఇబ్బందిగానూ మారింది. త్వరలో నే రాష్ట్ర వ్యాప్తంగా గృహ సారథులు అనే కాన్సెప్టును అమలు చేయాలని సీఎం జగన్ భావించారు. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరేసి చొప్పున గృహ సారథులను నియమించాలని యోచిస్తున్నారు. వీరు పూర్తిగా పార్టీకే అంకి తం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. అంతేకాదు.. ప్రజ లను వైసీపీవైపు మళ్లించాలి.
ఇక, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేయాలి. ఇదీ.. గృహసారథులు ఇతమిత్థంగా చేయాల్సిన పని. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నియామకాలు చేయాలని పార్టీ తరఫున ఆదేశాలు కూడా వెళ్లిపోయాయి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు సమస్యల్లా.. అసలు గృహ సారథులుగా పనిచేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని .. పార్టీ చెబుతోంది. వీటిని పరిష్కరించాలని కూడా చెబుతున్నారు.
ప్రధానంగా గృహసారథులకు వేతనాలు లేవు. ఇదే పెద్దచిక్కుగా భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు.. ఎంపీలు జీతాలు తీసుకుంటున్నారు.. మేం వారి తరఫున ప్రజలకు ప్రచారం చేసి.. వారిని గెలిపిస్తే.. మాకు వచ్చే దేంటి.. పైగా రోజంతా కూడా ప్రజల మద్యే ఉండాలి. ఎమ్మెల్యేలు ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు వెళ్లాలి.. సో మాకు గిట్టు బాటు కాదని.. చాలా మంది ఎంపికైన వారు కూడా తూర్పుగోదావరి జిల్లాలో మానేశారు. ఇక, రెండో కారణం.. ప్రజలు నిలదీస్తారనే భయం.
ప్రస్తుతం ప్రభుత్వం పై ప్రజల్లో అంతో ఇంతో వ్యతిరేకత ఉంది.. దీనిని తమపై చూపిస్తారని మెజారిటీ గృహసారథులు అభిప్రాయపడుతున్నారు. మూడో సమస్య.. పార్టీ తరఫున పనిచేస్తున్న తమకు రక్షణ ఏంటనేది గృహసారథుల ప్రశ్న. ప్రతిపక్షాలు తమపై దాడులు చేస్తే.. ఎవరు తమను ఆదుకుంటారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యేలు ఎంత వరకు పూచీ పడతారనేదివారి ప్రధాన ప్రశ్న. ఇక, వచ్చేఎన్నికల్లో వైసీపీ గెలవకపోతే.. తమపై దాడులు చేసే అవకాశాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో గృహసారథుల నియామకం.. ప్రస్తుతం ఇరకాటంలో పడింది.
This post was last modified on February 12, 2023 3:18 pm
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…