వైసీపీ సర్కారుకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ముఖ్యంగా సీఎం జగన్కు ఇబ్బందిగానూ మారింది. త్వరలో నే రాష్ట్ర వ్యాప్తంగా గృహ సారథులు అనే కాన్సెప్టును అమలు చేయాలని సీఎం జగన్ భావించారు. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరేసి చొప్పున గృహ సారథులను నియమించాలని యోచిస్తున్నారు. వీరు పూర్తిగా పార్టీకే అంకి తం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. అంతేకాదు.. ప్రజ లను వైసీపీవైపు మళ్లించాలి.
ఇక, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేయాలి. ఇదీ.. గృహసారథులు ఇతమిత్థంగా చేయాల్సిన పని. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నియామకాలు చేయాలని పార్టీ తరఫున ఆదేశాలు కూడా వెళ్లిపోయాయి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు సమస్యల్లా.. అసలు గృహ సారథులుగా పనిచేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని .. పార్టీ చెబుతోంది. వీటిని పరిష్కరించాలని కూడా చెబుతున్నారు.
ప్రధానంగా గృహసారథులకు వేతనాలు లేవు. ఇదే పెద్దచిక్కుగా భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు.. ఎంపీలు జీతాలు తీసుకుంటున్నారు.. మేం వారి తరఫున ప్రజలకు ప్రచారం చేసి.. వారిని గెలిపిస్తే.. మాకు వచ్చే దేంటి.. పైగా రోజంతా కూడా ప్రజల మద్యే ఉండాలి. ఎమ్మెల్యేలు ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు వెళ్లాలి.. సో మాకు గిట్టు బాటు కాదని.. చాలా మంది ఎంపికైన వారు కూడా తూర్పుగోదావరి జిల్లాలో మానేశారు. ఇక, రెండో కారణం.. ప్రజలు నిలదీస్తారనే భయం.
ప్రస్తుతం ప్రభుత్వం పై ప్రజల్లో అంతో ఇంతో వ్యతిరేకత ఉంది.. దీనిని తమపై చూపిస్తారని మెజారిటీ గృహసారథులు అభిప్రాయపడుతున్నారు. మూడో సమస్య.. పార్టీ తరఫున పనిచేస్తున్న తమకు రక్షణ ఏంటనేది గృహసారథుల ప్రశ్న. ప్రతిపక్షాలు తమపై దాడులు చేస్తే.. ఎవరు తమను ఆదుకుంటారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యేలు ఎంత వరకు పూచీ పడతారనేదివారి ప్రధాన ప్రశ్న. ఇక, వచ్చేఎన్నికల్లో వైసీపీ గెలవకపోతే.. తమపై దాడులు చేసే అవకాశాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో గృహసారథుల నియామకం.. ప్రస్తుతం ఇరకాటంలో పడింది.
This post was last modified on February 12, 2023 3:18 pm
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…