Categories: Political News

సీబీఐ అధికారుల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారా?

త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా!! అన్న‌ట్టుగా ఉంది టీడీపీ.. వైసీపీల ప‌రిస్థితి. టీడీపీ శుక్ర‌వారం.. మాజీమంత్రి, సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించి జ‌గ‌నాసుర ర‌క్త‌చ‌రిత్ర‌ పేరుతో ఒక పుస్త‌కాన్ని విడుద‌ల చేసింది. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే పేర్ని నాని తాజాగా కౌంట‌ర్ ఇచ్చారు. టీడీపీ వివేకాను కెలికితే.. పేర్ని.. ఎన్టీఆర్ విష‌యాన్ని కెలికి.. చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. మొత్తానికి ఈ రెండు పార్టీల ర‌గ‌డ.. ఆస‌క్తిగా మారింది.

విషపు రాతలతో చంద్రబాబు ఒక పుస్తకం అచ్చు వేయించాడని, దానిపై తన పేరు కూడా వేసుకోలేని పిరికిపంద చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు ‘‘పుస్తకంపై ఎక్కడా టీడీపీ పేరు లేదు. ఇవన్నీ అసత్యపు రాతలు కాబట్టే పేరు వేసుకునే ధైర్యం లేదు. అచ్చెన్నాయుడికి బాడీ తప్ప బుర్ర ఉండదు’’ అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. వివేకా హత్య జ‌రిగిన‌ప్పుడు రాష్ట్రంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే ఉంద‌న్నారు. అయితే.. అప్పుడు అధికారంలో ఉండి ఏం చేశార‌ని.. పేర్ని ప్ర‌శ్నించారు.

వివేకానంద‌రెడ్డి భార్య, కుమార్తె సునీత‌, అల్లుడిని ఎందుకు విచారించలేదని పేర్ని ప్ర‌శ్నించారు. డాక్ట‌ర్ సునీత‌ చెప్పిన అంశాలపై ఎందుకు విచారణ జరపలేదని ప్ర‌శ్నించారు.(కానీ, అప్ప‌ట్లో ఆమె బ‌య‌ట‌కు రాలేదు. ఈ విష‌యాన్నిపేర్ని మ‌రిచిపోయిన‌ట్టుగా ఉన్నారు) ఎన్టీఆర్‌ మరణానికి కారణం చంద్రబాబు కదా అని గ‌త విష‌యాన్ని త‌వ్వి తీశారు. ఎన్టీఆర్‌ మరణంపై కూడా ఒక పుస్తకం వేయించాలన్నారు. అంతేకాదు.. మాజీ స్పీక‌ర్‌, దివంగ‌త కోడెల శివప్రసాద్‌ మరణంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు అడగలేదని పేర్ని ప్ర‌శ్నించారు.

‘‘అవినాష్‌రెడ్డి సీబీఐకి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడంటూ చంద్రబాబు ఎలా చెబుతాడు?. సీబీఐ దగ్గర అవినాష్‌ చెప్పిన విషయాలు మీకు ఎలా తెలుసు?. సీబీఐ అధికారుల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారా?. చంద్రబాబు డైరెక్షన్‌లో సీబీఐ నడుస్తుందా?. వివేకా హత్యపై టీడీపీ ప్రభుత్వంలో ఎందుకు ఛార్జ్‌షీట్‌ వేయలేదు?’’ అంటూ పేర్ని నాని నిల‌దీశారు. చంద్రబాబు.. ఆయ‌న ద‌త్త‌పుత్రుడు(ప‌వ‌న్‌) ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను దెబ్బతీయలేరని పేర్ని చెప్పుకొచ్చారు.

రాజకీయాల కోసం ఇంట్లో ఆడవాళ్లను బజారున ప‌డేస్తావ‌ని చంద్ర‌బాబుపై పేర్ని విరుచుకుప‌డ్డారు.(వాస్త‌వానికి ఈవిష‌యంలో వైసీపీ ఎమ్మెల్యేలే క‌దా ముందు వ్యాఖ్య‌లు చేసింది) సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చేసింది ఎవరని ప్ర‌శ్నించారు. ఇళ్లలో ఉన్న మహిళల ఫొటోలను పుస్తకంలో వేస్తారా?. మీ ఇంట్లో వారే మహిళలా? వేరే ఇళ్లలో ఉన్నవారు మహిళలు కాదా? అని నిల‌దీశారు. మొత్తానికి దీనిపై టీడీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Share

Recent Posts

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

2 minutes ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

36 minutes ago

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

2 hours ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

3 hours ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

4 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

5 hours ago