Political News

రోజాకు నాగబాబు అదిరిపోయే పంచ్

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు.. ప్రతిపక్ష జనసేన నాయకులకు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలోనే వాదోపవాదాలు, విమర్శలు ప్రతి విమర్శలు సాగుతున్నాయి కొంత కాలంగా. ఈ మధ్య జనసేన నాయకులు, కార్యకర్తలు వైసీపీ నేతలు, మద్దతుదారులను ఢీ అంటే ఢీ అన్నట్లు ఎదుర్కొంటున్నారు. వాళ్లొక పంచ్ వేస్తే వీళ్లు రెండు అన్నట్లు సాగుతోంది వ్యవహారం.

మెగా ఫ్యామిలీతో ఒకప్పుడు సన్నిహితంగానే ఉన్న వైసీపీ మంత్రి రోజా.. ఇటీవల ఆ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు చేసింది. దానికి మెగా బ్రదర్ నాగబాబు దీటుగా సమాధానం ఇచ్చాడు. ప్రతిగా రోజా మళ్లీ ఆయన్ని టార్గెట్ చేసింది. తర్వాత ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. కానీ నాగబాబు మరోసారి రోజా మీద గట్టి పంచ్ వేశాడు. ఎక్కడ ఏంటన్న వివరాలు తెలియట్లేదు కానీ.. మంత్రి రోజా ఒక మంచి నీళ్ల ట్యాప్‌ను ప్రారంభిస్తున్న ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది.

ఈ ఫొటోను నాగబాబు షేర్ చేస్తూ.. “హంద్రీ నీవా సుజల స్రవంతిని ప్రారంభించిన రోజా. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ (మాయ) పార్టీ నాయకురాలు రోజా. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగు నీరు అందినట్లు సమాచారం” అని వ్యాఖ్య జోడించాడు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదే‌శ్‌లో ఉన్నపెద్ద పరిశ్రమలు బయటికి తరలి వెళ్లిపోవడమే తప్ప కొత్త ఇండస్ట్రీలు చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చిన దాఖలాలు లేవు. మామూలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కానీ వైసీపీ నేతలు.. ఇలా మంచి నీళ్ల ట్యాప్‌ల లాంటి చిన్న చిన్న ప్రారంభోత్సవాల్లో పాల్గొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పంచ్‌లు వేయించుకోవడం మామూలే. ఈ క్రమంలోనే నాగబాబు సైతం రోజాకు అదిరిపోయే పంచ్ వేశారు. ఈ పోస్టుకు రోజాను ట్యాగ్ కూడా చేసిన నేపథ్యంలో ఆమె నాగబాబుకు ఎలా బదులిస్తుందో చూడాలి.

This post was last modified on February 11, 2023 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

32 minutes ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

3 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

4 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

5 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

6 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

7 hours ago