Political News

వైసీపీలో ఈ 11 మంది ఎంపీలపై ఒక్క‌టే హాట్ టాపిక్‌…!

వైసీపీలో ఎంపీల వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్నా.. ఎంపీల్లో స‌గం మంది కూడా.. పుంజుకోవ‌డం లేదు. ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌డం లేదు. గ‌డ‌ప‌గ‌డ‌ప కార్య‌క్ర‌మాన్ని త‌మ‌ది కాన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక‌రిద్ద‌రు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం లేదు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. మాత్రం గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరుగుతున్నారు. అయితే, ఈయ‌న‌కు టికెట్ ఇవ్వ‌బోమ‌ని.. పార్టీ అంత‌ర్గ‌తంగా నిర్ణ‌యానికి వ‌చ్చేసింది.

ఏమో మ‌న‌సు మార్చుకునే అవ‌కాశం ఉందేమో.. అని ఎంపీగారు మాత్రం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. కుప్పంలో చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపించేందుకు తాను రెడీ అని ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఇక‌, మిగిలిన వారిలో అర‌కు ఎంపీ గొట్టేటి మాధ‌వి.. ఊసు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. నిజానికి డౌన్ టు ఎర్త్ అనే విధంగా ఆమె సామాన్యురాలిగానే ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ పరంగా కానీ, ప‌నుల ప‌రంగా కానీ.. ఎక్క‌డా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. పార్ల‌మెంటులోనూ ఆమె గ‌ళం వినిపించ‌డం లేదు.

అదేవిధంగా బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ లోక‌ల్ పాలిటిక్స్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. నిజానికి ఎంపీగా ఉన్న ఆయ‌న ఏ ఒక్క కార్య‌క్ర‌మాన్నీ చేయ‌లేక‌పోయారు. ఎంతో చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ బాషా స‌మ‌స్య ఆయన‌ను వేధిస్తోంద‌ట‌. పార్ల‌మెంటులో ఇప్ప‌టి వ‌ర‌కు గ‌ళం వినిపించిన దాఖ‌లా లేనేలేదు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఎంతో అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికీ.. దానిని ఆయ‌న వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు వ్యాపారాల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసుకుంటున్నారు.

త‌న‌పై మీడియాలో యాంటీ వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం సొంత నిధులు రెండో మూడో ల‌క్ష‌లు వెచ్చించి.. సేవా కార్య‌క్ర‌మాల పేరిట పంచుతున్నారు. ఇంత‌కు మించి ఆయ‌న ఎక్క‌డా స్పందించ‌డం లేదు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న వారసుడు పోటీ చేస్తారంటూ.. ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. నంద్యాల ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డిని స్థానిక ప్ర‌జ‌లు చూసి మూడేళ్లు దాటిపోయింద‌ని అంటున్నారు. ఇటు పార్టీకి కూడా అందుబాటులో లేకుండా.. ఆయ‌న బిజీగా గ‌డిపేస్తున్నారు.

ఇలా.. 11 మందికిపైగా ఎంపీలు.. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పార్టీ అధిష్టా నానికి ఉప్పందింది. దీంతో వీరిని తీసేయాలా.. లేక‌పోతే.. అసెంబ్లీకి పంపించాలా? అని అంత‌ర్మ‌థ‌నం ప్రారంభ‌మైంద‌ట‌. అయితే.. ఇప్ప‌టికిప్పుడు వీరికి టికెట్ లేద‌ని తెలిసినా.. ఇబ్బందేన‌ని భావిస్తున్న అధిష్టానం.. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వేచి చూసి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

10 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

12 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

14 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

14 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

15 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

15 hours ago