Political News

కేసీఆర్ క‌ల‌ల స‌చివాల‌యానికి బ్రేక్‌.. ముహూర్తం వాయిదా!

తెలంగాణ ముఖ్యమంత్రి.. కేసీఆర్ క‌ల‌ల సచివాల‌యం.. అంబేడ్క‌ర్ సెక్ర‌టేరియెట్‌ను ఈ నెల 17న ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. మంచి ముహూర్తం కూడా కావ‌డంతో..ఆరు నూరైనా.. దీనిని ప్రారంభించి.. జాతికి అంకితం చేయాల‌ని భావించారు. దీనికి సంబంధించి ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. మాజీ ముఖ్యమంత్రుల‌ను కూడా కేసీఆర్ ఆహ్వానించారు. దీనికి పెద్ద హంగామానే సృష్టించారు. దీని ప్రారంభం అనంత‌రం.. సికింద్రాబాద్‌లో భారీ స‌భ కూడా ఏర్పాటు చేశారు.

అయితే..అనూహ్యంగా ఈ ముహూర్తం వాయిదా ప‌డింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావ‌డంతో కేసీఆర్ స‌ర్కారు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రారంభోత్సవ తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నెల 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. సచివాలయ ప్రారంభోత్సవ అంశంపై సీఈసీని సీఎస్‌ శాంతికుమారి సంప్రదించారు.

సీఈసీ నుంచి ఆశాజనక స్పందన రాకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలావుంటే.. కొత్త సచివాల‌యం.. 28 ఎకరాల విస్తీర్ణంలో సుందరంగా సిద్ధమైంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు కాగా.. 265 అడుగుల ఎత్తున నిర్మించారు. ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణాన్ని 2020 జనవరిలో ప్రభుత్వం చేపట్టింది. 11 అంతస్తుల ఎత్తుతో నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. మ‌య‌స‌భ‌ను త‌ల‌పించే ఏర్పాట్లు కూడా చేశారు.

This post was last modified on February 11, 2023 12:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైద‌రాబాదీలు… 100 కోట్ల విల్లా కొంటారా?

ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు సైతం కోటి.. అంత‌కంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వ‌చ్చేశాయి. ధ‌ర‌లు అంత‌గా…

1 hour ago

కీరవాణి అది తప్పని ఋజువు చేయాలి

సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…

2 hours ago

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

5 hours ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

6 hours ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

9 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

10 hours ago