Political News

సాయిరెడ్డికే కీల‌క‌ బాధ్య‌త‌లు.. మ‌రోసారి కీ రోల్‌కు రెడీ…!


“ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పాగా వేయాలి. సీమ‌లో ఫ‌ర్వాలేదు. ఇక‌, కోస్తాలో ఎంత చించుకున్నా.. ఫిఫ్టీ -ఫిఫ్టీ అయితే.. చాలు”- ఇదీ.. వైసీపీ అధినేత ..సీఎం జ‌గ‌న్ విధానం.. నినాదంగా ఉంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాలని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి బాధ్య‌త‌ల‌ను పార్టీలో నెంబ‌ర్‌2గా ఉన్న‌(అప్ప‌ట్లో) విజ‌య‌సాయిరెడ్డి చూసుకునేవారు.

దీంతో పార్టీ ప‌రుగులు పెట్టింది. విశాఖ మేయ‌ర్ పీఠాన్ని కూడా వైసీపీ ద‌క్కించుకుంది. అయితే.. వివిధ కారణాల‌తో ఆయ‌న‌ను త‌ప్పించిన త‌ర్వాత‌..అనూహ్యంగా పార్టీ వెనుక‌బ‌డి పోయింది. ప్ర‌స్తుతం వైవీ సుబ్బారెడ్డి ఇక్క‌డి పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్న‌ప్ప‌టికీ.. అనుకున్న రేంజ్‌లో అయితే ముందుకు సాగ‌డం లేదు. ఆయ‌న నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలోనూ.. వెనుక‌డుగు వేస్తున్నారు. దీంతో ఇది ఎన్నిక‌ల‌కు ముందు కొంపముంచేలా ఉంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

దీంతో జ‌గ‌న్ తిరిగి విజ‌య‌సాయిరెడ్డికే బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సాయిరెడ్డిపై కొంత వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న స‌మ‌ర్థ‌వంతంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. పాద‌యాత్ర చేసి.. పార్టీని కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిపించారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. త‌ప్ప పార్టీ కుదురుకునే ప‌రిస్థితి లేద‌ని జ‌గ‌న్ అంచ‌నా వేస్తున్నారు. వాస్త‌వంగా చూసినా.. ప్ర‌స్తుతం వైసీపీ దూకుడు త‌గ్గిపోయింది.

ఇదేస‌మ‌యంలో టీడీపీ దూకుడు పెరిగింది. మ‌రోవైపు జ‌నసేన 2 జిల్లాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రాజ‌కీయా లు చేస్తోంది. విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో.. జ‌నసేన కార్య‌క్ర‌మాలు గ‌తం కంటే ఎక్కువ‌గా పెరిగాయి. రెండు సార్లువ‌రుస‌గా జ‌న‌సేనాని ఇక్క‌డ స‌భ‌లు నిర్వ‌హించారు. ఇది రాజ‌కీయంగా వైసీపీకి డౌన్ ఫాల్ అయింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. పైగా వైవీ రూపాయి ఖ‌ర్చు పెట్ట‌డం లేదు. సాయి రెడ్డి అయితే.. ఏదో ఒక కార్య‌క్ర‌మంతో ఇక్క‌డ నిత్యం మీడియాను ఎంగేజ్ చేసేవారు. దీంతో ఆయ‌నైతే క‌రెక్ట్ అని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

Satya

Recent Posts

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

3 minutes ago

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

24 minutes ago

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

3 hours ago

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

6 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

10 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

13 hours ago