Political News

సాయిరెడ్డికే కీల‌క‌ బాధ్య‌త‌లు.. మ‌రోసారి కీ రోల్‌కు రెడీ…!


“ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పాగా వేయాలి. సీమ‌లో ఫ‌ర్వాలేదు. ఇక‌, కోస్తాలో ఎంత చించుకున్నా.. ఫిఫ్టీ -ఫిఫ్టీ అయితే.. చాలు”- ఇదీ.. వైసీపీ అధినేత ..సీఎం జ‌గ‌న్ విధానం.. నినాదంగా ఉంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాలని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి బాధ్య‌త‌ల‌ను పార్టీలో నెంబ‌ర్‌2గా ఉన్న‌(అప్ప‌ట్లో) విజ‌య‌సాయిరెడ్డి చూసుకునేవారు.

దీంతో పార్టీ ప‌రుగులు పెట్టింది. విశాఖ మేయ‌ర్ పీఠాన్ని కూడా వైసీపీ ద‌క్కించుకుంది. అయితే.. వివిధ కారణాల‌తో ఆయ‌న‌ను త‌ప్పించిన త‌ర్వాత‌..అనూహ్యంగా పార్టీ వెనుక‌బ‌డి పోయింది. ప్ర‌స్తుతం వైవీ సుబ్బారెడ్డి ఇక్క‌డి పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్న‌ప్ప‌టికీ.. అనుకున్న రేంజ్‌లో అయితే ముందుకు సాగ‌డం లేదు. ఆయ‌న నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలోనూ.. వెనుక‌డుగు వేస్తున్నారు. దీంతో ఇది ఎన్నిక‌ల‌కు ముందు కొంపముంచేలా ఉంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

దీంతో జ‌గ‌న్ తిరిగి విజ‌య‌సాయిరెడ్డికే బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సాయిరెడ్డిపై కొంత వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న స‌మ‌ర్థ‌వంతంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. పాద‌యాత్ర చేసి.. పార్టీని కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిపించారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. త‌ప్ప పార్టీ కుదురుకునే ప‌రిస్థితి లేద‌ని జ‌గ‌న్ అంచ‌నా వేస్తున్నారు. వాస్త‌వంగా చూసినా.. ప్ర‌స్తుతం వైసీపీ దూకుడు త‌గ్గిపోయింది.

ఇదేస‌మ‌యంలో టీడీపీ దూకుడు పెరిగింది. మ‌రోవైపు జ‌నసేన 2 జిల్లాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రాజ‌కీయా లు చేస్తోంది. విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో.. జ‌నసేన కార్య‌క్ర‌మాలు గ‌తం కంటే ఎక్కువ‌గా పెరిగాయి. రెండు సార్లువ‌రుస‌గా జ‌న‌సేనాని ఇక్క‌డ స‌భ‌లు నిర్వ‌హించారు. ఇది రాజ‌కీయంగా వైసీపీకి డౌన్ ఫాల్ అయింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. పైగా వైవీ రూపాయి ఖ‌ర్చు పెట్ట‌డం లేదు. సాయి రెడ్డి అయితే.. ఏదో ఒక కార్య‌క్ర‌మంతో ఇక్క‌డ నిత్యం మీడియాను ఎంగేజ్ చేసేవారు. దీంతో ఆయ‌నైతే క‌రెక్ట్ అని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

This post was last modified on February 11, 2023 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago