టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలై పక్షం రోజులు దాటిపోయింది. లోకేష్ ను చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆరు నూరైన 400 రోజుల వరకు యాత్ర నిరాటంకంగా కొనసాగుతుందని లోకేష్తో పాటు టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు యాత్రపై నీలినీడలు అలుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాత్ర కొనసాగించడం అనుమానమేనని వినిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కోడ్ కూడా అమలులోకి వచ్చింది. దానితో ఇప్పుడు లోకేష్ యాత్ర నిర్వహించే మార్గంలో ఉన్న జిల్లా కలెక్టర్లకు పెద్ద సంకటం వచ్చి పడింది. యాత్రలో హామీలు ఏమైనా ఇస్తే అది కోడ్ ఉల్లంఘన అవుతుందని అనుమానాలు తలెత్తాయి. దానితో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు. ఇదే అనుమానం వైసీపీ వారి గడప గడపకు కార్యక్రమంపై కూడా రావడంతో క్లారిటీ అడిగారు.
హామీలు ఇవ్వకపోతే చాలా..
యాత్రలపై మరో వాదన తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో గెలిస్తే ఇలా చేస్తాం, అలా చేస్తామని హామీలు ఇవ్వకపోతే యాత్రలు, గడప గడపకు కార్యక్రమాలతో ఇబ్బంది లేదని కొందరంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే యాత్ర ప్రారంభమైన కారణంగా ఇప్పుడు ఆపాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. యాత్రకు బ్రేక్ ఇవ్వాల్సిందేనని ఈసీ నిర్ణయిస్తే మాత్రం యువగళాన్ని రెండు నెలల పాటు ఆపాల్సి ఉంటుంది..
వైసీపీ గేమ్ ప్లాన్ ఏమిటి ?
నేల ఈనినట్లుగా పాదయాత్రకు గుంపులు వస్తుంటే, జనం లేరని వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు చేశారు. అన్నీ పోలీసుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులే కావడం విశేషం. తాజాగా పాదయాత్ర వలన ఇబ్బందులు ఎదుర్కొంన్నామంటూ కొంతమంది అధికార పార్టీ సానుభూతిపరుల ద్వారా ముందుగా పోలీసులను ఆశ్రయించడం, ఆ తరువాత కోర్టుకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో పాటు, రాజధాని రైతుల మాదిరిగా లోకేష్ ను కూడా తనంతట తానుగా పాదయాత్ర మానిపించే విధంగా పావులు కదపాలని కొంతమంది వ్యూహకర్తలు ప్లాన్ చేశారని చెబుతున్నారు..
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…