Political News

లోకేష్ పాదయాత్రను ఆపుతారా.. ?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలై పక్షం రోజులు దాటిపోయింది. లోకేష్ ను చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆరు నూరైన 400 రోజుల వరకు యాత్ర నిరాటంకంగా కొనసాగుతుందని లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు యాత్రపై నీలినీడలు అలుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాత్ర కొనసాగించడం అనుమానమేనని వినిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కోడ్ కూడా అమలులోకి వచ్చింది. దానితో ఇప్పుడు లోకేష్ యాత్ర నిర్వహించే మార్గంలో ఉన్న జిల్లా కలెక్టర్లకు పెద్ద సంకటం వచ్చి పడింది. యాత్రలో హామీలు ఏమైనా ఇస్తే అది కోడ్ ఉల్లంఘన అవుతుందని అనుమానాలు తలెత్తాయి. దానితో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు. ఇదే అనుమానం వైసీపీ వారి గడప గడపకు కార్యక్రమంపై కూడా రావడంతో క్లారిటీ అడిగారు.

హామీలు ఇవ్వకపోతే చాలా..

యాత్రలపై మరో వాదన తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో గెలిస్తే ఇలా చేస్తాం, అలా చేస్తామని హామీలు ఇవ్వకపోతే యాత్రలు, గడప గడపకు కార్యక్రమాలతో ఇబ్బంది లేదని కొందరంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే యాత్ర ప్రారంభమైన కారణంగా ఇప్పుడు ఆపాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. యాత్రకు బ్రేక్ ఇవ్వాల్సిందేనని ఈసీ నిర్ణయిస్తే మాత్రం యువగళాన్ని రెండు నెలల పాటు ఆపాల్సి ఉంటుంది..

వైసీపీ గేమ్ ప్లాన్ ఏమిటి ?

నేల ఈనినట్లుగా పాదయాత్రకు గుంపులు వస్తుంటే, జనం లేరని వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు చేశారు. అన్నీ పోలీసుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులే కావడం విశేషం. తాజాగా పాదయాత్ర వలన ఇబ్బందులు ఎదుర్కొంన్నామంటూ కొంతమంది అధికార పార్టీ సానుభూతిపరుల ద్వారా ముందుగా పోలీసులను ఆశ్రయించడం, ఆ తరువాత కోర్టుకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో పాటు, రాజధాని రైతుల మాదిరిగా లోకేష్‌ ను కూడా తనంతట తానుగా పాదయాత్ర మానిపించే విధంగా పావులు కదపాలని కొంతమంది వ్యూహకర్తలు ప్లాన్ చేశారని చెబుతున్నారు..

This post was last modified on February 11, 2023 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

38 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

57 minutes ago

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago