Political News

కోటంరెడ్డి ఎఫెక్ట్‌.. దిగొచ్చిన జ‌గ‌న్‌.. ఏం చేశారంటే!

ఒక‌వైపు ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నాయి. మ‌రో వైపు అధికార పార్టీలో నేత‌ల మ‌ధ్య విభేదాలు.. వివాదాలు రోజుకోర‌కంగా తెర మీదికి వ‌స్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కార స్వ‌రం వినిపిస్తున్నారు. ప్ర‌ధానంగా సీఎం జ‌గ‌న్‌కు ఆత్మీయుడిగా పేరున్న కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి బ‌య‌ట‌ప‌డిపోయారు. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేల‌కు క‌నీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌ని సీఎం జ‌గ‌న్ ఇప్పుడు దిగి వ‌చ్చారు. ఎమ్మెల్యేల సాధ‌క బాధ‌లు వినేందుకు రెడీ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు న‌డుం బిగించారు.

ఈ క్ర‌మంలో తాజాగా రెండు రోజుల పాటు ఉమ్మ‌డికృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న వ‌ర్గ విభేదాల‌పై స్వ‌యంగా ఆయ‌నే స‌మీక్షించారు. అటు మంత్రి జోగి ర‌మేష్‌, ఇటు మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత‌కృష్ణ‌ప్ర‌సాద్‌ల‌తో సీఎం జ‌గ‌న్ భేటీ అయ్యారు. వారి స‌మ‌స్య‌లు విన్నారు. ఎక్క‌డ విభేదాలు వ‌చ్చాయో తెలుసుకున్నారు. త‌న మాట క‌నీసం చిన్న‌స్థాయి అధికారి కూడా వినిపించుకోవ‌డం లేద‌ని.. ఇదంతా కూడా మంత్రి జోగి జోక్యంతోనే జ‌రుగుతోంద‌ని వ‌సంత కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు తెలుస్తోంది. అదేస‌మ‌యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి వెళ్తే ప్ర‌జ‌లు కూడా అనేక స‌మ‌స్య‌లు ఏక‌రువు పెడుతున్నార‌ని తెలిపారు.

అటు అధికారులు మాట విన‌క‌పోవ‌డం.. ఇటు మంత్రి జోక్యంతో తాను విసిగిపోయాన‌ని ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు. దీనిపై స్పందించిన సీఎం జ‌గ‌న్‌.. ఈ ప‌రిణామాల‌ను స‌రిదిద్దే బాధ్య‌త త‌న‌దేన‌ని తేల్చి చెప్పారు. ఆ వెంట‌నే సంబంధిత అధికారుల‌తోనూ ఆయ‌న చ‌ర్చించి.. ఎమ్మెల్యే చెప్పింది చేయాల‌ని ఆయ‌న సూచించారు. దీంతో ఎమ్మెల్యే వ‌సంత శాంతించారు. త్వ‌ర‌లోనే గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మాన్ని తిరిగి ప్రారంభించ‌నున్న‌ట్టు చెప్పారు. మొత్తానికి కోటంరెడ్డి ఎఫెక్ట్ వైసీపీకి బాగానే త‌గిలింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదిలావుంటే, మ‌రోవైపు.. వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్.. తాను పార్టీ మారుతున్నాన‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించారు. తాను పార్టీ ప్ర‌స‌క్తి లేద‌ని.. మంత్రి జోక్యంతోనే ఇన్నాళ్లుగా స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని.. సీఎం జ‌గ‌న్ జోక్యం చేసుకునేందుకు హామీ ఇచ్చార‌ని.. తాను పార్టీమార‌బోన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నేత దేవినేని ఉమాను ఓడించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చెప్పుకొచ్చారు. ఒక‌వేళ పార్టీ మారే ప‌రిస్థితి వ‌స్తే.. తాను రాజకీయాల నుంచి విర‌మించుకుంటాన‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. సీఎం జ‌గ‌న్ జోక్యంతో స‌మ‌స్య ప‌రిష్కారం అయిన‌ట్టేన‌ని ఎమ్మెల్యే వ‌ర్గం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 10, 2023 9:47 pm

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

2 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

3 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

4 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

5 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

9 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

10 hours ago