ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. జగనాసు ర రక్త చరిత్ర పేరుతో రాసిన ఈ పుస్తకాన్ని తాజాగా పార్టీ ఆవిష్కరించింది. సీఎం జగన్ సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి.. రాసిన ఈ పుస్తకంలో అనేక సంచలన విషయాలను ప్రస్తావించారు.
ఆది నుంచి ఈ ఘటనలో జరిగిన అనేక విషయాలు సహా.. అనేక మలుపులను కూడా పేర్కొన్నారు. ప్రధానంగా వివేకా హత్య కేసులో ఇటీవల వెలుగు చూసిన పరిణామాల్లో వేళ్లన్నీ సీఎం జగన్ రెడ్డి ఆయన సతీమణి భారతీరెడ్డి కుటుంబం వైపే చూపిస్తున్నాయని పుస్తకంలో వెల్లడించారు. ‘జగన్ రెడ్డి నరహంతక పాలనకు చరమ గీతం పాడుదాం- ప్రజా స్వామ్యాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో పుస్తకాన్ని టీడీపీ విడుదల చేసింది.
తాడేపల్లి అండ లేకుండా ఇన్ని నేరాలు.. ఘోరాలు సాధ్యం కాదని పుస్తకంలో పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన వేకువ జామున 3 గంటల సమయంలో జరిగిందని.. ఆ సమయంలోనే నవీన్(భారతి పీఏ) ఫోన్ ద్వారా భారతీరెడ్డితో, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్రెడ్డి మాట్లాడానని సీబీఐకి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ వివరాలను పుస్తకంలో కళ్లకు కట్టినట్టు వివరించారు.
సీబీఐ చార్జిషీట్, వివేకానందరెడ్డి కుమార్తె సునీత అఫిడవిట్స్, వైయస్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వైఎస్ షర్మిల, సునీతారెడ్డి వాంగ్మూలాలు, అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం తదితర అంశాలతో పుస్తకాన్ని రూపొందించారు. మొత్తానికి సీబీఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం సంచలనంగా మారింది.
This post was last modified on February 10, 2023 6:28 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…