Political News

జ‌గ‌నాసుర ర‌క్త చ‌రిత్ర‌..

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఒక పుస్త‌కాన్ని విడుద‌ల చేసింది. జ‌గ‌నాసు ర ర‌క్త చ‌రిత్ర‌ పేరుతో రాసిన ఈ పుస్త‌కాన్ని తాజాగా పార్టీ ఆవిష్క‌రించింది. సీఎం జ‌గ‌న్ సొంత బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించి.. రాసిన ఈ పుస్త‌కంలో అనేక సంచ‌ల‌న విష‌యాల‌ను ప్ర‌స్తావించారు.

ఆది నుంచి ఈ ఘ‌ట‌న‌లో జ‌రిగిన అనేక విష‌యాలు స‌హా.. అనేక మ‌లుపులను కూడా పేర్కొన్నారు. ప్ర‌ధానంగా వివేకా హత్య కేసులో ఇటీవ‌ల వెలుగు చూసిన ప‌రిణామాల్లో వేళ్లన్నీ సీఎం జగన్ రెడ్డి ఆయ‌న స‌తీమ‌ణి భారతీరెడ్డి కుటుంబం వైపే చూపిస్తున్నాయని పుస్తకంలో వెల్లడించారు. ‘జగన్ రెడ్డి నరహంతక పాలనకు చరమ గీతం పాడుదాం- ప్రజా స్వామ్యాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో పుస్తకాన్ని టీడీపీ విడుదల చేసింది.

తాడేపల్లి అండ లేకుండా ఇన్ని నేరాలు.. ఘోరాలు సాధ్యం కాదని పుస్తకంలో పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన వేకువ జామున 3 గంటల సమయంలో జరిగిందని.. ఆ సమయంలోనే నవీన్(భార‌తి పీఏ) ఫోన్ ద్వారా భారతీరెడ్డితో, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్‌రెడ్డి మాట్లాడానని సీబీఐకి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ వివరాలను పుస్తకంలో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రించారు.

సీబీఐ చార్జిషీట్, వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత అఫిడవిట్స్, వైయస్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వైఎస్ ష‌ర్మిల‌, సునీతారెడ్డి వాంగ్మూలాలు, అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం తదితర అంశాలతో పుస్తకాన్ని రూపొందించారు. మొత్తానికి సీబీఐ ద‌ర్యాప్తు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ పుస్త‌కాన్ని విడుద‌ల చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

This post was last modified on February 10, 2023 6:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

25 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

45 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago