ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. జగనాసు ర రక్త చరిత్ర
పేరుతో రాసిన ఈ పుస్తకాన్ని తాజాగా పార్టీ ఆవిష్కరించింది. సీఎం జగన్ సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి.. రాసిన ఈ పుస్తకంలో అనేక సంచలన విషయాలను ప్రస్తావించారు.
ఆది నుంచి ఈ ఘటనలో జరిగిన అనేక విషయాలు సహా.. అనేక మలుపులను కూడా పేర్కొన్నారు. ప్రధానంగా వివేకా హత్య కేసులో ఇటీవల వెలుగు చూసిన పరిణామాల్లో వేళ్లన్నీ సీఎం జగన్ రెడ్డి ఆయన సతీమణి భారతీరెడ్డి కుటుంబం వైపే చూపిస్తున్నాయని పుస్తకంలో వెల్లడించారు. ‘జగన్ రెడ్డి నరహంతక పాలనకు చరమ గీతం పాడుదాం- ప్రజా స్వామ్యాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో పుస్తకాన్ని టీడీపీ విడుదల చేసింది.
తాడేపల్లి
అండ లేకుండా ఇన్ని నేరాలు.. ఘోరాలు సాధ్యం కాదని పుస్తకంలో పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన వేకువ జామున 3 గంటల సమయంలో జరిగిందని.. ఆ సమయంలోనే నవీన్(భారతి పీఏ) ఫోన్ ద్వారా భారతీరెడ్డితో, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్రెడ్డి మాట్లాడానని సీబీఐకి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ వివరాలను పుస్తకంలో కళ్లకు కట్టినట్టు వివరించారు.
సీబీఐ చార్జిషీట్, వివేకానందరెడ్డి కుమార్తె సునీత అఫిడవిట్స్, వైయస్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వైఎస్ షర్మిల, సునీతారెడ్డి వాంగ్మూలాలు, అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం తదితర అంశాలతో పుస్తకాన్ని రూపొందించారు. మొత్తానికి సీబీఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం సంచలనంగా మారింది.
This post was last modified on February 10, 2023 6:28 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…