ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. జగనాసు ర రక్త చరిత్ర పేరుతో రాసిన ఈ పుస్తకాన్ని తాజాగా పార్టీ ఆవిష్కరించింది. సీఎం జగన్ సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి.. రాసిన ఈ పుస్తకంలో అనేక సంచలన విషయాలను ప్రస్తావించారు.
ఆది నుంచి ఈ ఘటనలో జరిగిన అనేక విషయాలు సహా.. అనేక మలుపులను కూడా పేర్కొన్నారు. ప్రధానంగా వివేకా హత్య కేసులో ఇటీవల వెలుగు చూసిన పరిణామాల్లో వేళ్లన్నీ సీఎం జగన్ రెడ్డి ఆయన సతీమణి భారతీరెడ్డి కుటుంబం వైపే చూపిస్తున్నాయని పుస్తకంలో వెల్లడించారు. ‘జగన్ రెడ్డి నరహంతక పాలనకు చరమ గీతం పాడుదాం- ప్రజా స్వామ్యాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో పుస్తకాన్ని టీడీపీ విడుదల చేసింది.
తాడేపల్లి అండ లేకుండా ఇన్ని నేరాలు.. ఘోరాలు సాధ్యం కాదని పుస్తకంలో పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన వేకువ జామున 3 గంటల సమయంలో జరిగిందని.. ఆ సమయంలోనే నవీన్(భారతి పీఏ) ఫోన్ ద్వారా భారతీరెడ్డితో, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్రెడ్డి మాట్లాడానని సీబీఐకి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ వివరాలను పుస్తకంలో కళ్లకు కట్టినట్టు వివరించారు.
సీబీఐ చార్జిషీట్, వివేకానందరెడ్డి కుమార్తె సునీత అఫిడవిట్స్, వైయస్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వైఎస్ షర్మిల, సునీతారెడ్డి వాంగ్మూలాలు, అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం తదితర అంశాలతో పుస్తకాన్ని రూపొందించారు. మొత్తానికి సీబీఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం సంచలనంగా మారింది.
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…
పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…