ఏప్రిల్ టార్గెట్! ఆ తర్వాత.. అనేక మార్పులు అనూహ్య మార్పులు ఖాయం! తాడేపల్లి వర్గాల్లో జోరుగా జరు గుతున్న చర్చ ఇదే! ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని విధంగా ఉన్న వైసీపీ రాజకీయాలు మరోసారి యూటర్న్తీసుకునేలా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం విశాఖను పాలనారాజధాని చేయాలనే తపన తో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మార్చుకునే ప్రయత్నం లేదని కూడా తేల్చి చెప్పిం ది. అయితే.. ఇది సుప్రీంకోర్టు ఇచ్చే అంతిమ తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది.
వాస్తవానికి మార్చిలోనే విశాఖకు వెళ్లిపోవాలని అనుకున్నా.. అది సాధ్యం అయ్యేలా లేదు. దీంతో క్యాంపు కార్యాలయాన్ని తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇది కూడా ఉగాది తర్వాతే జరగనుందని అంటున్నారు. ఉగాది మార్చి 22న వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాతే.. ప్రభుత్వం అడుగులు వేయడం ఖా యంగా కనిపిస్తోంది. అదే సయమంలో క్యాంపు కార్యాలయాన్ని కూడా ఉగాది తర్వాతే తరలించే ప్రయ త్నం చేస్తున్నారు.
ఇక, రాష్ట్ర మంత్రివర్గంపై సీఎం జగన్ ఒకింత అసహనంగా ఉన్నారు. ఎవరూ యాక్టివ్గా పని చేయడం లే దనేది ఆయన తరచుగా చెబుతున్న మాట. దీనికి తోడు కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు బాహా టంగానే వినిపిస్తున్నాయి. మరికొందరు భూముల ఆక్రమణ కేసుల్లో ఉన్నారు. ఇంకొందరు పనితప్ప.. అ న్నీ చేస్తున్నారు. దీంతో మరోసారి ప్రక్షాళన చేసే దిశగా సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీని ప్రకారం.. కొత్త ముఖాలను లేపేసి.. మరోసారి తొలి కేబినెట్లో పనిచేసిన వారిలోమెజారిటీ భాగం తీసు కుని .. మిగిలిన వారితో మరోసారి కేబినెట్ను రీషఫెల్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ఇది కూ డా ఉగాది తర్వాతే జరుగుతుందని తెలుస్తోంది. ఇక, సలహాదారుల విషయానికి వస్తే.. లెక్కకు మిక్కిలిగా ఉన్న వీరిని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారని సమాచారం. ఏదేమైనా ఏప్రిల్ తర్వాత.. అనూహ్యమైన మార్పుల దిశగా వైసీపీ అధినేత జగన్ చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
This post was last modified on February 10, 2023 6:26 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…