Political News

ఏప్రిల్ తర్వాత‌.. ఏపీలో అనూహ్య మార్పులు!?

ఏప్రిల్ టార్గెట్‌! ఆ త‌ర్వాత‌.. అనేక మార్పులు అనూహ్య మార్పులు ఖాయం! తాడేప‌ల్లి వ‌ర్గాల్లో జోరుగా జ‌రు గుతున్న చ‌ర్చ ఇదే! ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియని విధంగా ఉన్న వైసీపీ రాజ‌కీయాలు మ‌రోసారి యూట‌ర్న్‌తీసుకునేలా ఉన్నాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం విశాఖ‌ను పాల‌నారాజ‌ధాని చేయాల‌నే త‌ప‌న తో ఉన్న వైసీపీ ప్ర‌భుత్వం.. ఇప్పుడు ఈ నిర్ణ‌యాన్ని మార్చుకునే ప్ర‌య‌త్నం లేద‌ని కూడా తేల్చి చెప్పిం ది. అయితే.. ఇది సుప్రీంకోర్టు ఇచ్చే అంతిమ తీర్పుపైనే ఆధార‌ప‌డి ఉంటుంది.

వాస్త‌వానికి మార్చిలోనే విశాఖ‌కు వెళ్లిపోవాలని అనుకున్నా.. అది సాధ్యం అయ్యేలా లేదు. దీంతో క్యాంపు కార్యాల‌యాన్ని త‌ర‌లించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇది కూడా ఉగాది త‌ర్వాతే జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. ఉగాది మార్చి 22న వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ త‌ర్వాతే.. ప్ర‌భుత్వం అడుగులు వేయ‌డం ఖా యంగా క‌నిపిస్తోంది. అదే స‌య‌మంలో క్యాంపు కార్యాల‌యాన్ని కూడా ఉగాది త‌ర్వాతే త‌ర‌లించే ప్ర‌య త్నం చేస్తున్నారు.

ఇక‌, రాష్ట్ర మంత్రివ‌ర్గంపై సీఎం జ‌గ‌న్ ఒకింత అస‌హ‌నంగా ఉన్నారు. ఎవ‌రూ యాక్టివ్‌గా పని చేయ‌డం లే దనేది ఆయ‌న త‌ర‌చుగా చెబుతున్న మాట‌. దీనికి తోడు కొంద‌రు మంత్రుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు బాహా టంగానే వినిపిస్తున్నాయి. మ‌రికొంద‌రు భూముల ఆక్ర‌మ‌ణ కేసుల్లో ఉన్నారు. ఇంకొంద‌రు ప‌నిత‌ప్ప‌.. అ న్నీ చేస్తున్నారు. దీంతో మ‌రోసారి ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గా సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

దీని ప్ర‌కారం.. కొత్త ముఖాల‌ను లేపేసి.. మ‌రోసారి తొలి కేబినెట్‌లో ప‌నిచేసిన వారిలోమెజారిటీ భాగం తీసు కుని .. మిగిలిన వారితో మ‌రోసారి కేబినెట్‌ను రీష‌ఫెల్ చేయాల‌ని చూస్తున్నార‌ని అంటున్నారు. ఇది కూ డా ఉగాది త‌ర్వాతే జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఇక‌, స‌ల‌హాదారుల విష‌యానికి వ‌స్తే.. లెక్క‌కు మిక్కిలిగా ఉన్న వీరిని త‌గ్గించే ప్ర‌య‌త్నం కూడా చేస్తార‌ని స‌మాచారం. ఏదేమైనా ఏప్రిల్ త‌ర్వాత‌.. అనూహ్య‌మైన మార్పుల దిశ‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. 

This post was last modified on February 10, 2023 6:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago