Political News

ఏప్రిల్ తర్వాత‌.. ఏపీలో అనూహ్య మార్పులు!?

ఏప్రిల్ టార్గెట్‌! ఆ త‌ర్వాత‌.. అనేక మార్పులు అనూహ్య మార్పులు ఖాయం! తాడేప‌ల్లి వ‌ర్గాల్లో జోరుగా జ‌రు గుతున్న చ‌ర్చ ఇదే! ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియని విధంగా ఉన్న వైసీపీ రాజ‌కీయాలు మ‌రోసారి యూట‌ర్న్‌తీసుకునేలా ఉన్నాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం విశాఖ‌ను పాల‌నారాజ‌ధాని చేయాల‌నే త‌ప‌న తో ఉన్న వైసీపీ ప్ర‌భుత్వం.. ఇప్పుడు ఈ నిర్ణ‌యాన్ని మార్చుకునే ప్ర‌య‌త్నం లేద‌ని కూడా తేల్చి చెప్పిం ది. అయితే.. ఇది సుప్రీంకోర్టు ఇచ్చే అంతిమ తీర్పుపైనే ఆధార‌ప‌డి ఉంటుంది.

వాస్త‌వానికి మార్చిలోనే విశాఖ‌కు వెళ్లిపోవాలని అనుకున్నా.. అది సాధ్యం అయ్యేలా లేదు. దీంతో క్యాంపు కార్యాల‌యాన్ని త‌ర‌లించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇది కూడా ఉగాది త‌ర్వాతే జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. ఉగాది మార్చి 22న వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ త‌ర్వాతే.. ప్ర‌భుత్వం అడుగులు వేయ‌డం ఖా యంగా క‌నిపిస్తోంది. అదే స‌య‌మంలో క్యాంపు కార్యాల‌యాన్ని కూడా ఉగాది త‌ర్వాతే త‌ర‌లించే ప్ర‌య త్నం చేస్తున్నారు.

ఇక‌, రాష్ట్ర మంత్రివ‌ర్గంపై సీఎం జ‌గ‌న్ ఒకింత అస‌హ‌నంగా ఉన్నారు. ఎవ‌రూ యాక్టివ్‌గా పని చేయ‌డం లే దనేది ఆయ‌న త‌ర‌చుగా చెబుతున్న మాట‌. దీనికి తోడు కొంద‌రు మంత్రుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు బాహా టంగానే వినిపిస్తున్నాయి. మ‌రికొంద‌రు భూముల ఆక్ర‌మ‌ణ కేసుల్లో ఉన్నారు. ఇంకొంద‌రు ప‌నిత‌ప్ప‌.. అ న్నీ చేస్తున్నారు. దీంతో మ‌రోసారి ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గా సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

దీని ప్ర‌కారం.. కొత్త ముఖాల‌ను లేపేసి.. మ‌రోసారి తొలి కేబినెట్‌లో ప‌నిచేసిన వారిలోమెజారిటీ భాగం తీసు కుని .. మిగిలిన వారితో మ‌రోసారి కేబినెట్‌ను రీష‌ఫెల్ చేయాల‌ని చూస్తున్నార‌ని అంటున్నారు. ఇది కూ డా ఉగాది త‌ర్వాతే జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఇక‌, స‌ల‌హాదారుల విష‌యానికి వ‌స్తే.. లెక్క‌కు మిక్కిలిగా ఉన్న వీరిని త‌గ్గించే ప్ర‌య‌త్నం కూడా చేస్తార‌ని స‌మాచారం. ఏదేమైనా ఏప్రిల్ త‌ర్వాత‌.. అనూహ్య‌మైన మార్పుల దిశ‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. 

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

1 hour ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

2 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

3 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

9 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

9 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago