Political News

టీడీపీ, వైసీపీలు ‘రాజధాని’ కాన్సెప్ట్ అమ్ముకుంటున్నాయి: పవన్

ఏపీలో అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశం, శాసన మండలి రద్దు వంటి అంశాలపై చాలాకాలంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్లులకు ఏపీ శాసన సభ ఆమోదం తెలుపగా…శాసన మండలి ఆమోదం తెలపాల్సి ఉంది. తాజాగా అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లు ఆమోదం కోసం గవర్నర్ దగ్గరకు చేరింది. ఈ నేపథ్యంలో ఏపీలో అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులు, అమరావతి రైతుల ఆందోళన వంటి అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సింగపూర్ తరహాలో రాజధాని అనే కాన్సెప్ట్ ను టీడీపీ నాయకులు అమ్మారని, అదే తరహాలో ఈనాడు అధికార వికేంద్రీకరణ అంటూ 3 రాజధానుల కాన్సెప్ట్ ను వైసీపీ నేతలు అమ్ముతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజధాని విషయం 33 వేల ఎకరాలు సేకరించి టీడీపీ తప్పు చేసిందని, వేల ఎకరాలను రాజధాని కోసం ఇచ్చిన రైతుల భవిష్యత్తును, రైతులు చేస్తోన్న ఉద్యమాన్ని పట్టించుకోకుండా మూడు రాజధానులంటూ వైసీపీ మరో తప్పు చేస్తోందని అన్నారు. అధికార వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి మండలిలో ఆమోదం అవసరం లేదని వైసీపీ నేతలు చెప్పడం సరికాదని పవన్ అన్నారు. ఏపీ విభజన జరిగినపుడు బలమైన క్యాపిటల్ కావాలని ఆంధ్రులంతా అనుకున్నారని చెప్పారు. బాంబేతో విడిపోయిన తర్వాత గుజరాత్ అభివృద్ధి చెందడానికి చాలా ఏళ్లు పట్టిందని, రెండు మూడు వేల ఎకరాలలో సువిశాలమైన రాజధాని ఏపీకి సరిపోతుందని ప్రధాని మోడీ కూడా ఆనాడు చెప్పారని పవన్ గుర్తు చేసుకున్నారు.

అయితే, రైతుల నుంచి నాటి టీడీపీ ప్రభుత్వం 33 వేల ఎకరాలు సేకరించడం అనవసరమని ఆనాడే జనసేన తరఫున తాను చెప్పానని పవన్ అన్నారు. సింగపూర్ లాంటి రాజధాని కావాలంటే అలాంటి రాజకీయ విధానం ఏపీలో లేదని చెప్పారు. అన్ని వేల ఎకరాల వ్యవసాయ భూములు తీసుకుంటే ఎప్పటికైనా ఇబ్బందేనని ఆనాడే చెప్పానని…ఈనాడు అదే మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. గతంలోనూ రాజధాని కోసం సాగు భూములు అమ్ముకోవడం ఇష్టం లేదన్న రైతుల తరఫున తాను మాట్లాడానని గుర్తు చేశారు. టీడీపీతో ఆనాడు పొత్తు పెట్టుకున్నప్పటికీ..భూములు ఇవ్వడం ఇష్టం లేని రైతులకు తాను అండగా నిలబడ్డానని పవన్ అన్నారు.

ఏపీలో అభివృద్ధి అన్ని చోట్లా జరగాలని, కేవలం రాజధానులను విడగొడితేనే అభివృద్ధి జరుగుతుందనుకోవడం సరికాదని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్వేశించి పవన్ వ్యాఖ్యానించారు. రాజధాని సింగపూర్ కాన్సెప్ట్ ను టీడీపీ నాయకులు అమ్మారని..అదే తరహాలో ఈసారి అధికార వికేంద్రీకరణ అని చెప్పి 3 రాజధానుల కాన్సప్ట్ ను అమ్మడం కూడా అలాంటిదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని నమ్మి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని…పార్టీలను నమ్మి ఇవ్వలేదని అన్నారు. ఆ భూముల్లో ఇపుడు వ్యవసాయం చేసుకోలేరని, ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని కోసం భూమిని అమ్ముకున్నారని అన్నారు.

This post was last modified on July 23, 2020 8:44 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

లోకేశ్ ‘యాక్షన్ ప్లాన్’ అదిరిందా ?

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ అద్భుత ఫలితాలు రాబడుతూ సత్తా చాటుతున్నారు. పార్టీ నిర్వహణలో ఇప్పటికే ఓ…

45 minutes ago

పెళ్ళికి ముందే సంబంధాలు… అవి తెలియక పెళ్ళి చేసుకొని..

ఆధునిక సమాజంలో విచ్చలవిడితనం అంతకంతకూ పెరుగుతోంది. దంపతుల్లోని ఒకరి విచ్చలవిడితనం మరొకరిని తనువు చాలించేలా చేస్తోంది. అన్నీ ఉన్నా అల్లుడి…

1 hour ago

జెనీలియా భర్తది భలే టైమింగ్

రేపు మరాఠి కం బాలీవుడ్ మూవీ రాజా శివాజీ థియేటర్లలో అడుగు పెడుతోంది. బొమ్మరిల్లు, ఆరెంజ్ భామ జెనీలియా డిసౌజా…

2 hours ago

రెహమాన్ భయ్యానే బరువు తగ్గించాలి

పెద్ది విడుదల తేదీ డిస్కషన్లు ఎడతెగడం లేదు. జూన్ 4 పక్కా అని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు, అభిమాన సంఘాల మధ్య…

3 hours ago

సమ్మర్ సీజన్లో సత్య సత్తాకు పరీక్ష

కమెడియన్ సత్య హీరోగా రూపొందిన జెట్లీ రేపు విడుదలకు రెడీ అయిపోయింది. ప్రమోషన్ల పరంగా టీమ్ ఎంత చేయాలో అంతా…

3 hours ago

ప్యారడైజ్ పాట రాకపోతే..

ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. నేచురల్ స్టార్ నాని, యువ దర్శకుడు శ్రీకాంత్…

3 hours ago