ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కాపుల ఓట్లతోనే గెలుస్తుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 22 శాతం కాపులున్నారని 1989 నుంచి వాళ్లే నిర్ణాయక శక్తిగా కొనసాగుతున్నారని కన్నా అంటున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాపు సామాజికవర్గాన్ని వాడుకునే రాజకీయ పార్టీలు తర్వాత వారిని వదిలేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
తొమ్మిదేళ్ల క్రితం పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన మాట నిజమేనన్నారు. కాపులను తాను ప్రభావితం చేయలేనని అంటూనే జనసేనను ఎవరూ బయట నుంచి ప్రభావితం చేయకుండా చూడాలన్నారు. జనసేనను ఎలా అధికారంలోకి తీసుకురావాలో పవన్ కల్యాణ్ కు నిర్ణయం వదిలేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. కన్నా లక్ష్మీ నారాయణ, జనసేనలో చేరతారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంచరించుకున్నాయి..
కాపు రిజర్వేషన్ అమలు కాకపోవడంపై కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ కోసం చాలా మంది పోరాటాలు చేశారని, తాను కూడా కోటా ఆశిస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఓబీసి చట్ట సవరణ ఆధారంగా రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే చట్టబద్ధత ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాపుల సంక్షేమానికి వైఎస్, చంద్రబాబు కృషి చేశారని ఆయన ఒప్పుకున్నారు. చంద్రబాబు హయాంలో ఈబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. కాపులను ఇకనైనా న్యాయం చేయాలని కన్నా విజ్ఞప్తి చేస్తున్నారు…
This post was last modified on February 10, 2023 12:23 pm
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…