అధికారంలో ఉన్న వారి సేవలో తరించటం సిబ్బందికి మామూలే. కానీ.. మోతాదు మించిన రీతిలో ఉండే ఈ తీరుతో వచ్చే విమర్శలు భారీగా ఉంటాయి. తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న టూరిజం శాఖకు చెందిన ఉద్యోగులు ప్రదర్శించిన విధేయత ఆమెకు కొత్త కష్టాన్ని తీసుకొచ్చేలా చేసింది.
టూరిజం శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ను సందర్శించారు. ఆ బీచ్ రూపురేఖలు మారుస్తామని.. అక్కడ భారీఎత్తున పథకాల రూపకల్పన చేయనున్నట్లుగా చెప్పటమే కాదు.. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తానని వ్యాఖ్యానించారు. సూర్యలంక బీచ్ ను చూసినంతనే.. దాని అందానికి ముగ్దురాలైన రోజా.. చెప్పులు వదిలి సముద్రం ఒడ్డున నీళ్లలోకి వెళ్లారు.
మంత్రి రోజా చెప్పులు వదిలారో లేదో.. ఆమె చెప్పులకు ఏమవుతుందో అన్నట్లుగా టూరిజం శాఖకు చెందిన సిబ్బందిలో ఒకరు ఆమె చెప్పుల్ని పట్టుకోవటం వివాదానికి కారణమైంది. మంత్రి గారు సముద్రం ఒడ్డున ఉన్న నీటిలోకి వెళ్లి.. కాస్తంత సరదాగా కాలం గడిపి.. మళ్లీ తిరిగి వచ్చే వరకు టూరిజం శాఖకు చెందిన ఉద్యోగి చెప్పుల్నిజాగ్రత్తగా పట్టుకోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. తిరిగి వచ్చిన మంత్రివారికి.. సదరు ఉద్యోగి చెప్పులు ఇవ్వటం.. మేడం వాటిని ధరించి ఇతర కార్యక్రమాలకు హాజరు కావటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడం రోజా చెప్పులంటే మాటలా అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 10, 2023 10:31 am
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…