అధికారంలో ఉన్న వారి సేవలో తరించటం సిబ్బందికి మామూలే. కానీ.. మోతాదు మించిన రీతిలో ఉండే ఈ తీరుతో వచ్చే విమర్శలు భారీగా ఉంటాయి. తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న టూరిజం శాఖకు చెందిన ఉద్యోగులు ప్రదర్శించిన విధేయత ఆమెకు కొత్త కష్టాన్ని తీసుకొచ్చేలా చేసింది.
టూరిజం శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ను సందర్శించారు. ఆ బీచ్ రూపురేఖలు మారుస్తామని.. అక్కడ భారీఎత్తున పథకాల రూపకల్పన చేయనున్నట్లుగా చెప్పటమే కాదు.. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తానని వ్యాఖ్యానించారు. సూర్యలంక బీచ్ ను చూసినంతనే.. దాని అందానికి ముగ్దురాలైన రోజా.. చెప్పులు వదిలి సముద్రం ఒడ్డున నీళ్లలోకి వెళ్లారు.
మంత్రి రోజా చెప్పులు వదిలారో లేదో.. ఆమె చెప్పులకు ఏమవుతుందో అన్నట్లుగా టూరిజం శాఖకు చెందిన సిబ్బందిలో ఒకరు ఆమె చెప్పుల్ని పట్టుకోవటం వివాదానికి కారణమైంది. మంత్రి గారు సముద్రం ఒడ్డున ఉన్న నీటిలోకి వెళ్లి.. కాస్తంత సరదాగా కాలం గడిపి.. మళ్లీ తిరిగి వచ్చే వరకు టూరిజం శాఖకు చెందిన ఉద్యోగి చెప్పుల్నిజాగ్రత్తగా పట్టుకోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. తిరిగి వచ్చిన మంత్రివారికి.. సదరు ఉద్యోగి చెప్పులు ఇవ్వటం.. మేడం వాటిని ధరించి ఇతర కార్యక్రమాలకు హాజరు కావటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడం రోజా చెప్పులంటే మాటలా అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 10, 2023 10:31 am
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…