అధికారంలో ఉన్న వారి సేవలో తరించటం సిబ్బందికి మామూలే. కానీ.. మోతాదు మించిన రీతిలో ఉండే ఈ తీరుతో వచ్చే విమర్శలు భారీగా ఉంటాయి. తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న టూరిజం శాఖకు చెందిన ఉద్యోగులు ప్రదర్శించిన విధేయత ఆమెకు కొత్త కష్టాన్ని తీసుకొచ్చేలా చేసింది.
టూరిజం శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ను సందర్శించారు. ఆ బీచ్ రూపురేఖలు మారుస్తామని.. అక్కడ భారీఎత్తున పథకాల రూపకల్పన చేయనున్నట్లుగా చెప్పటమే కాదు.. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తానని వ్యాఖ్యానించారు. సూర్యలంక బీచ్ ను చూసినంతనే.. దాని అందానికి ముగ్దురాలైన రోజా.. చెప్పులు వదిలి సముద్రం ఒడ్డున నీళ్లలోకి వెళ్లారు.
మంత్రి రోజా చెప్పులు వదిలారో లేదో.. ఆమె చెప్పులకు ఏమవుతుందో అన్నట్లుగా టూరిజం శాఖకు చెందిన సిబ్బందిలో ఒకరు ఆమె చెప్పుల్ని పట్టుకోవటం వివాదానికి కారణమైంది. మంత్రి గారు సముద్రం ఒడ్డున ఉన్న నీటిలోకి వెళ్లి.. కాస్తంత సరదాగా కాలం గడిపి.. మళ్లీ తిరిగి వచ్చే వరకు టూరిజం శాఖకు చెందిన ఉద్యోగి చెప్పుల్నిజాగ్రత్తగా పట్టుకోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. తిరిగి వచ్చిన మంత్రివారికి.. సదరు ఉద్యోగి చెప్పులు ఇవ్వటం.. మేడం వాటిని ధరించి ఇతర కార్యక్రమాలకు హాజరు కావటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడం రోజా చెప్పులంటే మాటలా అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 10, 2023 10:31 am
కశ్మీర్ లోని పెహల్ గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోని పర్యాటకులను…
పైన హెడ్డింగ్ చదవగానే అరే మిస్సయ్యామే అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. అలాంటిదే అభిమానులు ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్,…
ఉమ్మడి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు..…
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్యపై సీఎం…
ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చినది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రమోషన్ల పరంగా ఒక అడుగు ముందుకు వేస్తోంది.…
విజయవాడ ప్రస్తుత ఎంపీ.. కేశినేని చిన్ని(శివనాథ్), మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) ఇద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములు. రాజకీయంగా వైరం లేకపోయినా..…