పదవి దక్కినా.. ఫలితం లేకుండా పోయిందట.. ప్రముఖ సినీ హాస్య నటుడు అలీకి! ఆది నుంచి కూడా వైసీపీకి మద్దతు దారుగా నిలిచిన అలీ.. అందరిలాగానే.. తాను కూడా రాజకీయంగా ఒక మెట్టు ఎదగాలని కోరుకున్నారు. అందుకే గత రెండు ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఇక, గత ఏడాది టికెట్ల వివాదం తలెత్తినప్పుడు.. ఇండస్ట్రీలో కొందరిని కంట్రోల్ చేసే బాధ్యతను ఆయన తీసుకున్నారు.
దీంతో జూనియర్ ఆర్టిస్టులు ఎవరూ కూడా నోరు విప్పకుండా.. జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆయనకు సలహాదారు పదవిని కట్టబెట్టింది. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించి రెండు మాసాలు అయిపోయింది. ఈ క్రమంలో ఆయన ఏం చేస్తారో.. ఏం చేయాలో.. తెలియదు. ఎందుకంటే.. ప్రభుత్వానికి సొంతగా ఎలక్ట్రానిక్ మీడియా అంటూ.. ఏమీలేదు. కేంద్ర ప్రభుత్వానికి దూరదర్శన్ ఉన్నట్టుగా ఏపీకి అలాంటిది లేదు.
పోనీ.. ప్రభుత్వానికి అధికారిక ట్విట్టర్కానీ, ఇతరత్రా సోషల్ మీడియా గ్రూపులు కానీ ఉన్నాయా? అంటే అవి కూడా లేవు. అయినప్పటికీ..ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీకి అవకాశం ఇచ్చి..నెలకు 3లక్షల వేతనం రెండు కార్లు.. ఇద్దరు బాడీగార్డులు, ఇద్దరు పీఏలు ఇలా.. కల్పించారు. అయితే.. ఈయన కూర్చునేందుకు మాత్రం.. ఎక్కడా చోటు చూపించలేదట! ప్రస్తుతం ఈ విషయంపైనే చర్చ సాగుతోంది.
ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాత్రం సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ సీటులో కూర్చుని.. ప్రమాణ స్వీకారం చేసేశారు. తర్వాత.. విజయ్కుమార్ కల్పించుకుని త్వరలోనే కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు అలీ ఎక్కడ కూర్చోవాలో.. ఏం చేయాలో కూడా చెప్పలేదు. కానీ, ఆయన మాత్రం సలహాదారుగానే కొనసాగుతున్నారు. మరి మున్ముందు అయినా.. ఆఫీస్, కుర్చీ వంటివి చూపిస్తారో లేదో చూడాలి.
This post was last modified on February 10, 2023 10:28 am
రామాయణ టీజర్ మీద సోషల్ మీడియాలో ఎంత నెగటివిటీ నడుస్తుందో తెలిసిందే. విజువల్స్ బాగానే ఉన్నప్పటికీ వాటి ప్రెజెంటేషన్, క్వాలిటీ…
మొన్న విడుదలైన రాకాస, బైకర్ రెండూ స్టడీగా ఉన్నాయి. అయితే వాటికొచ్చిన టాక్స్ తో పోల్చుకుంటే వసూళ్లు అంత వేగంగా…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ హాట్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా వరకు సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు గ్లామర్…
టాలీవుడ్లో అడివి శేష్ది విచిత్రమైన ప్రయాణం. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో కర్మ, కిస్ సినిమాలు తీసి బొక్క బోర్లా పడ్డ అతను..…
ఏపీలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 88 వరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవల కేంద్ర…
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి…