పదవి దక్కినా.. ఫలితం లేకుండా పోయిందట.. ప్రముఖ సినీ హాస్య నటుడు అలీకి! ఆది నుంచి కూడా వైసీపీకి మద్దతు దారుగా నిలిచిన అలీ.. అందరిలాగానే.. తాను కూడా రాజకీయంగా ఒక మెట్టు ఎదగాలని కోరుకున్నారు. అందుకే గత రెండు ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఇక, గత ఏడాది టికెట్ల వివాదం తలెత్తినప్పుడు.. ఇండస్ట్రీలో కొందరిని కంట్రోల్ చేసే బాధ్యతను ఆయన తీసుకున్నారు.
దీంతో జూనియర్ ఆర్టిస్టులు ఎవరూ కూడా నోరు విప్పకుండా.. జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆయనకు సలహాదారు పదవిని కట్టబెట్టింది. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించి రెండు మాసాలు అయిపోయింది. ఈ క్రమంలో ఆయన ఏం చేస్తారో.. ఏం చేయాలో.. తెలియదు. ఎందుకంటే.. ప్రభుత్వానికి సొంతగా ఎలక్ట్రానిక్ మీడియా అంటూ.. ఏమీలేదు. కేంద్ర ప్రభుత్వానికి దూరదర్శన్ ఉన్నట్టుగా ఏపీకి అలాంటిది లేదు.
పోనీ.. ప్రభుత్వానికి అధికారిక ట్విట్టర్కానీ, ఇతరత్రా సోషల్ మీడియా గ్రూపులు కానీ ఉన్నాయా? అంటే అవి కూడా లేవు. అయినప్పటికీ..ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీకి అవకాశం ఇచ్చి..నెలకు 3లక్షల వేతనం రెండు కార్లు.. ఇద్దరు బాడీగార్డులు, ఇద్దరు పీఏలు ఇలా.. కల్పించారు. అయితే.. ఈయన కూర్చునేందుకు మాత్రం.. ఎక్కడా చోటు చూపించలేదట! ప్రస్తుతం ఈ విషయంపైనే చర్చ సాగుతోంది.
ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాత్రం సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ సీటులో కూర్చుని.. ప్రమాణ స్వీకారం చేసేశారు. తర్వాత.. విజయ్కుమార్ కల్పించుకుని త్వరలోనే కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు అలీ ఎక్కడ కూర్చోవాలో.. ఏం చేయాలో కూడా చెప్పలేదు. కానీ, ఆయన మాత్రం సలహాదారుగానే కొనసాగుతున్నారు. మరి మున్ముందు అయినా.. ఆఫీస్, కుర్చీ వంటివి చూపిస్తారో లేదో చూడాలి.
This post was last modified on February 10, 2023 10:28 am
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…