Political News

సునీల్ కుమార్ పై చర్యలు.. రాజుగారు సంభరాలు

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి చర్యలు తీసుకుని, నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో ఒక వేదక ఏర్పాటు చేసిన సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కేంద్రం ఆదేశించింది. చర్యల నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్టు)ను తమకు సమర్పించాలని కూడా ఉత్తర్వులిచ్చింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ అనేక వివాదాస్పద చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా కూడా విపక్షాలపై కొన్ని కేసులు పెట్టినట్లు చెబుతున్నారు. పైగా ఆయన తరచూ అమెరికా వెళ్లివస్తున్నారు. క్రైస్తవ మత ప్రచారం చేస్తారన్న ఆరోపణలున్నాయి. ఇటీవలే ప్రభుత్వం ఆయన్ను బదలీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తనకు డీజీపీ పదవి ఇవ్వబోతున్నారని సునీల్ కుమార్ సంబరపడిపోయినా ఇంతవరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు సునీల్ పై చర్యలకు కేంద్రం ఆదేశించడంతో, ఆ సంగతి ముందే పసిగట్టి బదిలీ చేశారని భావించాల్సి వస్తోంది.

నిజానికి సునీల్ కుమార్ కు రఘురామకు మధ్య చాలా కాలంగా వైరం ఉంది. సీఐడీ పోలీసులు అరెస్టు చేసినప్పుడు రఘురామను సునీల్ కాళ్లు విరగ్గొట్టించారని ఎంపీ స్వయంగా చెప్పుకున్నారు. జగన్ కళ్లలో ఆనందాన్ని చూసేందుకు తనను కొట్టారని రఘురామ ఆరోపించారు. దానితో సునీల్ మాట్లాడిన వీడియోలన్నింటినీ ఆయన కేంద్రానికి పంపారు. వాటి ఆధారంగానే కేంద్రం చర్యలకు ఆదేశించినట్లు చెబుతున్నారు.

This post was last modified on February 10, 2023 7:37 am

Share
Show comments
Published by
Satya
Tags: Sunil Kumar

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago