Political News

విభ‌జ‌న చ‌ట్టం క‌న్నా.. జ‌గ‌నే ప్ర‌మాద‌కారి

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. జ‌గ‌న్‌కి రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని, సీఎం వైఖరి, ఆయన చేస్తున్న విధ్వంసాన్ని సరిచేయడం రాజ్యాంగ సంస్థలకూ కష్టంగా మారిందన్నారు. సైకో చేతిలో రాష్ట్ర రాజధాని ఉందని ధ్వజమెత్తారు. లేని అధికారాన్ని ఆపాదించుకుని రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి విరుద్ధంగా జగన్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా పేర్కొన్నా… 3రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు దుయ్య‌బ‌ట్టారు. చట్టబద్ధంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తే ప్రధాని వచ్చి శంకు స్థాపన చేశారని తెలిపారు. పార్లమెంట్ మొత్తం అమరావతికి అండగా ఉంటుందని శంకుస్థాపన రోజు ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. సైకో చేతిలో రాష్ట్ర రాజధాని పేరిట వివిధ సందర్భాల్లో అమరావతి పై జ‌గన్ చేసిన ప్రసంగాల వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు.

ఒక సైకో వల్ల రాష్ట్రం నాశనం కావటానికి వీల్లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరావతిపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని స్ప‌ష్టంగా తేలిపోయింద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప్రజా జీవితం అంటే జగన్ రెడ్డికి అంత చులకనా? అని చంద్ర‌బాబు నిల‌దీశారు.

అమరావతి నిర్మాణం ముందుకు సాగి ఉంటే పన్నుల రూపేణా రాష్ట్రమంతటికీ ఆదాయం వచ్చి ఉండేదని పేర్కొన్నారు. ప్రజా వేదికతో ప్రారంభమైన అమరావతి విధ్వంసం ఇప్పుడు రాజ‌ధాని ప్రాంతంలో ర‌హ‌దారు లు తవ్వేసేదాకా వచ్చిందని విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహాలను సైతం వదలకుండా విధ్వంసం సాగిస్తున్నారని మండిపడ్డారు. విభ‌జ‌న చ‌ట్టం క‌న్నా కూడా జ‌గ‌న్ అత్యంత ప్ర‌మాద కారి అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

This post was last modified on February 9, 2023 8:49 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సోషల్ మీడియాలో పాయల్ ఆవేదన

పరిశ్రమలో అంతర్గతంగా వేధింపుల పర్వాలు రకరకాల రూపాల్లో ఉంటాయి. కొన్ని బయటపడితే మరికొన్ని పరువు కోసం గుట్టుగా దాగుండిపోతాయి. ఆరెక్స్…

1 hour ago

వైఎస్ ఘ‌ట‌న‌ను గుర్తు చేసిన… ఇరాన్ అధ్య‌క్షుడి ప్ర‌మాదం!

2009 సెప్టెంబ‌రులో ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చనిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌తికూల వాతావర‌ణ…

2 hours ago

మ‌రో వివాదంలో టీడీపీ ఫైర్ బ్రాండ్.. దెందులూరు హాట్ హాట్‌!

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నిక‌ల అనంతరం ప‌శ్చిమ…

3 hours ago

నోరు జారిన కేటీఆర్‌.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఈసీ ఆదేశం!

తెలంగాణ ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని వారాల కింద‌ట క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం…

6 hours ago

దేశం విడిచి పారిపోతున్న మంత్రి పెద్దిరెడ్డి… ఇదిగో క్లారిటీ!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దేశం విడిచి పారిపోతున్నార‌ని.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం లేద‌ని..…

8 hours ago

మూడో భారతీయుడు షాక్ ఇస్తాడా

అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్…

14 hours ago