టీడీపీలో పెద్ద చిక్కు వచ్చి పడింది. పార్టీ అధినేత చంద్రబాబు మాటలకు.. ఆయన చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవాల్సిన నాయకులు.. ఈ పనిని వదిలేసి, తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే.. చంద్రబాబు లేదా.. ఆయన కుమారుడు మాత్రమే పదవులు అనుభవించరు. పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా లబ్ధి పొందుతారు. ఇది చాలా సింపుల్ విషయం.
మరి ఈ విషయం తెలిసి కూడా చాలా మంది నాయకులు.. తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నవారు కొందరు ఉంటే.. తెలిసి కూడా తప్పులు చేస్తున్న వారు ఇంకొందరు ఉన్నారు. దీంతో ఇలాంటి వారితోనే టీడీపీ చేటు చంద్రబాబు.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. యువగళం పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. దీనిని పార్టీ చాలా కీలకంగా భావిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి దీనిని ప్రధాన అస్త్రంగా తీసుకోనుంది. ప్రజల్లో సింపతీని సంపాయించుకుని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ప్రయత్నిస్తోంది. పార్టీలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రలో భాగం కావాలని కూడా చంద్రబాబు కోరుతున్నారు. అయితే.. దీనికి అనుకూలంగా వ్యవహరించేవారు చాలా స్వల్పంగా కనిపిస్తున్నారు. అదే సమయంలో కీలక నేతలు ఒకరిద్దరు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీస్తోంది.
రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపుతారనే నాయకులుగా ఉన్న జేసీ దివాకర్రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు యువగళాన్ని ఉద్దేశించినవేనని అంటున్నారు పరిశీలకులు. పాదయాత్రలకు కాలం చెల్లిందని.. పాదయా త్రలతో కలిసి వచ్చేది లేదని.. యాత్రల ద్వారా డబ్బులు గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో జగన్ చేసిన పాదయాత్ర కు ఆయన కితాబు నివ్వడం గమనార్హం. ఈ వ్యాఖ్యల ప్రభావం యువగళంపై పడుతుందని.. ఇలాంటివారిని చంద్రబాబు ఉపేక్షించడం సరికాదని.. చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…