ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో సర్వేలు గుబులు రేపుతున్నాయ్. పార్టీ పరంగా చేయిస్తున్న సర్వేలు.. ఎమ్మె ల్యేలకు కంటిపై కునుకు లేకుండా చేసున్నాయి. ఈ క్రమంలో ఒకవైపు.. ప్రజల నుంచి వ్యతిరేకత.. మరో వైపు.. పార్టీలో టికెట్ దక్కుతుందో లేదో.. అనే ఆవేదన ఈ రెండింటి మధ్య ఎమ్మెల్యేలు నలిగిపోతున్నార ని అనుకుంటున్నారా? అదేమీ లేదు. చాలా చక్కగా వారు చేయాల్సింది వారు చేసేస్తున్నారు.
నియోజకవర్గంలోని మండలస్థాయిల నుంచి గ్రామీణ స్థాయి వరకు.. కూడా చేతికి అందిన మేరకు ఏది దొరికితే అది.. తమపరం చేసుకుంటున్నారు. కడప నుంచి కర్నూలు వరకు.. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు.. అన్నచందంగా వైసీపీ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. అనంతపురంలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడే పుంజుకుంది. దీనిని అడ్డాగా చేసుకుని కొందరు రెచ్చిపోతున్నారని, వాటాలు పొందుతున్నారని… కమీషన్లు కూడా దండుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.
మరోవైపు.. ఎర్రమట్టి, ఇసుక, కంకర, గ్రానైట్ ఇలా.. ఏది అవసరమైతే.. దేనికి మార్కెట్లో డిమాండ్ ఉంటే .. దానిని అక్రమ పద్ధతిలో తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు ఇదే విషయంపై తన సొంత నియోజకవర్గం నుంచి గ్రానైట్ను పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని.. ఈ అక్రమాలను ఆపాలని కోరారు. ఇలా.. ఒక్క కుప్పంలోనే కాదు.. అన్ని నియోజకవర్గాల్లోనూ చేతికి అందిన కాడికి నాయకులు ఏదో ఒకటి సొంతం చేసుకుంటున్నారు.
సరే.. ఇవన్నీ ఎందుకు అంటే.. రెండు రూపాల్లో వారు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే.. పోటీ చేసేందుకు అయ్యే ఖర్చు నిమిత్తం ఈ సొమ్మును వినియోగించుకోవచ్చు. ఒకవేళ టికెట్ రాకపోతే.. అంతో ఇంతో వెనుకేసుకుని.. ఎంజాయ్ చేయొచ్చు! అనే కాన్సెప్టుతో నాయకులు చెలరేగుతున్నారని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి.. ముందు చూపు మింగుళ్లు బాగానేఉన్నాయని అంటున్నారు.
This post was last modified on February 9, 2023 3:51 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…