Political News

లోకేష్‌ను టెన్ష‌న్ పెట్టేస్తోన్న‌ రెండు విష‌యాలు..

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర 15 రోజులకు చేరిం ది. ఇప్ప‌టికీ చిత్తూరు జిల్లాలోనే ఈ యాత్ర సాగుతోంది. ఇది టీడీపీకి ఒక‌ప్పుడు బ‌ల‌మైన జిల్లా. గ‌త ఎన్ని క‌ల్లో కొంత తేడా కొట్టింది. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ పుంజుకునే ప‌రిస్థితికి వ‌చ్చింది. యాత్రకు కూడా ప్ర‌జ‌ల నుంచి జోరుగా మంచి స్పంద‌న ల‌భిస్తోంది. అయితే.. ఇప్పుడు యాత్ర‌లో ఉన్న నారా లోకేష్‌ను రెండు విష‌యాలు కుంగ‌దీస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఒక‌టి.. పార్టీలోనే జ‌రుగుతున్న యాంటీ ప్ర‌చారం. రెండు ఓటు బ్యాంకు. త‌న పాద‌యాత్ర ద్వారా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల‌ని.. నారా లోకేష్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది.. ఉభ‌య కుశ‌లోప‌రి అన్న‌ట్టుగా రేపు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు త‌నకు తాను వేసుకుంటున్న పూల బాట‌. ముఖ్యంగా పార్టీ అధ్య‌క్ష రేసులో మ‌రొక‌రు లేకుండా చేసుకునే ప్ర‌య‌త్నం. రెండు పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం ద్వారా చ‌రిత్ర‌ను సృష్టించాల్సిన అవ‌స‌రం ఉంది.

అయితే.. ప్ర‌స్తుతం చేస్తున్న పాద‌యాత్ర‌లో పాత ముఖాలే క‌నిపిస్తుండ‌డం.. కొత్తగా సీనియ‌ర్లు ఎవ‌రూ కూడా పాద‌యాత్ర కు పెద్ద‌గా స్పందించ‌క‌పోవ‌డం నారా లోకేష్‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్న విష‌యం. నిజానికి ఈ యాత్ర‌లో పెద్ద ఎత్తున సీనియ‌ర్లను కూడా భాగ‌స్వామ్యం చేయాల‌ని.. చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌చారం చేశారు. కానీ.. 15 రోజులు అయినా.. కూడా సీమ‌కు చెందిన కీల‌క నాయ‌కులు ముఖం చాటేస్తున్నారు.

మ‌రి డ‌బ్బులు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని వారు అలా చేస్తున్నారో.. లేక‌.. పాద‌యాత్ర‌ను లైట్ తీసుకుంటున్నారో.. ఇప్పుడు నారా లోకేష్‌కు అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొంది. వ‌చ్చిన వారితోనే ఆయ‌న యాత్ర ను కొన‌సాగిస్తున్నారు. ఇక‌, మ‌రో కీల‌క విష‌యం.. పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌లు వ‌స్తున్నా.. ఎన్నిక‌ల స‌మ‌యానికి వారి మూడ్‌ను ప‌సిగ‌ట్టే ప‌రిస్థితి లేకుండా పోయింది.

వ‌చ్చిన వారంతా త‌మ‌కు ఓటేస్తారా ? అనే సందేహాలు క‌లుగుతున్నాయ‌ట‌. అయితే.. దీనిపై క్లారిటీ రావాలంటే.. మ‌రో 10 నుంచి 15 రోజులు గ‌డ‌వాల్సి ఉంద‌ని భావిస్తున్నారు. అప్ప‌టికి వ్యూహం మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

This post was last modified on February 9, 2023 12:03 pm

Share

Recent Posts

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

1 minute ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

12 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

12 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

26 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

1 hour ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago