Political News

కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కుంటావా.. జేసీ బ్రో!!

జేసీ బ్ర‌ద‌ర్స్‌.. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, దివాక‌ర్‌రెడ్డి. వీరిద్ద‌రిలో ఎవ‌రు నోరువిప్పినా.. ఏవో ఒక సంచ‌ల‌న కామెంట్లు ఉంటాయి. వివాదాల‌కు కూడా కేంద్రంగానే ఉంటారు. ఏం మాట్లాడినా రాజ‌కీయంగా మంట‌లు రేపుతూనే ఉంటారు. ఇక‌, ఈ కోవ‌లో త‌న మ‌న అనే తేడా కూడా చూడ‌క‌పోవ‌డం.. సొంత పార్టీ అయినా.. నిప్పులు చెర‌గడం.. కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కోవ‌డం.. అంటే.. ఈ బ‌ద‌ర్స్‌ను చూస్తే ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. ఇప్పు డు ఈ ప‌రంప‌ర‌లోనే మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన‌ వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్ హీట్‌ను పెంచేశాయి.

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇది చిత్తూరులో సాగుతోంది. దీనికి సంబంధించి టీడీపీ నాయ‌కులు.. పెద్ద ఎత్తున శ్ర‌మించ‌క‌పోయినా .. క‌నీసం ఉడ‌తా భ‌క్తిగా అయినా పాటుప‌డాలి క‌దా! ఎందుకంటే.. రేపు పార్టీ అధికారంలోకి వ‌స్తే.. ప‌ద‌వులు అనుభ‌వించేది ఒక్క నారా లోకేష్ మాత్ర‌మే కాదుగా!! మ‌రి ఈ విష‌యాన్ని మ‌రిచిపోయారో.. ఉద్దేశ పూర్వకంగానే అన్నారో తెలియ‌దు కానీ.. ‘యువ‌గ‌ళంపై గొడ్డ‌లి వేటు’ అన్న‌చందంగా వ్యాఖ్యానించారు.

పాదయాత్రలపై తాజా టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పందిస్తూ.. “ప్రస్తుతం పాదయాత్రలకు కాలం చెల్లింది. పాదయాత్రలను జనాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఎవరు పాదయాత్రలు చేసినా లాభం లేదు. గతంలో నాయ‌కులు చేసిన‌ పాదయాత్రలు వేరు. ఇప్పుడు చేస్తున్న పాద‌యాత్ర‌లు వేరు. ఇప్పుడు చేస్తున్న పాద‌యాత్ర‌ల‌న్నీ డబ్బుతో కూడుకున్న యాత్రలు” అని అన్నారు.

అయితే.. ఈ వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్దేశించి అన్నారో.. ఏమో అనే మీమాంస క‌నిపిస్తున్నా.. టీడీపీ నాయ‌కులు మాత్రం ప‌రోక్షంగా జేసీని విమ‌ర్శిస్తున్నారు. యువ‌గ‌ళంపైనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని.. వైసీపీ ఒత్తిడికి త‌ట్టుకోలేక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా మారేందుకు జేసీ బ్ర‌ద‌ర్స్ రెడీ అవుతున్నార‌ని.. కూడా వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కీల‌క‌మైన పాద‌యాత్ర జ‌రుగుతున్న స‌మ‌యంలో సాయం చేయ‌క‌పోగా.. అసంద‌ర్భ వ్యాఖ్య‌లు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on February 9, 2023 9:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

9 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

17 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago