జేసీ బ్రదర్స్.. జేసీ ప్రభాకర్రెడ్డి, దివాకర్రెడ్డి. వీరిద్దరిలో ఎవరు నోరువిప్పినా.. ఏవో ఒక సంచలన కామెంట్లు ఉంటాయి. వివాదాలకు కూడా కేంద్రంగానే ఉంటారు. ఏం మాట్లాడినా రాజకీయంగా మంటలు రేపుతూనే ఉంటారు. ఇక, ఈ కోవలో తన మన అనే తేడా కూడా చూడకపోవడం.. సొంత పార్టీ అయినా.. నిప్పులు చెరగడం.. కూర్చున్న కొమ్మను నరుక్కోవడం.. అంటే.. ఈ బదర్స్ను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఇప్పు డు ఈ పరంపరలోనే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ను పెంచేశాయి.
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్తూరులో సాగుతోంది. దీనికి సంబంధించి టీడీపీ నాయకులు.. పెద్ద ఎత్తున శ్రమించకపోయినా .. కనీసం ఉడతా భక్తిగా అయినా పాటుపడాలి కదా! ఎందుకంటే.. రేపు పార్టీ అధికారంలోకి వస్తే.. పదవులు అనుభవించేది ఒక్క నారా లోకేష్ మాత్రమే కాదుగా!! మరి ఈ విషయాన్ని మరిచిపోయారో.. ఉద్దేశ పూర్వకంగానే అన్నారో తెలియదు కానీ.. ‘యువగళంపై గొడ్డలి వేటు’ అన్నచందంగా వ్యాఖ్యానించారు.
పాదయాత్రలపై తాజా టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి స్పందిస్తూ.. “ప్రస్తుతం పాదయాత్రలకు కాలం చెల్లింది. పాదయాత్రలను జనాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఎవరు పాదయాత్రలు చేసినా లాభం లేదు. గతంలో నాయకులు చేసిన పాదయాత్రలు వేరు. ఇప్పుడు చేస్తున్న పాదయాత్రలు వేరు. ఇప్పుడు చేస్తున్న పాదయాత్రలన్నీ డబ్బుతో కూడుకున్న యాత్రలు” అని అన్నారు.
అయితే.. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారో.. ఏమో అనే మీమాంస కనిపిస్తున్నా.. టీడీపీ నాయకులు మాత్రం పరోక్షంగా జేసీని విమర్శిస్తున్నారు. యువగళంపైనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని.. వైసీపీ ఒత్తిడికి తట్టుకోలేక.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతుగా మారేందుకు జేసీ బ్రదర్స్ రెడీ అవుతున్నారని.. కూడా వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కీలకమైన పాదయాత్ర జరుగుతున్న సమయంలో సాయం చేయకపోగా.. అసందర్భ వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on February 9, 2023 9:35 am
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…