నెల్లూరు వైసీపీలో చోటు చేసుకున్న వివాదం.. ఇప్పుడు కేంద్రం వద్దకు చేరింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. గత వారం రోజుల్లో జరిగిన పరిణామాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తన ఫోన్ను ట్యాప్ చేశారని..దీని పై విచారణ జరిపించాలని ఆయన కోరారు. తన ఫోన్ ట్యాప్ చేసిన విషయాన్ని ఇద్దరు ఐపీఎస్ అధికారులు తనకు చెప్పారని.. తాను అధికార పార్టీ నేతగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వెనుక ప్రభుత్వమే ఉందని తాను అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా కోటంరెడ్డి దీనికి జత చేశారు. నిష్ఫాక్షిక విచారణ జరిపించేలా ఆదేశించాలని కోరారు. అదే సమయంలో తనకు కొన్ని వర్గాల నుంచి ప్రమాదం పొంచి ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం తన భద్రతను కుదించిందని 2+2గా ఉన్న తన భద్రతను 1+1గా కుదించిందని.. దీనిపై వివరణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సూచించారు.
తను ఫోన్ మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితిని కల్పించారని.. కొందరు చేస్తున్న ఈ వ్యవహారంపై కేంద్రం దృష్టి పెట్టాలని సూచించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు కోటంరెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాకు లేఖలో స్పష్టం చేశారు. దీనిపై న్యాయ విచారణకు ఆదేశించినా.. తాను అన్ని విధాలా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం కోటంరెడ్డి రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇటీవల ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. ఆ వెంటనే ఆయనన నియోజకవర్గం ఇంచార్జ్గా తొలగించడం.. నెల్లూరు రూరల్ బాధ్యతలను ఆదాల ప్రభాకర్రెడ్డికి అప్పగించడం వంటివి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన నేరుగా కేంద్రం తలుపు తట్టడం వివాదాన్ని మరింత పెంచేలా కనిపిస్తోందని అంటున్నారుపరిశీలకులు.
This post was last modified on February 8, 2023 6:38 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…