Political News

వైసీపీ ఇళ్ల స్థలాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు

జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోమారు ఏపీ ప్ర‌భుత్వం తీరుపై ఘాటు వ‌ద్యాఖ్య‌లు చేశారు. అయితే ఈ ద‌ఫా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను కాకుండా ఆ పార్టీ నేత‌ల‌ను ప‌వ‌న్ టార్గెట్ చేశారు. ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న ఇళ్ల అంశాన్ని ప్ర‌స్తావిస్తూ, ఇళ్ల నిర్మాణ ప్ర‌జ‌ల సంక్షేమం కోణంలో జ‌ర‌గ‌డం లేద‌ని వైసీపీ నేత‌ల జేబులు నింపేందుకే ఈ ప్ర‌క్రియ సాగుతోంద‌ని ఆరోపించారు. త‌న ఫాంహౌస్‌లో ప‌వ‌న్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూను జ‌న‌సేన విడుద‌ల చేసింది.

గృహ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యం ఇచ్చి అన్ని రాష్ట్రాల వ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోనూ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించారని ప‌వ‌న్ తెలిపారు. ఇళ్ల‌ నిర్మాణం చేపట్ట‌డం, కొన్ని చోట్ల పూర్త‌వ‌డం జ‌రిగిన అనంత‌రం ప్రభుత్వం మారిపోవ‌డంతో వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా నిలిపేశారని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఈ విష‌యంలో ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగం అవుతోందని ప‌వన్‌ ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాగే ఇళ్లు కట్టి వదిలేశారని పేర్కొన్న ప‌వ‌న్ ప్రస్తుతం అవి శిధిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా జీ+3 గృహాల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని మండిప‌డ్డారు. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కట్టిన తర్వాత కూడా ఇళ్లు రాక లబ్దిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇటీవ‌ల తాను కర్నూలులో ప‌ర్య‌టించిన‌పుడు జీ +3 గృహ సముదాయాలు ప్రత్యక్షంగా చూశానని ప‌వ‌న్ వెల్ల‌డించారు. బాధితులతో మాట్లాడినప్పుడు వారు తమకు న్యాయం చేయాలని కోరారని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇళ్లు కట్టింది త‌మ పార్టీ కాదని, మా పార్టీకి కాకుండా మ‌రో పార్టీకి ఓటు వేశార‌ని వైసీపీ నేత‌లు పేర్కొంటూ అర్హుల‌కు ఇళ్లు ద‌క్క‌కుండా చేస్తున్న‌ర‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోపించారు.

పేద‌ల‌కు ఇళ్ల కేటాయింపు వ్యవహారంలో పాలకుల నిర్లక్ష్యంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైసీపీ నేతల సంపాదన కోసమే ఇళ్ల స్థలాల ప్లాన్ చేశార‌ని ఆరోపించిన ప‌వ‌న్ ఆ పార్టీ నేత‌లు సూచించిన వారికే ఇళ్లు ఇస్తున్నారు త‌ప్పించి అర్హుల‌కు కేటాయించ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఎవ‌రి ఓటు వేశారు అనే మాటలు కాకుండా ఖచ్చితంగా అర్హులైన లబ్దిదారులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణం సమస్యపై బీజేపీతో కలసి సమష్టిగా ముందుకు వెళ్తామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు.

This post was last modified on July 23, 2020 5:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

2 hours ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

4 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

6 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

11 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

12 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

13 hours ago