ఆయన వైసీపీ యువ ఎంపీ. తరచుగా.. సమస్యలపైనా గళం వినిపిస్తున్నారు. పైగా ఎలాంటి అవినీతి, అక్రమాల మాట కూడా ఆయనకు కిట్టదు. ఆయనే గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు. గత 2019 ఎన్నికల సమయంలో వైసీపీలోకి వచ్చిన ఆయన తొలి ప్రయత్నంలోనే విజయం దక్కించుకున్నారు. మంచి నాలెడ్జ్.. ఉన్నత విద్యావంతుడు కూడా అయిన లావుకు ప్రజల్లో మంచి పేరుంది.
అయితే.. ఎంత మంచి పేరున్నా.. వైసీపీలో ఇప్పుడు ఆయనకు టికెట్ దక్కేనా? అనే సందేహాలు ముసు రుకున్నాయి. దీనికి కారణం.. సొంత పార్టీలో నేతలతో ఉన్న విభేదాలు.. మరోవైపు అమరావతి రాజధానిని పార్టీలో ప్రతి ఒక్కరూ విభేదిస్తుండగా.. లావు మాత్రం నేరుగా అమరావతి రైతుల శిబిరాల వద్దకు వెళ్లి వారిని ప్రోత్సహించారనే వాదన పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను కొన్నాళ్లుగా పక్కన పెడుతూ వచ్చారు.
అయితే.. ఇప్పుడు రాజకీయంగా మరో వాదన కూడా తెరమీదికి వచ్చింది. ఇటీవల లావు.. టీడీపీతో టచ్లో కి వెళ్లారని.. ఆయన వ్యవహారంపై చర్చించాలని.. కొందరు ఎమ్మెల్యేలు.. లావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన ఎంపీ లావు.. తను ఎవరికీ టచ్లోకి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. అయితే.. లావు ఎన్ని చెప్పినా ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుందని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే విషయాన్ని పార్టీ పక్కన పెట్టిందా? ఇస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. నరసరావుపేట టికెట్కు వేణుగోపాల్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఎంపీ లావుకు ఎక్కడ అవకాశం కల్పిస్తారు? అనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఈ విషయంపై చాలా వ్యూహాత్మక మౌనంగా ఉండడం గమనార్హం. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 8, 2023 2:37 pm
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…