చూడు.. ఒక్కవైపే చూడు.. అన్న సినిమా డైలాగు ఏపీలో బాగానే పనిచేస్తోందని అంటున్నారు పరిశీలకు లు. ఏపీలో ఇప్పుడు ఎటు చూసినా.. ఈ డైలాగే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఏ మూల చూసినా… జగన్ జపమే. ఎటు వైపు తిరిగినా.. జగన్ నామస్మరణే వినిపిస్తోంది. ఆయన ఫోటోలే కనిపిస్తున్నాయి. దీంతో జగన్..మాత్రమే కనిపించాలి.. జగన్ పేరు మాత్రమే వినిపించాలి.. జగన్ గురించే చర్చించాలి.. అనే విధంగా పరిస్థితి మారిపోయింది.
రాజకీయాలైనా ప్రభుత్వ విభాగాలైనా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంపార్టెంటే. కానీ, అదేసమయంలో క్షేత్రస్థాయి నాయకులు.. అదేవిధంగా ఆయా ప్రభుత్వ విభాగాల హెడ్స్ కూడా ముఖ్యమే. దీంతో వారు కూడా తమకు గుర్తింపు రావాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పార్టీ కార్యాలయాల్లో అయితే.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, లేదా ఎంపీల ఫొటోలను పెట్టుకుంటారు.
ఇక, రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు అయితే.. ముఖ్యమంత్రి ఫొటోతోపాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లేదా.. డీజీపీ ఫొటోలు ఏర్పాటు చేసుకుంటారు. ఇది సహజం కూడా. ఇక, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైతే.. ప్రధాని ఫొటోలు ఉంటాయి. ఇది రివాజు కూడా. అయితే.. ఏపీలో పరిస్థితి మారిపోయింది.రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలైతే.. కేవలం సీఎం జగన్ ఫొటో తప్ప ఇంకేమీ కనిపించరాదనే ఉత్తర్వులు మౌఖికంగా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
అదేసమయంలో పార్టీ కార్యాలయాల్లోనూ.. జగన్ ఫ్రేము మాత్రమే కనిపించేలా ఏర్పాటు చేయాలని.. కూడా పార్టీ తరఫున కీలకసలహాదారు ఆదేశాలు ఇచ్చారని.. పార్టీలో చర్చ సాగుతోంది. అయితే.. పార్టీ కార్యా లయాలకు ఖర్చు పెట్టేది.. సొంత పార్టీ నేతలేనని.. వారి ఫొటో పెట్టుకుంటే తప్పులేదని ఒక వాదన తెర మీదికి వచ్చింది.
ఈనేపథ్యంలో ఇలాంటి నేతల ఫొటోలను పెట్టుకోవచ్చని.. కానీ, సీఎం జగన్ ఫొటో సైజు మాత్రం పెద్దదిగా ఉండాలని ఆదేశించారట. అంటే.. ఇక.. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా.. జగన్ మాత్రమే కనిపిస్తారన్న మాట. ఇదీ.. సంగతి!!
This post was last modified on February 8, 2023 11:28 am
సాధారణంగా మనలో ఎక్కువమంది అనుకునేది ``డబ్బుదేముంది ముందు పని కానివ్వండి. భవిష్యత్తులో డబ్బు దానంతట అదే వస్తుంది.`` అని. ఇక,…
ఫిలిం సెలబ్రెటీల్లో చాలామంది ఇండస్ట్రీలో సంపాదించే డబ్బులను భూమి మీద పెట్టుబడిగా పెడుతుంటారు. ఇలా పాత కాలంలో పెట్టుబడులు పెట్టిన…
అసెంబ్లీ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు.. తీవ్రస్థాయిలో దెబ్బతిన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు .. తాజాగా రెండు మునిసిపల్ చైర్మన్…
బెంగళూరు తర్వాత హైదరాబాద్లో బాయ్ ఫ్రెండ్స్ ను కోరుకుంటున్న ఆంటీల సంఖ్య పెరుగుతోంది. ఖర్చులతో సంబంధం లేకుండా.. తమకు అభిరుచులకు…
ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లన్నీ ఒక ఎత్తయితే, నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…