సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. పార్టీలో ఎవరినీ లెక్కచేయరు. అందరినీ కలుపుకుపోవాలనే కోరిక లేని నాయకుడు. ఆయనదీ అంతా ఒంటెత్తు పోకడే. కన్నా లక్ష్మీ నారాయణ హయాంలో పెట్టిన జిల్లా అధ్యక్షు లను మార్చేసి ఇటీవలే ఒక వివాదానికి ఆయన కేంద్ర బిందువయ్యారు. ఆయన ఏం మాట్లాడిన పెద్ద వివాదమై కూర్చుంటున్న తరుణంలో ఇప్పుడు ఓ క్రేజీ డైలాగ్ వదిలారు..
ప్రత్యేక హోదా ఇచ్చేశాం…
వీర్రాజు లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చేసింది. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబు హయాంలోనే కేంద్ర ప్రభుత్వం , ఏపీకి హోదా ఇచ్చేసిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. పైగా హోదాలో భాగంగా పార్లమెంటు సాక్షిగా 15వేల కోట్లు ఇచ్చామన్నారు. ఇంకొన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు..పైగా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని తాను చెప్పనంటున్నారు. 2014లో అధికారానికి వచ్చిన చంద్రబాబు హయాంలోనే హోదా ఇచ్చినప్పుడు ఇక అది ముగిసిన అధ్యాయమని చెప్పడం కుదరదన్నారు.
సోము వీర్రాజు వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ వారికే దిమ్మ తిరిగేవిగా ఉన్నాయి. విభజనం సమయంలో ఐదు కాదు పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని కోరిన బీజేపీ నేతలు… మోదీ వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. హోదా ఇవ్వడం మోదికి ఇష్టం లేదని తెలుసుకుని మాట మార్చారు. హోదా కంటే ఎక్కువ నిధులను ఏపీకి కేటాయించామని, అన్ని డిమాండ్లను నేరవేర్చుతున్నప్పుడు ఇక హోదా మాట ఎందుకని ప్రశ్నించారు. హోదా ఒక ముగిసిపోయిన అధ్యాయమని పలువురు బీజేపీ జాతీయ నేతలు చెబుతూనే ఉన్నారు. మరి వీర్రాజు తాజా ప్రకటనపై వారి స్పందన ఏమిటో చూడాలి….
This post was last modified on February 7, 2023 10:42 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…