సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. పార్టీలో ఎవరినీ లెక్కచేయరు. అందరినీ కలుపుకుపోవాలనే కోరిక లేని నాయకుడు. ఆయనదీ అంతా ఒంటెత్తు పోకడే. కన్నా లక్ష్మీ నారాయణ హయాంలో పెట్టిన జిల్లా అధ్యక్షు లను మార్చేసి ఇటీవలే ఒక వివాదానికి ఆయన కేంద్ర బిందువయ్యారు. ఆయన ఏం మాట్లాడిన పెద్ద వివాదమై కూర్చుంటున్న తరుణంలో ఇప్పుడు ఓ క్రేజీ డైలాగ్ వదిలారు..
ప్రత్యేక హోదా ఇచ్చేశాం…
వీర్రాజు లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చేసింది. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబు హయాంలోనే కేంద్ర ప్రభుత్వం , ఏపీకి హోదా ఇచ్చేసిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. పైగా హోదాలో భాగంగా పార్లమెంటు సాక్షిగా 15వేల కోట్లు ఇచ్చామన్నారు. ఇంకొన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు..పైగా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని తాను చెప్పనంటున్నారు. 2014లో అధికారానికి వచ్చిన చంద్రబాబు హయాంలోనే హోదా ఇచ్చినప్పుడు ఇక అది ముగిసిన అధ్యాయమని చెప్పడం కుదరదన్నారు.
సోము వీర్రాజు వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ వారికే దిమ్మ తిరిగేవిగా ఉన్నాయి. విభజనం సమయంలో ఐదు కాదు పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని కోరిన బీజేపీ నేతలు… మోదీ వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. హోదా ఇవ్వడం మోదికి ఇష్టం లేదని తెలుసుకుని మాట మార్చారు. హోదా కంటే ఎక్కువ నిధులను ఏపీకి కేటాయించామని, అన్ని డిమాండ్లను నేరవేర్చుతున్నప్పుడు ఇక హోదా మాట ఎందుకని ప్రశ్నించారు. హోదా ఒక ముగిసిపోయిన అధ్యాయమని పలువురు బీజేపీ జాతీయ నేతలు చెబుతూనే ఉన్నారు. మరి వీర్రాజు తాజా ప్రకటనపై వారి స్పందన ఏమిటో చూడాలి….
This post was last modified on February 7, 2023 10:42 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…