రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం సహజమే. అయితే.. ఇప్పుడు వృద్ధ నాయకుడు.. మాజీ ఎంపీ హరిరామజోగయ్య.. సిట్టింగ్ నేత కంటే కూడా ఎక్కువగానే రియాక్ట్ అవుతున్నారు. ఇటీవల ఆయన నిరాహార దీక్ష చేశారు. అదేసమయంలో తాజాగా .. కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటూ.. ఆయన హైకోర్టు మెట్లు ఎక్కారు. సీఎంగా పవన్ చూస్తానని ఆయన ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్కు కౌంటర్లు కూడా విసురుతున్నారు.
ఇక, మంత్రి గుడివాడ కూడా తనదైన శైలిలో రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. పవన్ను టార్గెట్ చేస్తున్న వైసీపీ మంత్రులు, నేతలపై జోగయ్య ఆగ్రహం .. ఆవేశం వెళ్లగక్కుతున్నారు. అయితే.. పవన్ ఇలా చేయొచ్చా.. అని ప్రతిగా వైసీపీ మంత్రి ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య లేఖల యుద్ధం సాగుతోంది. తాజాగా జోగయ్యను ఇరుకున పెట్టేలా.. గుడివాడ కీలక ప్రశ్న సంధించారు.
“కాపు నాయకుడు, కాపునాడు వ్యవస్థాపకుడు.. వంగవీటి మోహన్రంగాను హత్య చేయించింది.. చంద్రబాబే అని పలు సందర్భాల్లో జోగయ్య చెప్పారు. మరి ఇప్పుడు అలాంటి చంద్రబాబుతో చేతులు కలిపేందుకు ఉవ్విళ్లూరుతున్న పవన్ను మీరు ఎలా సమర్థిస్తారు ?” అని జోగయ్యకు ప్రశ్న సంధించారు. ఇది రాజకీయంగా.. జోగయ్యను ఇరుకున పెట్టే సన్నివేశం. గతంలో ఆయన అన్నమాట వాస్తవమే.. కానీ, ఇప్పుడు పవన్ వెళ్లి చంద్రబాబుతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ పరిణామంతో.. గుడివాడ లక్ష్యం.. స్పష్టంగా తెలుస్తోంది. కాపులను తమ వైపు తిప్పుకోవాలన్న జోగయ్య వ్యూహానికి ఆయన కౌంటర్ ఇచ్చినట్టేనని పరిశీలకులు అంటున్నారు. వీరిద్దరి మధ్య రగడ ఎలా ఉన్నప్పటికీ.. తాము ఎటు వైపు అడుగులు వేయాలి.. తాము ఏం చేయాలనే విషయంపై కాపులు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండా పోతోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 7, 2023 10:38 pm
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…