ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి.. ఎదుగు బొదుగు లేకుండా పోయిందనే విషయం తెలిసిందే. అధి కార పార్టీ చేస్తున్న మూడు రాజధానుల జపంతో అమరావతి ఊసు లేకుండా పోయింది. అయితే.. ఇటీవల కాలంలో అమరావతి ప్రాంతంలో మరికొన్ని దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. బ్రిడ్జిలను కూ ల్చేయడం.. వాటి కోసం ఏర్పాటు చేసిన రాళ్లను ఎత్తుకుపోవడం.. రహదారులు తవ్వేసి మట్టి ఎత్తుకు పోవ డం వంటివి.. సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి.
దీనిపై ఫిర్యాదులు వచ్చినా.. ఇక్కడి రైతులు గగ్గోలు పెడుతున్నా.. పట్టించుకునే నాథుడు కనిపించకపోవ డం గమనార్హం. తాజాగా లింగరాయపాలెం సమీపంలో సీఆర్డీయే కార్యాలయం భవనం ముందున్న రోడ్డును దుండగులు తవ్వుకు పోయారు. దీనిని నమ్మాలంటే.. ఒకింత కష్టమే. కానీ, నిజం. రోడ్డును తవ్వేసి మట్టిని.. రాళ్లను కూడా ఎత్తుకు వెళ్లారు. మెటల్ను లారీలతో తరలించుకుపోతున్నా.. సీఆర్డీయే అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.
రోడ్డు నిర్మాణం కోసం వేసిన రోడ్పై పరచిన మెటల్ను రాత్రికి రాత్రే దుండగులు దొంగిలించుకుపోయారు. రాజధానిలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు దొంగతనాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు కోరుతున్నారు. పగలు, రాత్రి తేడాలేకుండా గడ్డం గ్యాంగ్ యథేచ్ఛగా మట్టిని దోచేస్తున్నా రెవెన్యూ అధికారులకు కనిపించడం లేదు. మట్టిని బహిరంగంగానే తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండా మట్టిని తరలిస్తున్నా మైనింగ్ శాఖ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇదే ఇప్పుడు అమరావతికి పెనుశాపంగా మారింది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…