Political News

క‌ల‌ల రాజ‌ధాని ఇలా అయిపోతోందేంటి?

ఏపీ ప్ర‌జ‌ల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి.. ఎదుగు బొదుగు లేకుండా పోయింద‌నే విష‌యం తెలిసిందే. అధి కార పార్టీ చేస్తున్న మూడు రాజ‌ధానుల జ‌పంతో అమ‌రావ‌తి ఊసు లేకుండా పోయింది. అయితే.. ఇటీవల కాలంలో అమ‌రావ‌తి ప్రాంతంలో మ‌రికొన్ని దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. బ్రిడ్జిల‌ను కూ ల్చేయ‌డం.. వాటి కోసం ఏర్పాటు చేసిన రాళ్ల‌ను ఎత్తుకుపోవ‌డం.. ర‌హ‌దారులు త‌వ్వేసి మ‌ట్టి ఎత్తుకు పోవ డం వంటివి.. స‌ర్వ‌సాధార‌ణంగా క‌నిపిస్తున్నాయి.

దీనిపై ఫిర్యాదులు వ‌చ్చినా.. ఇక్క‌డి రైతులు గ‌గ్గోలు పెడుతున్నా.. ప‌ట్టించుకునే నాథుడు క‌నిపించ‌క‌పోవ డం గ‌మ‌నార్హం. తాజాగా లింగరాయపాలెం సమీపంలో సీఆర్డీయే కార్యాలయం భవనం ముందున్న రోడ్డును దుండగులు తవ్వుకు పోయారు. దీనిని న‌మ్మాలంటే.. ఒకింత క‌ష్ట‌మే. కానీ, నిజం. రోడ్డును త‌వ్వేసి మ‌ట్టిని.. రాళ్ల‌ను కూడా ఎత్తుకు వెళ్లారు. మెటల్‌ను లారీలతో తరలించుకుపోతున్నా.. సీఆర్డీయే అధికారులు, పోలీసులు పట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రోడ్డు నిర్మాణం కోసం వేసిన రోడ్‌పై పరచిన మెటల్‌ను రాత్రికి రాత్రే దుండగులు దొంగిలించుకుపోయారు. రాజధానిలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు దొంగతనాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు కోరుతున్నారు. పగలు, రాత్రి తేడాలేకుండా గడ్డం గ్యాంగ్‌ యథేచ్ఛగా మట్టిని దోచేస్తున్నా రెవెన్యూ అధికారులకు కనిపించడం లేదు. మట్టిని బహిరంగంగానే తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండా మట్టిని తరలిస్తున్నా మైనింగ్‌ శాఖ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇదే ఇప్పుడు అమ‌రావ‌తికి పెనుశాపంగా మారింది.

This post was last modified on February 7, 2023 4:51 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

50 minutes ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

1 hour ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

5 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

5 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

6 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

6 hours ago