Political News

ఎవరు ఆ ఛానల్ ప్రతినిధి? ఆసక్తికరంగా మారిన చర్చ

ప్రశ్నించటం పాత్రికేయుడు చేయాల్సిన పని. కానీ.. ఇప్పుడున్న వ్యవస్థలు.. వాటిని నడిపించే పెద్ద మనుషుల పుణ్యమా అని.. పాత్రికేయానికి కొత్త అర్థాలు చెప్పటమే కాదు.. వారికున్న హక్కుల్ని.. ప్రశ్నించే తత్త్వాన్ని తమకున్న అధికారంతో అడ్డుకుంటున్నారు.

గడిచిన పదిహేనేళ్లలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారైనా సరే.. తమను కించిత్ మాట అన్నా ప్రశ్నించేవారు. తప్పు లేకుండా తమకు ఉద్దేశాలు ఆపాదిస్తే రిపోర్టర్లు ఊరుకునే వారు కాదు. తమ అభ్యంతరాల్ని బలంగా తెలిపేవారు.

ఇలాంటి పరిస్థితి నుంచి ప్రెస్ మీట్ పెట్టేసి మరీ కడిగేస్తున్న ముఖ్యమంత్రులు.. అందుకు మౌనంగా తలాడిస్తూ పని చేస్తున్న వైనంతో తమకున్న ప్రత్యేక హక్కుల్ని మర్చిపోయిన పాత్రికేయ తరం ఇప్పుడు ఉంది.

మిగిలిన రంగాల మాదిరి కాకుండా సమాజం కోసం ప్రజల కోసం అనుక్షణం తపించే అవకాశం ఉన్నా.. మీడియా యాజమాన్యాల తీరుతో పాత్రికేయులు ఎవరికి వారు తమ పరిధిని కుంచించుకోవటం ఎక్కువైంది. దీంతో.. పాలకులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవటం ఎక్కువైంది.

ఇలాంటి వేళలో తాజాగా ఒక చానల్ ప్రతినిధి హైకోర్టును ఆశ్రయించారు. సచివాలయాన్ని కూల్చివేతకు సంబంధించి మీడియా కవరేజ్ ను అడ్డుకుంటున్న అధికారుల తీరును ప్రశ్నించారు. జరుగుతున్న విషయాల్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను అడ్డుకుంటున్న సర్కారు తీరు సరికాదంటూ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. యుద్ధ భూమిలోనూ రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లే మీడియా ప్రతినిధుల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? అనుమతులు ఎందుకు ఇవ్వటం లేదు? అన్న ప్రశ్నల్ని సంధించారు.

దీనికి మీడియా ప్రతినిధుల రక్షణ కోసమేనని చెప్పిన ప్రభుత్వ న్యాయవాది మాటలకు న్యాయమూర్తులు సరైన రీతిలో ప్రశ్నలు వేశారు. కూల్చివేత పనులు ఆగిన సమయంలో మీడియాను అనుమతిస్తే సరిపోతుంది కదా? అన్న ప్రశ్నకు ఏజీ దగ్గర సమాధానం లేని పరిస్థితి. మొత్తంగా మీడియాకున్న ప్రత్యేక హక్కుల్ని.. అధికారాల్ని అందరికి అర్థమయ్యేలా చేసిన ఆ టీవీ చానల్ ప్రతినిధి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ‘‘ఎస్ సార్’’ అనేయటం అలవాటుగా మారిన వేళ.. అందుకు భిన్నంగా ఎందుకిలా చేస్తున్నారు? అని ప్రశ్నించాలన్న విషయాన్ని మర్చిపోతున్నారన్న విషయాన్ని గుర్తు చేసేలా చేసిన చానల్ ప్రతినిధి ఎవరన్న దానిపై మీడియా వర్గాల్లో ఎంక్వయిరీలు నడుస్తున్నాయి. త్వరలోనే ఆ వివరాలు బయటకు వస్తాయని చెబుతున్నారు.

This post was last modified on July 24, 2020 8:02 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

6 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

7 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

8 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

9 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

9 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

10 hours ago