Political News

లోకేష్‌ ‘గ‌ళం’ ఇంకా పెంచాలి

ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు.. టీడీపీ పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు.. వంటివి సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్రారంభించి 10 రోజులు గ‌డిచాయి. మొత్తం 120 కిలో మీట‌ర్లు ఆయ‌న పూర్తి చేసుకున్నారు. అనేక మందిని క‌లుసుకున్నారు. వారికి హామీలు కూడా ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఈ ప‌ది రోజుల వ్య‌వ‌హారం పై స‌హ‌జంగానే విశ్లేష‌ణ‌లు వ‌స్తాయి.

దీనిని ప‌రిశీలిస్తే.. మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. యువ‌గళం పాద‌యాత్రేన‌ని అన్నారు. ఇంత‌కు మించి ఆయ‌న ఎలాంటి వివ‌ర‌ణా ఇవ్వ‌లేదు. దీనికి కార‌ణం.. ఆయన ఉద్దేశంలో ఈ పాద‌యాత్ర ద్వారా ఓట్లు కుమ్మ‌రించే వ్యూహాన్ని నారా లోకేష్ అనుస‌రించ‌డం లేద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఈ సంద‌ర్భంగానే గ‌తంలో వైఎస్‌ను, త‌ర్వాత‌.. జ‌గ‌న్‌ను న‌మ్మిన‌ట్టుగా ఇప్పుడు ప‌రిస్థితి లేదన్నారు.

అదే స‌మ‌యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌తోనే పాద‌యాత్ర‌ల ఎఫెక్ట్ అయిపోయింద‌ని కూడా ఉండ‌వ‌ల్లి తేల్చి చెప్పారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌జ‌లు పాద‌యాత్ర‌ను చూసి ఓట్లు వేస్తార‌ని తాను అనుకోవ‌డం లేద‌ని కూడా అన్నారు. ఇదిలావుంటే.. జాతీయ మీడియా ఒక‌టి ప్రాంతీయ ప‌త్రిక‌లో రాసిన వ్యాసంలోనూ.. నారా లోకేష్ పాద‌యాత్రకు జ‌నం వ‌స్తున్నార‌ని.. కానీ, వీరిని ఓట్లుగా మ‌లుచుకునేందుకు ఆయ‌న త‌డ‌బ‌డుతున్నార‌ని చెప్పుకొచ్చారు.

కేవ‌లం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం కాదు… లోతైన స‌మాచారం సేక‌రించే వెసులుబాటు.. ప్ర‌జ‌లు త‌న‌ను విశ్వ‌సించేలా వ్యాఖ్య‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. మ‌రో జాతీయ ప‌త్రిక కూడా అభిప్రాయ ప‌డింది. ఇక‌, ప్రాంతీయ ప‌త్రిక‌ల విష‌యానికి వ‌స్తే.. టీడీపీ అనుకూల ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌ది రోజులు పూర్త‌య్యాక కూడా ఇప్ప‌టి వ‌ర‌కు విశ్లేష‌ణ‌లు రాలేదు. ఇది ఒక వెలితేన‌ని టీడీపీ నేత‌లు అభిప్రాయ‌ ప‌డుతున్నారు. మొత్తానికి చూస్తే.. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌గా మాత్ర‌మే మిగిలిపోతుందా? లేక ఓట్లు తెచ్చే సాధ‌నంగా మారుతుందా? అనేది చూడాలి.

This post was last modified on February 7, 2023 7:45 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

35 minutes ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

50 minutes ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

1 hour ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

1 hour ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

4 hours ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

4 hours ago