ఇటీవల జరుగుతున్న పరిణామాలు.. టీడీపీ పై వస్తున్న విమర్శలు.. వంటివి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. యువగళం పాదయాత్ర ప్రారంభించి 10 రోజులు గడిచాయి. మొత్తం 120 కిలో మీటర్లు ఆయన పూర్తి చేసుకున్నారు. అనేక మందిని కలుసుకున్నారు. వారికి హామీలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఈ పది రోజుల వ్యవహారం పై సహజంగానే విశ్లేషణలు వస్తాయి.
దీనిని పరిశీలిస్తే.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తనదైన శైలిలో వ్యాఖ్యలు గుప్పించారు. యువగళం పాదయాత్రేనని అన్నారు. ఇంతకు మించి ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు. దీనికి కారణం.. ఆయన ఉద్దేశంలో ఈ పాదయాత్ర ద్వారా ఓట్లు కుమ్మరించే వ్యూహాన్ని నారా లోకేష్ అనుసరించడం లేదని చెప్పకనే చెప్పారు. ఈ సందర్భంగానే గతంలో వైఎస్ను, తర్వాత.. జగన్ను నమ్మినట్టుగా ఇప్పుడు పరిస్థితి లేదన్నారు.
అదే సమయంలో జగన్ పాదయాత్రతోనే పాదయాత్రల ఎఫెక్ట్ అయిపోయిందని కూడా ఉండవల్లి తేల్చి చెప్పారు. ఇక, ఇప్పుడు ప్రజలు పాదయాత్రను చూసి ఓట్లు వేస్తారని తాను అనుకోవడం లేదని కూడా అన్నారు. ఇదిలావుంటే.. జాతీయ మీడియా ఒకటి ప్రాంతీయ పత్రికలో రాసిన వ్యాసంలోనూ.. నారా లోకేష్ పాదయాత్రకు జనం వస్తున్నారని.. కానీ, వీరిని ఓట్లుగా మలుచుకునేందుకు ఆయన తడబడుతున్నారని చెప్పుకొచ్చారు.
కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదు… లోతైన సమాచారం సేకరించే వెసులుబాటు.. ప్రజలు తనను విశ్వసించేలా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందని.. మరో జాతీయ పత్రిక కూడా అభిప్రాయ పడింది. ఇక, ప్రాంతీయ పత్రికల విషయానికి వస్తే.. టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
పది రోజులు పూర్తయ్యాక కూడా ఇప్పటి వరకు విశ్లేషణలు రాలేదు. ఇది ఒక వెలితేనని టీడీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి చూస్తే.. యువగళం పాదయాత్రగా మాత్రమే మిగిలిపోతుందా? లేక ఓట్లు తెచ్చే సాధనంగా మారుతుందా? అనేది చూడాలి.
This post was last modified on February 7, 2023 7:45 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…