Political News

లోకేష్‌ ‘గ‌ళం’ ఇంకా పెంచాలి

ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు.. టీడీపీ పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు.. వంటివి సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్రారంభించి 10 రోజులు గ‌డిచాయి. మొత్తం 120 కిలో మీట‌ర్లు ఆయ‌న పూర్తి చేసుకున్నారు. అనేక మందిని క‌లుసుకున్నారు. వారికి హామీలు కూడా ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఈ ప‌ది రోజుల వ్య‌వ‌హారం పై స‌హ‌జంగానే విశ్లేష‌ణ‌లు వ‌స్తాయి.

దీనిని ప‌రిశీలిస్తే.. మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. యువ‌గళం పాద‌యాత్రేన‌ని అన్నారు. ఇంత‌కు మించి ఆయ‌న ఎలాంటి వివ‌ర‌ణా ఇవ్వ‌లేదు. దీనికి కార‌ణం.. ఆయన ఉద్దేశంలో ఈ పాద‌యాత్ర ద్వారా ఓట్లు కుమ్మ‌రించే వ్యూహాన్ని నారా లోకేష్ అనుస‌రించ‌డం లేద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఈ సంద‌ర్భంగానే గ‌తంలో వైఎస్‌ను, త‌ర్వాత‌.. జ‌గ‌న్‌ను న‌మ్మిన‌ట్టుగా ఇప్పుడు ప‌రిస్థితి లేదన్నారు.

అదే స‌మ‌యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌తోనే పాద‌యాత్ర‌ల ఎఫెక్ట్ అయిపోయింద‌ని కూడా ఉండ‌వ‌ల్లి తేల్చి చెప్పారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌జ‌లు పాద‌యాత్ర‌ను చూసి ఓట్లు వేస్తార‌ని తాను అనుకోవ‌డం లేద‌ని కూడా అన్నారు. ఇదిలావుంటే.. జాతీయ మీడియా ఒక‌టి ప్రాంతీయ ప‌త్రిక‌లో రాసిన వ్యాసంలోనూ.. నారా లోకేష్ పాద‌యాత్రకు జ‌నం వ‌స్తున్నార‌ని.. కానీ, వీరిని ఓట్లుగా మ‌లుచుకునేందుకు ఆయ‌న త‌డ‌బ‌డుతున్నార‌ని చెప్పుకొచ్చారు.

కేవ‌లం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం కాదు… లోతైన స‌మాచారం సేక‌రించే వెసులుబాటు.. ప్ర‌జ‌లు త‌న‌ను విశ్వ‌సించేలా వ్యాఖ్య‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. మ‌రో జాతీయ ప‌త్రిక కూడా అభిప్రాయ ప‌డింది. ఇక‌, ప్రాంతీయ ప‌త్రిక‌ల విష‌యానికి వ‌స్తే.. టీడీపీ అనుకూల ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌ది రోజులు పూర్త‌య్యాక కూడా ఇప్ప‌టి వ‌ర‌కు విశ్లేష‌ణ‌లు రాలేదు. ఇది ఒక వెలితేన‌ని టీడీపీ నేత‌లు అభిప్రాయ‌ ప‌డుతున్నారు. మొత్తానికి చూస్తే.. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌గా మాత్ర‌మే మిగిలిపోతుందా? లేక ఓట్లు తెచ్చే సాధ‌నంగా మారుతుందా? అనేది చూడాలి.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

3 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

3 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

4 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

5 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

5 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

5 hours ago