Political News

లోకేష్‌ ‘గ‌ళం’ ఇంకా పెంచాలి

ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు.. టీడీపీ పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు.. వంటివి సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్రారంభించి 10 రోజులు గ‌డిచాయి. మొత్తం 120 కిలో మీట‌ర్లు ఆయ‌న పూర్తి చేసుకున్నారు. అనేక మందిని క‌లుసుకున్నారు. వారికి హామీలు కూడా ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఈ ప‌ది రోజుల వ్య‌వ‌హారం పై స‌హ‌జంగానే విశ్లేష‌ణ‌లు వ‌స్తాయి.

దీనిని ప‌రిశీలిస్తే.. మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. యువ‌గళం పాద‌యాత్రేన‌ని అన్నారు. ఇంత‌కు మించి ఆయ‌న ఎలాంటి వివ‌ర‌ణా ఇవ్వ‌లేదు. దీనికి కార‌ణం.. ఆయన ఉద్దేశంలో ఈ పాద‌యాత్ర ద్వారా ఓట్లు కుమ్మ‌రించే వ్యూహాన్ని నారా లోకేష్ అనుస‌రించ‌డం లేద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఈ సంద‌ర్భంగానే గ‌తంలో వైఎస్‌ను, త‌ర్వాత‌.. జ‌గ‌న్‌ను న‌మ్మిన‌ట్టుగా ఇప్పుడు ప‌రిస్థితి లేదన్నారు.

అదే స‌మ‌యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌తోనే పాద‌యాత్ర‌ల ఎఫెక్ట్ అయిపోయింద‌ని కూడా ఉండ‌వ‌ల్లి తేల్చి చెప్పారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌జ‌లు పాద‌యాత్ర‌ను చూసి ఓట్లు వేస్తార‌ని తాను అనుకోవ‌డం లేద‌ని కూడా అన్నారు. ఇదిలావుంటే.. జాతీయ మీడియా ఒక‌టి ప్రాంతీయ ప‌త్రిక‌లో రాసిన వ్యాసంలోనూ.. నారా లోకేష్ పాద‌యాత్రకు జ‌నం వ‌స్తున్నార‌ని.. కానీ, వీరిని ఓట్లుగా మ‌లుచుకునేందుకు ఆయ‌న త‌డ‌బ‌డుతున్నార‌ని చెప్పుకొచ్చారు.

కేవ‌లం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం కాదు… లోతైన స‌మాచారం సేక‌రించే వెసులుబాటు.. ప్ర‌జ‌లు త‌న‌ను విశ్వ‌సించేలా వ్యాఖ్య‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. మ‌రో జాతీయ ప‌త్రిక కూడా అభిప్రాయ ప‌డింది. ఇక‌, ప్రాంతీయ ప‌త్రిక‌ల విష‌యానికి వ‌స్తే.. టీడీపీ అనుకూల ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌ది రోజులు పూర్త‌య్యాక కూడా ఇప్ప‌టి వ‌ర‌కు విశ్లేష‌ణ‌లు రాలేదు. ఇది ఒక వెలితేన‌ని టీడీపీ నేత‌లు అభిప్రాయ‌ ప‌డుతున్నారు. మొత్తానికి చూస్తే.. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌గా మాత్ర‌మే మిగిలిపోతుందా? లేక ఓట్లు తెచ్చే సాధ‌నంగా మారుతుందా? అనేది చూడాలి.

This post was last modified on February 7, 2023 7:45 am

Share

Recent Posts

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

27 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

4 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

6 hours ago