కాపులకు రిజర్వేషన్ కల్పించే అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం సమయం ఉండటంతో ఇప్పుడది ఎన్నికల అంశంగా మారుతోంది. మాజీ మంత్రి, కాపు నాయకుడు హరిరామ జోగయ్య ఏపీ హైకోర్టులో ఈ మేరకు ఒక రిట్ పిటిషన్ వేశారు. కాపు సంక్షేమ సేన పేరుతో ఈ పిటిషన్ దాఖలైంది.
ఏపీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు హయాంలో చట్టాలు చేశారు. జగన్ అధికారానికి రాగానే ఆ చట్టాలను రద్దు చేశారు. రెండు జీవోలతో ఆ రిజర్వేషన్ మొత్తాన్ని జగన్ సర్కారు నిలుపుదల చేసింది. దీనితో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయిన కాపు వర్గాలు తీవ్ర ఆందోళన, ఆవేదనకు లోనయ్యారు. కాపు, బలిజ, తెలగ వర్గాలు మళ్లీ వెనుకబాటు తనంలోకి వెళ్లిపోతాయన్న భయం వారిలో నెలకొంది.
జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల హరిరామ జోగయ్యను కలిశారు. అప్పుడు కాపు రిజర్వేషన్ అంశం, జగన్ చేసిన ద్రోహం చర్చకు వచ్చింది. కేవలం కక్షసాధింపుతో జగన్, కాపు రిజర్వేషన్ను ఆపేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయ స్థానం ద్వారా రిజర్వేషన్ను సాధించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి చర్చల ఆధారంగానే కాపు వర్గాలు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాయి. ఒకటి రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నిజానికి కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గాల్లో చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారు. వారికి తిండి కూడా దొరకడం లేదు. ఆ సంగతిని కోర్టులో నిరూపించగలిగితే, సరైనా గణాంకాలు సమర్థించగలిగితే అనుకూల తీర్పు వస్తుందని ఎదురుచూస్తున్నారు.
This post was last modified on February 7, 2023 7:41 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…