కాపులకు రిజర్వేషన్ కల్పించే అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం సమయం ఉండటంతో ఇప్పుడది ఎన్నికల అంశంగా మారుతోంది. మాజీ మంత్రి, కాపు నాయకుడు హరిరామ జోగయ్య ఏపీ హైకోర్టులో ఈ మేరకు ఒక రిట్ పిటిషన్ వేశారు. కాపు సంక్షేమ సేన పేరుతో ఈ పిటిషన్ దాఖలైంది.
ఏపీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు హయాంలో చట్టాలు చేశారు. జగన్ అధికారానికి రాగానే ఆ చట్టాలను రద్దు చేశారు. రెండు జీవోలతో ఆ రిజర్వేషన్ మొత్తాన్ని జగన్ సర్కారు నిలుపుదల చేసింది. దీనితో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయిన కాపు వర్గాలు తీవ్ర ఆందోళన, ఆవేదనకు లోనయ్యారు. కాపు, బలిజ, తెలగ వర్గాలు మళ్లీ వెనుకబాటు తనంలోకి వెళ్లిపోతాయన్న భయం వారిలో నెలకొంది.
జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల హరిరామ జోగయ్యను కలిశారు. అప్పుడు కాపు రిజర్వేషన్ అంశం, జగన్ చేసిన ద్రోహం చర్చకు వచ్చింది. కేవలం కక్షసాధింపుతో జగన్, కాపు రిజర్వేషన్ను ఆపేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయ స్థానం ద్వారా రిజర్వేషన్ను సాధించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి చర్చల ఆధారంగానే కాపు వర్గాలు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాయి. ఒకటి రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నిజానికి కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గాల్లో చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారు. వారికి తిండి కూడా దొరకడం లేదు. ఆ సంగతిని కోర్టులో నిరూపించగలిగితే, సరైనా గణాంకాలు సమర్థించగలిగితే అనుకూల తీర్పు వస్తుందని ఎదురుచూస్తున్నారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…