Political News

ఎన్నిక‌ల టైంకి పార్టీ ఏంటో చెబుతా: జేడీ

మాజీ ఐపీఎస్ అధికారి, గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ ప‌ట్నం ఎంపీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ తాజాగా మ‌రోసారి హాట్ కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఒక పార్టీలోకి చేర‌నున్న‌ట్టు చెప్పారు. అయితే.. అది త‌న మ‌న‌సుకు న‌చ్చిన పార్టీ అయి ఉండాల‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌కు ముందే ఆ విష‌యాన్ని చెబుతాన‌న్నారు.

వాస్త‌వానికి ఇటీవ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ తాను ఒంట‌రిగానే పోటీ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. విశాఖ ఎంపీగా తాను, ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా త‌న కుమార్తె రంగంలోకి దిగ‌నున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఇంత‌లోనే ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్న‌ట్టు కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా స్పందించిన ల‌క్ష్మీనారాయ‌ణ వ‌చ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌నున్న‌ట్టు చెప్పారు.

“నేను విశాఖ నుండి పోటీకి దిగుతున్నాను. మీడియావారు రోజుకో పార్టీలో నన్ను చేర్చుతున్నారు. బీఆర్ఎస్ నుండి పోటీ అనే ప్రచారం కేవలం ప్రచారం మాత్రమే. ఎన్నికల సమయానికి నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుండి పోటీ చేస్తాను. విశాఖ రాజధాని మార్పు అనేది సుప్రీం కోర్ట్ లో ఉంది. కోర్ట్ లో ఉన్నప్పుడు ఇష్టానుసార ప్రకటనలు చెల్లవు. అలా చేస్తే కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది.” అని స్ప‌ష్టం చేశారు.

కాగా, ఏపీలో పొలిటిక‌ల్ హీట్ పెంచిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడుతూ.. బాధితుడి ఆరోపణలపై న్యాయస్థానాలను, మానవహక్కులను, పోలీసులను ఆశ్రయించవచ్చున‌న్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్టబద్దత ఉంద‌న్నారు. అయితే, నిరాధార ఆరోపణలు పని చేయవని స్ప‌ష్టం చేశారు. దేశమంతటా రైతులకు ప్రాధాన్యత ఉందని, రాష్ట్రాలు కూడా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని జేడీ సూచించారు.

This post was last modified on February 6, 2023 12:03 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

3 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

4 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

5 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

5 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

6 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

7 hours ago