మంత్రి పదవి ఉన్నా, పోయినా బాధను దిగమింగుకుంటూనే జగనన్న కోసం ఎక్కడ ఎవరి ఆరోపణలు తిప్పికొట్టడానికైనా మీడియా సమావేశం పెట్టి మాటల గారడీ చేసే ఏకైక వైసీపీ నేత పేర్ని నాని. తెలివిగా మాట్లాడడంలో, పార్టీని, జగన్ను డిఫెన్స్ చేయడంలో ఈయన ఆరితేరిపోయారు.
మూడేళ్లకు మంత్రి పదవి పోయినా కూడా ఆ బాధ దిగమింగుకుంటూనే జగన్ కోసం నిత్యం మీడియా ముందుకొస్తుంటారు. అయితే, జగన్ను ఎంతగా వెనకేసుకొస్తున్నా కూడా జగన్ మాత్రం ఆయన్ను వెనకేసుకురావడం లేదట. నియోజకవర్గంలో నిత్యం ఆయనకు తలనొప్పి కలిగించే సొంత పార్టీకే చెందిన నేతను జగన్ బాగా వెనకేసుకొస్తుంటారట.
మచిలీపట్నంలో ఎమ్మెల్యే పేర్ని నానికి, ఎంపీ వల్లభనేని బాలశౌరికి మొదటి నుంచి సయోధ్య లేదు. నియోజకవర్గంలో ఇద్దరు రెండు వర్గాలను నడిపిస్తుంటారు. బాలశౌరి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు పేర్ని నాని ఎంతగా ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోతున్నారట. అందుకు కారణం జగన్ నుంచి ఆయనకు ఫుల్ సపోర్టు ఉండడమేనంటున్నారు పార్టీ నాయకులు.
నిజానికి పేర్ని నాని తరహాలో బాలశౌరి ఎప్పుడూ మీడియా ముందుకు రారు. పార్టీ తరఫున మాట్లాడరు. నానితో పోల్చుకుంటూ అస్సలు యాక్టివ్గా కనిపించరు. కానీ, అధిష్ఠానానికి మాత్రం ఎప్పుడూ దగ్గరగా ఉంటారు.
అంతేకాదు.. బాలశౌరికి ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలు కూడా కలిసివస్తున్నాయని.. ఆ పరిచయాల అవసరాలు జగన్కు ఉన్నాయని వైసీపీ నాయకులు చెప్తుంటారు. జగన్ ఢిల్లీ పర్యటనల్లోనూ అనేకసార్లు బాలశౌరిని వెంట తీసుకెళ్లడం కనిపిస్తుంది.
జగన్, బాలశౌరి వ్యాపార భాగస్వాములన్న మాట కూడా వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే జగన్ ఆయనకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తుంటారని చెప్తుంటారు. ఈ కారణంగానే బాలశౌరి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పైచేయి సాదిస్తున్నారన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on February 6, 2023 10:23 am
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…