దేశమంతా తెలంగాణ మోడల్ను అమలు చేయాలనే సంకల్పం, కుదిరితే కేంద్రంలో పాగా వేయాలనే కీలక లక్ష్యంతో ఆవిర్భవించిన భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. తన తొలి రాష్ట్రేతర సభను మహారాష్ట్రలోని నాందేడ్లో నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనే సభ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. నాందేడ్లో కేసీఆర్ కటౌట్లు, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెద్దఎత్తున వెలిశాయి.
మహారాష్ట్ర సరిహద్దు, తెలంగాణ సమీప గ్రామాల నుంచిపెద్ద ఎత్తున ప్రజల్ని సభకు తరలించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పలువురు మరాఠా నాయకులు గులాబీ కండువా కప్పుకోనున్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారిన తర్వాత రాష్ట్రం వెలుపల నిర్వహిస్తున్న తొలిసభను విజయవంతం చేసేందుకు నాయకులు, పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాందేడ్ సభ మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారబోతుందని కేసీఆర్ అన్నారు.
పలువురు మరాఠా నాయకులు.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. నాందేడ్ గురుద్వార్ మైదానంలో సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహారాష్ట్రలోని తెలుగువారు, మైనార్టీ ప్రజలున్న ప్రాంతాల్లో, మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్లో చేరనున్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు జడ్పీ ఛైర్పర్సన్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లతోపాటు పదుల సంఖ్యలో కౌన్సిలర్లు, సర్పంచులు పార్టీలో చేరే అవకాశం ఉంది.
ఇటీవల ఖమ్మంలో తొలిసారి బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించారు. దీని తర్వాత.. ఏపీలో నిర్వహిస్తారని అనుకున్నా.. వ్యూహాత్మకంగా దీనిని మరాఠా వైపు మళ్లించారు. పోలవరం వివాదం, జల జగడాలు.. రాజధాని అమరావతి పరిస్థితి, విశాఖ ఉక్కు వంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో బీఆర్ ఎస్ అక్కడ సభ పెడితే.. వాటిని ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ రెండో సభను నాందేడ్లో ఏర్పాటు చేయడం గమనార్హం.
This post was last modified on February 5, 2023 7:54 pm
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…
హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ…
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో సెన్సేషనల్ హిట్ కొట్టారు. మిడ్ రేంజ్ బడ్జెట్లో…