వైసీపీ నేతలకు..టీడీపీ నేతలకు ఎంత దూరం అంటే.. చాలా చాలా దూరమేనని చెప్పాలి. పైగా ఒకరు ఉత్తరం అయితే.. మరొకరు దక్షిణం కూడా.. రెండు పార్టీ లనాయకులు ఎదురు పడే సందర్భాలు కూడా చాలా అరుదు. అంతేకాదు.. ఒకరిపై ఒకరు దూషణలు కూడా చేసుకుంటున్న పరిస్థితి పెరిగిపోయింది. అయితే.. అలాంటి సమయంలో ఏకంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో కలిసి ప్రయాణించారు వైసీపీ నేత ఒకరు.
ఇది యాదృచ్ఛికంగానే జరిగింది. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లే ఒక విమానంలో చంద్రబాబు ప్రయాణించారు. అయితే.. అనూహ్యంగా ఇదే విమానంలో వైసీపీ నాయకుడు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి కూడా ప్రయాణించారు. అంతేకాదు.. విమానాశ్రయ సిబ్బంది ఇద్దరికీ కూడా పక్కపక్కనే సీట్లు కేటాయించడంతో చంద్రబాబు పక్కనే మీరా కూడా కూర్చొని ప్రయాణించారు.
అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబుతో ఆయన పిచ్చాపాటీ మాటలు కలిపారు. ఈ క్రమంలో అమరావతి రాజధాని గురించిన చర్చ జరిగింది. ఎందుకంటే.. వైసీపీ నాయకుడు మీరా ఈ ప్రాంతానికిచెందిన వారే. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలియడంతో చంద్రబాబు అమరావతి గురించి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసి ఉన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన మీరా వలి.. తాను వైసీపీ నాయకుడినేనని.. అయినప్పటికీ చంద్రబాబు విజన్కు మాత్రం ఫిదా అవుతానని చెప్పారు. అంతేకాదు.. అమరావతి డెవలప్ కావాలంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని మీరా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…