వైసీపీ నేతలకు..టీడీపీ నేతలకు ఎంత దూరం అంటే.. చాలా చాలా దూరమేనని చెప్పాలి. పైగా ఒకరు ఉత్తరం అయితే.. మరొకరు దక్షిణం కూడా.. రెండు పార్టీ లనాయకులు ఎదురు పడే సందర్భాలు కూడా చాలా అరుదు. అంతేకాదు.. ఒకరిపై ఒకరు దూషణలు కూడా చేసుకుంటున్న పరిస్థితి పెరిగిపోయింది. అయితే.. అలాంటి సమయంలో ఏకంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో కలిసి ప్రయాణించారు వైసీపీ నేత ఒకరు.
ఇది యాదృచ్ఛికంగానే జరిగింది. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లే ఒక విమానంలో చంద్రబాబు ప్రయాణించారు. అయితే.. అనూహ్యంగా ఇదే విమానంలో వైసీపీ నాయకుడు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి కూడా ప్రయాణించారు. అంతేకాదు.. విమానాశ్రయ సిబ్బంది ఇద్దరికీ కూడా పక్కపక్కనే సీట్లు కేటాయించడంతో చంద్రబాబు పక్కనే మీరా కూడా కూర్చొని ప్రయాణించారు.
అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబుతో ఆయన పిచ్చాపాటీ మాటలు కలిపారు. ఈ క్రమంలో అమరావతి రాజధాని గురించిన చర్చ జరిగింది. ఎందుకంటే.. వైసీపీ నాయకుడు మీరా ఈ ప్రాంతానికిచెందిన వారే. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలియడంతో చంద్రబాబు అమరావతి గురించి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసి ఉన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన మీరా వలి.. తాను వైసీపీ నాయకుడినేనని.. అయినప్పటికీ చంద్రబాబు విజన్కు మాత్రం ఫిదా అవుతానని చెప్పారు. అంతేకాదు.. అమరావతి డెవలప్ కావాలంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని మీరా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
This post was last modified on February 4, 2023 10:36 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…