వైసీపీ నేతలకు..టీడీపీ నేతలకు ఎంత దూరం అంటే.. చాలా చాలా దూరమేనని చెప్పాలి. పైగా ఒకరు ఉత్తరం అయితే.. మరొకరు దక్షిణం కూడా.. రెండు పార్టీ లనాయకులు ఎదురు పడే సందర్భాలు కూడా చాలా అరుదు. అంతేకాదు.. ఒకరిపై ఒకరు దూషణలు కూడా చేసుకుంటున్న పరిస్థితి పెరిగిపోయింది. అయితే.. అలాంటి సమయంలో ఏకంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో కలిసి ప్రయాణించారు వైసీపీ నేత ఒకరు.
ఇది యాదృచ్ఛికంగానే జరిగింది. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లే ఒక విమానంలో చంద్రబాబు ప్రయాణించారు. అయితే.. అనూహ్యంగా ఇదే విమానంలో వైసీపీ నాయకుడు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి కూడా ప్రయాణించారు. అంతేకాదు.. విమానాశ్రయ సిబ్బంది ఇద్దరికీ కూడా పక్కపక్కనే సీట్లు కేటాయించడంతో చంద్రబాబు పక్కనే మీరా కూడా కూర్చొని ప్రయాణించారు.
అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబుతో ఆయన పిచ్చాపాటీ మాటలు కలిపారు. ఈ క్రమంలో అమరావతి రాజధాని గురించిన చర్చ జరిగింది. ఎందుకంటే.. వైసీపీ నాయకుడు మీరా ఈ ప్రాంతానికిచెందిన వారే. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలియడంతో చంద్రబాబు అమరావతి గురించి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసి ఉన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన మీరా వలి.. తాను వైసీపీ నాయకుడినేనని.. అయినప్పటికీ చంద్రబాబు విజన్కు మాత్రం ఫిదా అవుతానని చెప్పారు. అంతేకాదు.. అమరావతి డెవలప్ కావాలంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని మీరా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…